Medak

News April 2, 2024

MDK: ఎన్నికల సీజన్‌లో ఎండల మోత..!  

image

ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లోనే ఎండలు మోత మోగిస్తున్నాయి. ఉ.8 అయిందంటే చాలు బయటకు వెళ్లలేని పరిస్థితి. కానీ ఇది ఎన్నికల సీజన్ కావడంతో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ శ్రేణులకు ఎండలో తిరిగి ప్రచారం చేయడం తప్పడం లేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడితో ప్రచారంలో పాల్గొన్న వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  

News April 2, 2024

MDK: అమ్మాయిని వేధించిన వ్యక్తికి జైలు శిక్ష

image

మెదక్ జిల్లా హవేలిఘనపూర్‌కు చెందిన గుండ్లకుంట బాబు(45)కు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి లక్ష్మీశారద తీర్పునిచ్చినట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. మండలానికి చెందిన అమ్మాయిని వేధిస్తూ.. ‘నా దగ్గరికి రాకపోతే మీ తల్లిని చంపేస్తా’ అని బెదిరించాడని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించినట్లు చెప్పారు.

News April 2, 2024

ఓయూ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

News April 2, 2024

MDK: విషాదం.. కుప్పకూలి మహిళ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్‌కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

సిద్దిపేట: బండి సంజయ్ మోడీ దగ్గర దీక్ష చేయాలి: మంత్రి పొన్నం

image

రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర దీక్ష చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మోదీ దగ్గర దీక్ష చేయాలన్నారు.

News April 2, 2024

సిద్దిపేట: ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తా: వెంకట్‌రామ్ రెడ్డి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సాయి సమావేశంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్‌రామ్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని, అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని, పేద కుటుంబాలకు ఒక రూపాయి ఖర్చుతో పేరు నమోదు చేసేలా ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. 

News April 2, 2024

BREAKING: MDK: యాక్సిడెంట్‌లో ఇద్దరు యువకులు మృతి

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఖాన్ మహల్‌కు చెందిన సాబిల్, రెహాన్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ స్థానిక రాంనగర్ చౌరస్తా సమీపంలో ఇసుక లారీని వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  

News April 2, 2024

సిద్దిపేట జిల్లా వాసికి మిస్ టీన్ గెలాక్సీ టైటిల్

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో USAలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

News April 2, 2024

MP ఎన్నికలు: మెదక్‌లో వీళ్లు ఓటేస్తే విజయమే..!

image

పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 19 ఏండ్ల వయస్సు ఓటర్లు 53,458 మంది, 30 సం.లోపు 3,96,228 మంది, 40 సం.లోపు ఉన్నవారు 5,02,897 మంది ఉన్నారు. నాలుగు పదుల వయస్సు దాటనివారు మొత్తం 9.53 లక్షల మంది ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో యువతే కీలకం కానుంది. మరి మీ ఓటు ఎటువైపు?

News April 2, 2024

ఉమ్మడి‌ మెదక్‌లో‌ పెరిగిన ఎండలు

image

ఉమ్మడి మెదక్‌‌లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు బయటకురాలేని పరిస్థితి నెలకొంటోంది. సోమవారం తెలంగాణలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చేర్యాల మండల చిట్యాలో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT