Medak

News March 28, 2024

కొండపాక: ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

image

కొండపాక ఎంపీపీ అధ్యక్షురాలు రాగల సుగుణ దుర్గయ్యపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బలపరీక్షలో తొమ్మిది మంది ఎంపీటీసీలు ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజుల్లో వైస్ ఎంపీపీ పీఠానికి బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.

News March 28, 2024

సంగారెడ్డి: బైక్, లారీ ఢీ.. యువకుడు మృతి

image

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. నిజాంపూర్ వైపు నుంచి సదాశివపేటకు బైక్ పై వెళ్తున్న యువకుడిని జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు సదాశివపేట మండలం వెల్లూర్ గ్రామస్థుడిగా గుర్తించారు.

News March 28, 2024

ఝారసంగం: BRSకు బిగ్ షాక్

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలానికి చెందిన 25 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు బీఆర్ఎస్‌ను వీడారు. అనంతరం జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.

News March 28, 2024

వేడెక్కిన మెదక్‌ లోక్‌సభ రాజకీయం

image

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురువైంది. ఇరు పార్టీలనేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ BRS నేతలు సెటైర్లు వేశారు.

News March 28, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు.. నేపథ్యమిదే!

image

2006లో పటాన్‌చెరు మండలం చిట్కుల్ జీపీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో ఉపసర్పంచ్‌గా, 2014లో ZPTC ఎన్నికలలో TRS పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానం చిట్కుల్ గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2023 పటాన్‌చెరు అసెంబ్లీకి BSP పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ సాధించాడు.

News March 28, 2024

MDK: చిరుత దాడిలో లేగ దూడ మృతి?

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపనయ్య మూసుకు తండా శివారులో లేగ దూడను గుర్తుతెలియని అడవి జంతువు చంపేసింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గుగులోత్ బిమ్లాకు చెందిన లేక దూడ మరణించింది. అయితే ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని, చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. చిరుత పులి దాడి పై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

News March 28, 2024

మెదక్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు

image

మెదక్ పార్లమెంటు స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుగా ప్రకటించగా.. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించింది. చిట్ట చివరకు రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ పేరును ప్రకటించింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో ప్రచారం జోరందుకోనుంది.

News March 28, 2024

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు

image

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. కొద్ది రోజులుగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో తాత్సారం జరిగిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మలతో పాటు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసిన విషయం తెలిసిందే. చివరకు నీలం మధు పేరును ప్రకటించారు.

News March 28, 2024

సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం: హరీశ్ రావు

image

సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం ఈనెల 29న మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలోని ఓ గార్డెన్‌లో 3వేల మందితో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయంతో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశానికి తరలివచ్చేలా చూడాలన్నారు.

News March 27, 2024

మెదక్: అత్తను హతమార్చిన అల్లుడు

image

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరులో దుబ్బగళ్ల సంగమ్మ (44)ను వరసకు  అల్లుడు హత్య చేసినట్లు అల్లాదుర్గం CI రేణుక రెడ్డి, SI మురళి తెలిపారు. ఈ నెల 20న సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మర్వెల్లికి చెందిన మల్లగుల్ల యేసు ఆమె ఇంటికి వచ్చాడు. రాత్రి ఆస్తి కోసం సంగమ్మను యేసు హత్య చేసి, ఆభరణాలు తీసుకొని పారిపోయినట్లు వివరించారు. ఈరోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.