Medak

News April 9, 2024

MDK: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి: జగ్గారెడ్డి

image

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని పంచాంగంలో పండితుడు తెలిపినట్లు ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాని జగ్గారెడ్డి అన్నారు.

News April 9, 2024

MDK: పండగ పూట విషాదం

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి శివారులో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన ఎరుకల మహేశ్(21) ఉగాది పండగ నేపథ్యంలో మామిడి ఆకుల కోసం పల్సర్ బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న మరో బైక్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో మహేశ్‌ కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు.

News April 9, 2024

MDK: 106 మంది ఉద్యోగులు సస్పెండ్

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అధికారులపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశంలో పాల్గొన్న వారిని సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన అధికారులు 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులను ఎన్నికల నిబంధన మేరకు వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 9, 2024

ఆకుపై చిత్రాలతో ఉగాది శుభాకాంక్షలు

image

నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకు మార్ తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా మర్రి ఆకులపై మామిడి కాయ, కోయిల చిత్రాలను మలిచారు. ఈరోజు ఉగాది పచ్చడికి వినియోగించే మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, చెరకు గడలు, ఆహ్లాదకర వాతావరణం, పచ్చని చెట్లు, కోయిలలు, చిలకలు, ఉగాది పచ్చడితో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళ చిత్రాలను గీసి క్రోధి నామ సంవత్సరానికి ఆయన స్వాగతం పలికారు.

News April 9, 2024

MDK: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ వాసి కృష్ణ(33) అమీన్‌పూర్ పురపాలక పరిధి మల్లారెడ్డి కాలనీలోని గెరడా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా 10 రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2024

సిద్దపేట: చిరుతను కొట్టి చంపి.. తగలబెట్టి..

image

చిరుతను కొట్టి చంపి తగలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. FRO సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దపేట జిల్లా దౌల్తాబాద్ అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితం సాయిలు, మరో ముగ్గురు కలిసి అడవి పందుల కోసం వల పెట్టగా.. అందులో చిరుత చిక్కింది. భయాందోళనకు గురైన వారు చిరుతను కర్రలతో కొట్టి చంపి ఆనవాళ్లు లేకుండా కళేబరాన్ని తగులబెట్టారు. పోలీసులు సాయిలును అదుపులోకి తీసుకొని విచరణ చేపట్టారు.

News April 9, 2024

సిద్దిపేట: ఉద్యోగాల పేరిట సైబర్ మోసం

image

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు టోపీ పెట్టి రూ. 20 లక్షలు కాజేసిన సంఘటనలు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నాయి. సీపీ అనురాధ వివరాల ప్రకారం.. సిద్ధిపేట పట్టణానికి చెందిన ఒక యువతి, నంగునూరు మండల కేంద్రానికి చెందిన మరొక యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా గూగుల్లో ఓ గుర్తు తెలియని లింకులో తమ వివరాలు నమోదు చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

News April 9, 2024

మెదక్: ‘మా పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటుంది’

image

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపులో పెట్టి చూసుకుంటుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందునాయక్ ఆధ్వర్యంలో శిలాజి నగర్, టేకులతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 9, 2024

సంగారెడ్డి: గ్రూప్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్- 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సోమవారం తెలిపారు. సంగారెడ్డి హాస్టల్ గడ్డలోని సమీకృత వసతి గృహంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులు నేరుగా దరఖాస్తుల సమర్పించాలన్నారు.

News April 8, 2024

పటాన్‌చెరు: రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ విద్యార్థి మృతి

image

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ విద్యార్థి ఆకుల అరుణ్ (23) మృతిచెందాడు. ఇస్నాపూర్ వెళ్లే దారిలో అరుణ్ ప్రయాణిస్తున్న బైకును ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈఘటనలో అరుణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కామారెడ్డికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పఠాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.