Medak

News March 27, 2024

గుమ్మడిదల: మహిళ హత్య.. దొంగ స్వామీజీ అరెస్టు

image

పూజలు చేస్తామని నమ్మించి మహిళను హత్య చేసిన దొంగ స్వామీజీని అరెస్టు చేసినట్లు జిన్నారం సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొంతపల్లికి చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేసే మంచి జరుగుతుందని దొంగ స్వామీజీ శివ నమ్మించాడు. ఫిబ్రవరి 13న హత్య చేసి 4.3 తులాల బంగారం దొంగిలించాడు. పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

News March 27, 2024

రూ.100 కోట్లకు ఎంపీ స్థానాన్ని అమ్ముకున్న బీఆర్ఎస్: రఘునందన్ రావు

image

మెదక్ పార్లమెంటు స్థానాన్ని రూ.100 కోట్లకు బీఆర్ఎస్ అమ్ముకుందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై మాజీ మంత్రి హరీశ్ రావు పెత్తనం చేయడం సరికాదని చెప్పారు. దమ్ముంటే సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

News March 27, 2024

కరవును రాజకీయం చేయొద్దు: మంత్రి పొన్నం

image

బీఆర్ఎస్ కరవు, వర్షపాతానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరవుకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదని, అది ప్రకృతి ప్రభావం అని పేర్కొన్నారు. ప్రకృతిలో ఏర్పడ్డ ఇబ్బందులకు ఎవరూ బాధ్యులు కారన్నారు. వేసవిలో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

News March 27, 2024

ఏడుపాయలలో విషాద ఘటన

image

ఏడుపాయల చెక్‌డ్యామ్‌లో మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలానికి చెందిన సిద్ధిరాములు(31) వన దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. చెక్ డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు SI వెల్లడించారు. 

News March 27, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 27, 2024

MDK: విషాదం.. రైతు మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొత్త కాపు నరేందర్ రెడ్డి(53) చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం చింతకాయలు తెంపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందగా.. కుటుంబీకులు రాత్రి గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

MDK: KCRకు ఇచ్చే GIFT అదే: MLA

image

మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి BRS అధినేత KCRకు అసలైన గిఫ్ట్ ఇద్దామని ఆ పార్టీ శ్రేణులకు సంగారెడ్డి MLA చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినంత మాత్రాన శ్రేణులు నిరాశ చెందొద్దని, ఈసారి గెలుద్దామన్నారు.

News March 26, 2024

జహీరాబాద్: అడవిలో అస్థిపంజరం..!

image

జహీరాబాద్ మం. తూముకుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యమైనట్లు రూరల్ SI ప్రసాద్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫారెస్ట్ అధికారులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. 60 నుంచి 65 సంవత్సరాల మధ్యగల వృద్ధుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకల మాత్రమే మిగిలినట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరణ ఇచ్చారు.

News March 26, 2024

మెదక్: షాంపూ కోసం తల్లిని చంపాడు

image

షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి హత్య చేసిన సంఘటన మెదక్ మండలం రాజ్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవమ్మ(58)తో తన కుమరుడు నారాయణ షాంపూ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తల్లిని ఇటుకతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2024

మెదక్‌: రైలు కింద పడి సూసైడ్

image

రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడు మెదక్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.