Medak

News April 4, 2024

సంగారెడ్డి: ఎన్నికల శిక్షణకు హాజరుకాని 101 మందికి నోటీసులు

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఎన్నికల శిక్షణకు హాజరుకాని 101 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకుంటే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.

News April 4, 2024

సిద్దిపేట: ఇంట్లోకి వెళ్లి కొట్టి కేసులో ఇద్దరికి జైలు

image

అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి కొట్టిన కేసులో నేరస్థులిద్దరికీ 6 నెలల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. రాఘవాపూర్ కు చెందిన గ్యార చంద్రకళ(39)పై గ్యార వెంకటమ్మ, గ్యార శ్రీనివాస్ పాతకక్షలతో 2016, జనవరి 1న దాడి చేయగా దీనిపై చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి నిందితులకు 6 నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు.

News April 4, 2024

మెదక్ జిల్లాలో ముదురుతున్న ఎండలు

image

మెదక్ జిల్లాలో రెండు మూడు రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం గరిష్టంగా 40° డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పగటి పూట రహదారులు అన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు కూడా పగటి పూట బయటకు రాకూడదు అని ఏదైనా పని ఉంటే ఉదయం సాయంత్రం చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 4, 2024

మెదక్: రైతు కేంద్రంగా రాజకీయం..!

image

ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే సీటు గెలుస్తామని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మెదక్‌లో రైతు కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం కరువుకు కారణం మీరంటే మీరేనని దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

News April 4, 2024

సంగారెడ్డి: మరో కార్మికుడి మృతదేహం లభ్యం

image

ఎస్‌బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఓ కార్మికుడి మృతదేహం ఘటన స్థలంలో లభ్యమైంది. మృతుడు కొన్యాలకి చెందిన వడ్డే రమేశ్‌గా పోలీసులు గుర్తించారు. చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్లతో కలిసి పరామర్శించారు.

News April 4, 2024

మెదక్: పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ‘సీ– విజిల్‌’

image

ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ–విజిల్‌ యాప్‌ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడనుంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు మెదక్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కేంద్రంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

News April 4, 2024

సంగారెడ్డి ప్రమాదంలో మృతుల వివరాలు..

image

సంగారెడ్డి జిల్లాలో <<12982731>>ఘోర ప్రమాదం<<>> సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. 15 మందికి గాయాలవ్వగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు.. ఎండీ, డైరెక్టర్‌ రవికుమార్‌ (హైదరాబాద్‌), ప్రొడక్షన్ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యం (36), దయానంద్‌ (48), సురేష్‌పాల్‌ (43), కార్మికుడు విష్ణు (35)గా గుర్తించారు. ఈ పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష జరిపారు.

News April 4, 2024

మెదక్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్!

image

మెదక్ మున్సిపాలిటీలో BRS పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. ముగ్గురు కౌన్సిలర్లు మేడి కళ్యాణి మధుసూదన్ రావు, వసంత రాజ్, జయ శ్రీ దుర్గాప్రసాద్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యులు మందుగుల గంగాధర్.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ మధుసూదన్ రావు, మాజీ డైరెక్టర్ కొండా శ్రీనివాస్, నాయకులు బోయిని విక్రం, స్టీవెన్ ఉన్నారు.

News April 4, 2024

సంగారెడ్డి: ‘వడదెబ్బకు దూరంగా ఉందాం’

image

వేసవిలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉందన్న వడదెబ్బకు దూరంగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను బుధవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు సాధ్యమైనంత వరకు రావద్దని చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశాంక్ దేశ్పాండే పాల్గొన్నారు.

News April 3, 2024

శివంపేట: భార్యతో గొడవ పడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు !

image

మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్‌పల్లికి గ్రామానికి చెందిన అరికెల కృష్ణ(36) కనిపించకుండా పోయాడు. మంగళవారం భార్య అనితతో గొడవ పడిన కృష్ణ ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.