Medak

News April 1, 2024

రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించిందని సోమవారం సంగారెడ్డి డిపో మేనేజర్ తెలియజేశారు. రూ. 151 చెల్లిస్తే రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని, ఇందుకోసం టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాలలో సంప్రదించాలని తెలిపారు.

News April 1, 2024

క‌డియం శ్రీహ‌రి ప‌ద‌వికి రాజీనామా చేయాలి: హ‌రీశ్‌రావు

image

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన క‌డియం శ్రీహ‌రి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా పార్టీ వీడుతున్న వారిపై మండిపడ్డారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌డియం శ్రీహ‌రికి తగిన గుణ‌పాఠం చెప్పాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

News April 1, 2024

తెలంగాణలో రాక్షస పాలన సాగించిన బీఆర్ఎస్: ఎమ్మెల్యే వివేక్

image

తెలంగాణలో రాక్షస పాలన సాగించిన బిఆర్ఎస్‌కు గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. పీర్లపల్లిలో శ్రీ మల్లికార్జున ఆలయ ప్రతిష్ఠోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం లోకసభ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్తారని, ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు.

News April 1, 2024

పదివేల ఏళ్ల నాటి ఆదిమానవుడి చిత్రాలు

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ శివారులోని పాండవుల గుట్టపై సుమారు పదివేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు గీసిన చిత్రాలు ఉన్నట్లు హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీ రావు పేర్కొన్నారు. పాండవుల గుట్టపై ఉన్న చిత్రాలను పరిశోధక విద్యార్థి ప్రవీణ్ రాజ్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. బృహత్ శిలా యుగంలో చిత్రాలను గీసినట్లు ఆయన వివరించారు.

News April 1, 2024

సిద్దిపేట యువతికి UK టైటిల్‌

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు యూకేలో టైటిల్ కొట్టింది. సుహానీరావు ‘మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌’ గెలిచిన మొదటి దక్షిణాసియా వాసిగా నిలిచింది. దీంతో అమెరికాలో జరిగే గెలాక్సీ ఇంటర్నేషనల్‌ పోటీల్లో యూకే తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. మార్చిలో UKలోని వారింగ్‌టన్‌లోని పార్‌ హాల్‌లో 25 మంది యువతులతో పోటీపడింది.
-CONGRATS

News April 1, 2024

ఓయూ నూతన వీసీ ఎంపికపై కసరత్తు

image

ఓయూకు వచ్చే నెలలో కొత్త వీసీ రానున్నారు. వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 93 మంది ప్రొఫెసర్లలో అత్యధికంగా రిటైర్ అయిన అధ్యాపకులు, కొందరు ప్రొఫెసర్లు ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతోపాటు గతంలో వీసీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ల వివరాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

News April 1, 2024

మెదక్: పౌల్ట్రీ ఫామ్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి తన వ్యవసాయ పొలం వద్ద కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం పౌల్ట్రీ ఫామ్‌కు వెళ్లిన రవి అక్కడ ఉరివేసుకొని మృతిచెంది ఉన్నారు. కాగా బంధువులు రవి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసిన వెల్దుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

MDK, ZHB కాంగ్రెస్ ఇంఛార్జులుగా మంత్రులు రాజనర్సింహ, సురేఖ

image

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి మంత్రి కొండ సురేఖ, జహీరాబాద్ నియోజకవర్గానికి మంత్రి దామోదర రాజనర్సింహను ఇంఛార్జీగా, ఏఐసీసీ ఇంఛార్జీగా పీసీ విశ్వనాథ్‌ను నియమించారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

News April 1, 2024

సిద్దిపేట: రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు

image

సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. అన్నపూర్ణ రిజర్వాయర్‌ సామర్థ్యం 3.5టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.84 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. డెడ్‌ స్టోరేజీకి చేరి ఈ రిజర్వాయర్‌ ఎడారిని తలపిస్తుంది. రిజర్వాయర్‌ కింద పంటలు ఎండిపోవడంతో దేవుడా ఇదేం దుస్థితి అని రైతులు బోరున విలపిస్తున్నారు. రంగనాయక సాగర్‌ సామర్థ్యం 3టీఎంసీలు కాగా, ప్రస్తుతం టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్‌స్టోరేజీకి చేరింది.

News April 1, 2024

SRD: ‘ఎన్నికల్లో అక్రమాలపై పౌరులు ఫిర్యాదు చేయాలి’

image

ఎన్నికల్లో అక్రమాలపై పౌరులు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి చూసించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సి-విజిల్ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం, మతపరమైన ప్రసంగాలు తదితరాలపై సి-విజిల్ యాప్ ద్వారా జిల్లా యంత్రాంగానికి తెలపాలన్నారు. ఫిర్యాదుకు ఫొటోలు, వీడియోలు జత చేయాలని, 100 నిమిషాల్లో చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.