India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేదవాడికి ప్రాథమిక హక్కుగా అందాల్సిన విద్యా, వైద్యంపై జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిపారు. త్వరలో మెదక్లో సిటీ స్కాన్తో పాటు మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకు పరిమితం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టైం టేబుల్ అమలు చేయాలని కోరారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో లోపంతో డెంగ్యూ జ్వరాలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తడకపల్లి గ్రామానికి చెందిన కనకలక్ష్మి డెంగ్యూ జ్వరంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవలు అందక, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం భూమి అమ్ముకొని రూ.25 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం కాపాడుకోలేక పోయారని అన్నారు.
సిద్దిపేటలోని గాంధీ చౌరస్తాలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రకృతి ప్రేమిద్దాం.. మట్టి వినాయకులను పూజిద్దాం అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని అన్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశావర్కర్పై ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్ డేవిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆశాల సమావేశానికి వచ్చిన వారిపై విచక్షణ కోల్పోయి బూతులు తిడుతూ బయటికి గెంటేశాడు. దాడికి పాల్పడిన అనిల్ డేవిడ్ను విధుల నుంచి తొలగించాలని మండల వైద్యాధికారి సాయి సింధుకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆశాలు తెలిపారు.
వినాయక నవరాత్రి వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. జోగిపేటలో శాంతి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జనం ఒకేసారి రావడంతో ఇరువర్గాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి కాసేపు టీచరుగా మారి కేజీబీవీ విద్యార్థులకు పాఠాలు బోధించారు. మంగళవారం దుబ్బాక మండల కేంద్రంలో కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి అధికవర్షాలతో కురుస్తున్న డార్మెటరీని, అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్ను కలెక్టర్కు చూపించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ₹4 లక్షల నుంచి ₹5 లక్షలకు ఎక్స్గ్రేషియా పెంచామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఎకరానికి ₹10 వేల నష్టపరిహారం, మృత్యువాత పడ్డ పాడిగేదెకు ₹30 నుంచి ₹50 వేలు మేక, గొర్రెకు మూడు నుంచి ₹5వేల ఆర్థికసాయం ప్రభుత్వమందిస్తుందన్నారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో దారుణం జరిగింది. గొల్లగూడెం గ్రామాలో చేతబడి నెపంతో రాములు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో రాములుకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ దాడిలో మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, వారిని జోగిపేట ఆస్పత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
భారీ వర్షాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు 165 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారి ద్వారా అంచనా వేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 223 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.