India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పోలీసు చెక్ పోస్టుల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 21,27,330 సీజ్ చేసినట్లు ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. అలాగే రూ. 17,06,600 విలువగల ఫ్రీ బీస్, రూ.9,75,800 విలువైన 2535.800 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు వివరించారు. వీటిని ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీకి అప్పగించినట్లు వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?
ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.
సంగారెడ్డి జిల్లా కంది తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి బుధవారం హల్చల్ చేశారు. కాశీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య తన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెల్ టవర్ ఎక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దిగాలని కోరారు. అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అతను కిందకు దిగాడు.
ఓ యువతి అదృశ్యమైన ఘటన పటాన్చెరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్కు చెందిన యువతకి పెళ్లి కుదరడంతో బట్టలు, ఇతర సామగ్రి కొనేందుకు ముత్తంగిలో బంధువుల ఇంటికి వచ్చింది. షాపింగ్ అనంతరం ఆ యువతిని బంధువులు ఖేడ్ బస్సు ఎక్కించగా ఆమె ఇంటికి వెళ్లలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మెదక్ MP అభ్యర్థి వెంకట్రామారెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులను సిద్దిపేట కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే జిల్లాలో ప్రస్తుత వేసవి సీజన్లో డీఆర్డీఏపై పెనుభారం పడనుంది. సెర్ప్ ఉద్యోగులు ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా ఉండగా, ఈజీఎస్ ఉద్యోగులు ప్రస్తుత వేసవిలో ఉపాధి హామీ పనుల్లో కీలకంగా పనిచేయనున్నారు. ఈ సస్పెన్షన్తో కొనుగోళ్లు, ఉపాధి హామీ పనుల్లో ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్గొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్కూక్ మండలం చేబర్తి, నర్సన్నపేట గ్రామాల రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని, సీఎం దృష్టికి మీ సమస్య తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ నరసింహారెడ్డి (48) మృతి చెందాడు. యావపూర్కు చెందిన సురేందర్ రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న నరసింహారెడ్డి ద్విచక్ర వాహనంపై 4న వెళ్తున్నాడు. యావపూర్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలకు బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 17న నిర్వహించనున్న శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు రఘునందన్ రావును ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మెదక్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ క్రోధి నామ ఉగాది సందర్బంగా మంగళవారం సాయంత్రం పంచాంగ పఠనం చేశారు. అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు వైద్య రాజు పంతులు పంచాంగ పఠనం గావించారు. ఈ సందర్బంగా ద్వాదశ రాశులకు సంబంధించి గోదారా ఫలాలు, తెలుగు సంవత్సరంలో రాజు, మంత్రి, పశు పాలకుడు తదితర వివరాలు వినిపించారు. అలాగే ఆదాయం, ఖర్చు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.