Medak

News August 31, 2024

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

రాబోయే రెండు మూడు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటల నీటి ప్రవాహం గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నుంచి వరంగల్ రహదారిలో వెళ్లే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

News August 31, 2024

మెదక్ జిల్లాకు రెడ్ అలెర్ట్, కంట్రోల్ రూం ఏర్పాటు

image

భారీ వర్ష సూచన నేపథ్యంలో మెదక్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 9391942254 అందుబాటులో ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు.

News August 31, 2024

పాలిటెక్నిక్ కళాశాల అప్ గ్రేడ్ లేనట్టేనా !

image

జహీరాబాద్ రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అప్ గ్రేడ్ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. ఇంజినీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రంలోని 11 పాలిటెక్ని‌లను పరిశీలన చేసి ఎన్బీఏ చేసిన జాబితాలో రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలకు చోటు దక్కలేదు. 

News August 31, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

దుబ్బాక: పుట్టిన రోజునే.. కొడుకు కళ్లముందే తల్లి ఆత్మహత్య

image

దుబ్బాక మండలం గంభీర్పూర్‌లో రవళి(25) పుట్టిన రోజునే కొడుకు కళ్ళేదుటే ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం భర్త సాగర్ రెడ్డి ఉద్యోగానికి వెళ్లగా, మామ బయటకు వెళ్లాడు. పెద్ద కుమారుడిని అంగన్వాడీ కేంద్రానికి పంపి అనంతరం రెండేళ్ల కుమారుడి ముందు ఉరేసుకుంది. తల్లి చీరను పట్టుకొని బాలుడు ఏడవడంతో స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 31, 2024

మెదక్: ఒకే రోజు ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. దుబ్బాకకి చెందిన నవీన్(25) అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరేసుకోగా.. చిన్నచింతకుంటకు చెందిన యువకుడు(17) హస్టల్‌లో ఉండి చదువుకో అని తల్లిదండ్రులు మందలించడంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌కు చెందిన సందీప్(37) మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 15 తండ్రితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు.

News August 31, 2024

బ్యాంకు అకౌంట్ తప్పిదాలను సరి చేసుకోవాలి: AO

image

ఆధార్ కార్డు, బ్యాంక్ రుణం అకౌంట్‌లో తప్పిదాలతో రుణమాఫీ కాలేదో అలాంటి రైతులు బ్యాంకుకు వెళ్లి సరి చేసుకోవాలని సిర్గాపూర్ AO శశాంక్ తెలిపారు. ప్రతి బ్యాంక్‌లో ఒక నోడల్ అధికారికి కరెక్షన్, ఎడిట్ ఆప్షన్ ఇచ్చామన్నారు. రైతులు సెప్టెంబర్ 7 వరకు బ్యాంక్‌కు వెళ్లి తమ ఆధార్ కార్డుపై ఉన్న బ్యాంక్ అకౌంట్ పేరు ఉండేలా కరెక్షన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 31, 2024

సంగారెడ్డి: ‘షీ టీం యాక్టివ్‌గా పని చేయాలి’

image

జిల్లాలో మహిళా భద్రత కోసం షీ టీం యాక్టివ్‌గా పని చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళల భద్రతపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. షీ టీమ్‌లు డివిజన్ల వారీగా బస్టాండ్, స్కూల్, కళాశాల ప్రాంతాల్లో నిత్యం గస్తీ ఉంచాలని చెప్పారు. సమావేశంలో ఎస్ బీ సీఐ విజయ్ కృష్ణ, నార్కోటిక్ సీఐ రమేష్ పాల్గొన్నారు.

News August 30, 2024

MDK: మండపాలకు పర్మిషన్.. ఇవి తప్పనిసరి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల మరో కీలక సూచన.
➤ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీని PSలో సమర్పించాలి
➤రూ.145‌‌తో మీసేవా చలాన్ తీసుకోవాలి (అదనపు ఛార్జీ రూ.100)
➤ఎలక్ట్రిసిటీ DD తప్పనిసరి
➤ఆర్గనైజర్ల ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఐదుగురివి జతచేయాలి
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC తీసుకోండి
వీటన్నింటినీ జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే పోలీస్ అనుమతి పొందవచ్చు.
SHARE IT

News August 30, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిది మంది జడ్జిలకు పదోన్నతి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సివిల్ జడ్జిలు(సీనియర్ డివిజన్)గా ఎనిమిది మంది పదోన్నతి పొందారు. రిటా లాల్ చంద్(మెదక్), శివ రంజని (సిద్దిపేట), అనూష (జహీరాబాద్), లక్ష్మణ చారి, షాలిని (సంగారెడ్డి), సౌమ్య (గజ్వెల్), చందన (సిద్దిపేట), అనిత(నర్సాపూర్) ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41మంది జడ్జిలు పదోన్నతి పొందారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.