India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువకులు సెల్ఫీల కోసం వరద ప్రవాహాల వద్దకు వెళ్లే లాంటి ప్రయోగాలు చేయకూడదని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రహదారుల వంతెనలపై నీరు ప్రవహిస్తుండడంతో అటువైపుగా ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. సమస్యలు ఉంటే వెంటనే 8712657888కి సమాచారం ఇవ్వాలన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల్లో ఉండాలని పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా చెక్ డ్యామ్ లు, చెరువులు నిండాయా, చెరువు తూంలు దుంకుతున్నాయా అని పార్టీ నేతలతో మాట్లాడి ఆరా తీశారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల నుండి మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు కుక్కలు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలు చాలా గ్రామాల్లో ప్రజలను ప్రమాదాలకు గురి చేస్తున్నా యి. ఈ మధ్యకాలంలోనే దుబ్బాకలో పూరి గుడిసెలో ఉన్న ముసలమ్మపై దాడి చేసిన సంఘటన తెలిసిందే. దాదాపు కుక్కల గుంపులో 50 నుండి 100 వరకు కుక్కలు ఉండి గ్రామాల్లో ఇష్టానుసారంగా సంచరిస్తున్నాయి. వీటిపై దృష్టిపెట్టాలని అంటున్నారు.
పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుండు లక్ష్మణ్ ను పిఆర్టియు మెదక్ జిల్లా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ, అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు మల్లారెడ్డి, రవి కుమార్, చంద్రశేఖర్, సంతోష్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్కు ఎంపికైన ఫ్రెష్, రెన్యువల్ అభ్యర్థులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేది వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 15 లోపు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో వెరిఫికేషన్ చేయాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులను మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు అప్రమత్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
✒సంగారెడ్డి- 08455 276155
✒మెదక్- 9391942254
✒సిద్దిపేట- 8457230000, 8712667100
మెదక్ జిల్లా పాపన్నపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆసక్తికర పోటీ నెలకొంది. తల్లీకొడుకులు, భావబామ్మర్దులు, సీనియర్ నాయకులు పోటీలో ఉన్నట్లు తెలిసింది. ఛైర్మన్ SC రిజర్వు కావడంతో పోటీ పరిమితంగానే ఉన్నా.. MLA, మాజీ MLA మైనపల్లి రోహిత్, హన్మంతరావు మద్దత కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాపన్నపేట మెదక్ జిల్లాలోనే పెద్ద మండలం. 40 పంచాయతీలు, చుట్టూ మంజీర నది ఉండటంతో వ్యవసాయం పరంగా అభివృద్ధి చెందింది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. హుస్సేన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అడ్మిషన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, కళాశాలలోని అభ్యాసక కేంద్ర కో ఆర్డినేటర్ తిరుమల రెడ్డిని సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08455 276155 నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో వర్షాలపై సమీక్ష శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా వర్షాలతో ఇబ్బంది పడితే నేరుగా ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.