India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కొమరం భీం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని రాహుల్ రాజ్ అన్నారు.

బతుకమ్మ పండుగకు పుట్టింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చేర్యాల(M) ఆకునూరులో చోటుచేసుకుంది. హన్మకొండ(D) క్యాతంపల్లికి చెందిన సౌమ్య(22 నాలుగేళ్ల క్రితం ఆకునూరుకు చెందిన శ్రావణ్కు ఇచ్చి వివాహం చేయగా, ఏడాదిన్నర కూతురు ఉంది. బతుకమ్మకు పుట్టింటికి సౌమ్యను పంపకపోవడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ సిద్దిపేటలో ఓ ఆసుపత్రిలో బుధవారం మృతిచెందిందని SI నీరేష్ తెలిపారు.

ఈ నెల 19న తెలంగాణా హై కోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా జడ్జి లక్ష్మీ శారద అధికారులను ఆదేశించారు. కోర్టు సెమినార్ హాల్లో బుధవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏడుపాయల దర్శనం, మెదక్ చర్చ్, అల్లాదుర్గ్లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ సందర్శిస్తారు. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తదితరులు ఉన్నారు.

మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పాంబండ తండాకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి తక్షణం వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.

మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్లో <<14373400>>ఏడుగురు మరణించిన<<>> విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. రత్నాపూర్, పాంబండ, తాళ్లపల్లి తండాలకు చెందిన వారు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన కారు రహదారిపై ఉన్న గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రోడ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

హిమాచల్ ప్రదేశ్లోని మౌంట్ పాతల్స్ పర్వతాన్ని (4,250mtrs)& (14,600 feets) సిద్దిపేట జిల్లా హనుమతండాకు చెందిన బాలుడు జాటోత్ విహాన్ రామ్ అధిరోహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “Say No To Drugs”అనే నినాదం పట్ల యువతకు అవగాహన కల్పించడానికి పర్వతాన్ని అధిరోహించినట్లు విహాన్ రామ్ తెలిపారు. అతి పిన్న వయస్సులో విహాన్ రామ్(8) ప్రతికూల వాతావరణంలో అధిరోహించాడు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ట్రాఫిక్ పోలీసులకు బైకులను పంపిణీ చేస్తారన్నారు. 11 గంటలకు శివంపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వివరించారు.

వారిద్దరూ అన్యోన్య దంపతులు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి జీవనం సాగించారు. అయితే విధి వారి బంధాన్ని విడదీసింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేటకు చెందిన పూల శంకర్(55), రాధ భార్యాభర్తలు. సోమవారం ప్రమాదవశాత్తు శంకర్ మురికి కాలువలోపడి మృతి చెందాడు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో రాధ అంతా తానై భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. తానే భర్తకు తలకొరివి పెట్టింది. ఈఘటన బంధువులను కంటతడి పెట్టించింది.

అందోల్ నియోజకవర్గంలోని చౌటకుర్ మండలం తాడ్దన్ పల్లిలోని యంఏస్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు ఉ.11 గంటల నుంచి ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

పుల్కల్ మండలం సింగూరు నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సింగూరు గ్రామానికి చెందిన విటల్ (42) శనివారం సాయంత్రం స్నానం కోసం సింగూరు నదిలోకి వెళ్లారు. సింగూరు దిగువ భాగాన స్నానం చేస్తుండగా నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.