Medak

News April 8, 2024

మెదక్: తేనె మంచు పురుగుతో మామిడి రైతుల ఆందోళన

image

మామిడి రైతుకు గడ్డుకాలమొచ్చింది. పూత, కాత కాసినప్పటికీ అధిక ఉష్ణోగ్రత, తెగుళ్లతో అంతా రాలిపోతుంది. ఫలితంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెదక్ జిల్లావ్యాప్తంగా 2,600 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వీటిలో సింహభాగం బంగినిపల్లి రకం సాగు చేశారు. కాగా మామిడికి పూత ఏటా డిసెంబర్‌ నెలాఖరున వస్తుండగా ఈ ఏడాది జనవరిలో వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

News April 8, 2024

MDK: మొర్రి పండ్ల కోసం వెళ్లి యువకుడి మృతి

image

మొర్రి పండ్ల కోసం వెళ్లిన యువకుడు విద్యుదాఘతంతో మృతి చెందిన ఘటన హవేలీ ఘనపురం మండలం శాలిపేట శివారులో సోమవారం జరిగింది. బూరుగుపల్లికి చెందిన బాజా కిషోర్(20) మొర్రి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ పెద్ద లైన్ చెట్టుకు తగిలి అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా మృతి చెందాడు. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు.

News April 8, 2024

మినీ ఇండియా పటాన్‌చెరుపైనే అందరి దృష్టి..!

image

మినీ ఇండియాగా పేరుపడిన పటాన్‌చెరు నియోజకవర్గంపై అన్ని పార్టీల దృష్టి సారించాయి. 3 లక్షలపై చిలుకు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో విభిన్న రకాల ప్రజలు ఉన్నారు. పటాన్ చెరులో ఆధిక్యత వస్తే గెలుపు సులువు అనే ధీమాలో పార్టీలు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ప్రాంతంలో ఫోకస్ పెట్టాయి. ఎక్కువ ఓట్లు కొల్లగొట్టి తమ గెలుపుకు బాటలు వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

News April 8, 2024

ఉత్తమ రక్తదాతగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డికి ఉగాది పురస్కారం

image

ఉత్తమ రక్తదాతగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి ఉగాది పురస్కారం అందుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో రక్త, అవయవ దానాలపై విస్తృత ప్రచారం చేస్తూ, 52 మార్లు రక్తదానం చేసి లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ మెదక్ శాఖ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఇప్పటివరకు 4,127 యూనిట్లను సేకరించగా రెడ్డి గర్జన జాతీయ మాసపత్రిక, సామాజిక సంస్థ ఈ అవార్డు అందజేసింది.

News April 8, 2024

మెదక్: వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు

image

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఎన్నికల నిబంధన ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలుపుతూ సిద్దిపేట త్రీ టౌన్ కేసు నమోదు చేశారు. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా ఐకెపి, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఎంపీ అభ్యర్థితోపాటు మాజీ సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు.

News April 8, 2024

మెదక్: మిస్టరీగా ఉపాధ్యాయుడి మిస్సింగ్ కేసు..

image

మెదక్ జిల్లా మాసాయిపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు నాగరాజు మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. మార్చి 28న పాఠశాలలో విధులు ముగించుకొని చేగుంటలో తన నివాసానికి చేరుకున్న టీచర్ 29 నుంచి కనిపించకుండా పోయారు. 31న నాగరాజు కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నేటి వరకు సదరు టీచర్ ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.

News April 8, 2024

పటాన్‌చెరు: ఆన్‌లైన్‌లో ఉద్యోగం అంటూ మోసం

image

సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేసిన ఘటన అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయిభగవాన్ కాలనీలో ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫోన్‌కు పార్ట్ టైం జాబ్ అంటూ లింక్ వచ్చింది. తొలుత పెట్టుబడి పెట్టి టాస్క్‌లు చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పడంతో రూ.5 వేలు పెట్టుబడి పెడితే కమీషన్ వచ్చింది. దీంతో పలు దఫాలుగా రూ.11.10 లక్షలు పంపాడు. అనంతరం మోసపోవడంతో బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

News April 8, 2024

పటాన్‌చెరు: తండ్రి తిట్టాడని కొడుకు ఆత్మహత్య

image

తండ్రి మందలించాడని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI మహేశ్వర్‌రెడ్డి వివరాలు.. గుమ్మడిదల చెందిన బాలేశ్‌ చిన్న కుమారుడు నవీన్‌(24) ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. నవీన్ ఈనెల 4న డబ్బులు అడగ్గా ఏ పని లేకుండా ఎన్ని రోజులు తిరుగుతావని తండ్రి మందలించారు. దీంతో నవీన్‌ అదే రోజు మధ్యాహ్నం పురుగు మందు తాగి సోదరికి ఫోన్ చేశాడు. సూరారాంరోని ఆసుపత్రిలో తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

News April 8, 2024

జహీరాబాద్: గెలుపే లక్ష్యంగా వ్యూహాలు !

image

ZHB లోక్‌సభ స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారికి ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ, ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ముందుకెళ్తుంది. మోదీతోపాటు పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభలకు BJP ప్లాన్ చేస్తుంది. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ పోరుకు BRS సన్నద్ధమవుతోంది.

News April 7, 2024

MDK: KCR, హరీశ్‌రావుపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు 

image

మామ, అల్లుడిని ఇంటికి పంపే వరకు నిద్రపోనని మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు KCR, హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. గజ్వేల్‌లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటపై ఫోకస్ చేశానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలో దిగుతానని, గజ్వేల్‌లో నర్సారెడ్డి కూతురిని MLAని చేస్తానన్నారు. KCR, హరీశ్‌రావును వదిలిపెట్టనన్నారు.