Medak

News September 18, 2024

దుబ్బాక వస్త్రాలంకరణలో అయోధ్య బాల రాముడు

image

అయోధ్య బాలరాముడిని సిద్దిపేట చేనేత వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. దుబ్బాకలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ తయారు చేసిన చేనేత వస్ర్తాలతో నిన్న బాల రాముడు మెరిసిపోయారు. చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు.

News September 18, 2024

సంగారెడ్డి: టీవీ చూద్దామని పిలిచి.. చిన్నారిపై అత్యాచారం

image

చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న యువకుడు (18) ఇంట్లోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు ఫైల్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News September 18, 2024

సంగారెడ్డి: నవోదయలో ప్రవేశాలు.. ఈనెల 23 వరకు ఛాన్స్

image

వర్గల్ నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 23 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని కోరారు.

News September 18, 2024

అబద్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్‌ సర్కార్: హరీష్ రావు

image

అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్‌ సర్కార్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

News September 17, 2024

టేక్మాల్: మోడీ చిత్రపటానికి శాలువా కప్పి విషెష్

image

టేక్మాల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, బీజేపీ జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అశోక్, కొయిలకొండ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2024

MDK: ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్

image

కౌడిపల్లి ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కౌడిపల్లి ఆస్పత్రిని నేడు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది రమేష్, రాధాకృష్ణ, అహ్మద్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధుల్లో లేకపోవడంతో ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ డా. శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

News September 17, 2024

సంగారెడ్డి: 1200 మంది పోలీసులతో బందోబస్తు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 17న జరిగే వినాయక నిమజ్జనానికి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ సోమవారం తెలిపారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

News September 16, 2024

సంగారెడ్డి: రికార్డు ధర పలికిన గణపతి లడ్డూలు

image

వాడవాడలా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. కానుగుంటలో శ్రీఏకశిలా వరసద్ధి వినయాక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం లడ్డూ వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.2.02 లక్షలు పలికింది. గోవర్ధన్ రెడ్డి లడ్డూని దక్కించుకోగా.. మరో లడ్డూను రూ. 80 వేలకు విశాల్ గౌడ్ దక్కించుకున్నారు.

News September 16, 2024

గుండెపోటుతో టీచర్ మృతి.. నేత్రదానం

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మోడల్ స్కూల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ధ్యాప వెంకటస్వామి(49) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మృతుడి స్వస్థలం జగదేవ్పూర్ మండలం అలిరాజపేట గ్రామం. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, వయస్సు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. వెంకట్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానానికి ఆ కుటుంబీకులు ముందుకొచ్చి మరో ఇద్దరికి చూపు ఇచ్చారని మిత్రబృందం తెలిపింది.

News September 16, 2024

సిద్దిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం కురవాల్సిన దానికంటే ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738 మీమీ కురుస్తుంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సీజన్‌లో సెప్టెంబర్ 11 వరకు 897 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఎక్కువగా కురిసిందని తెలిపారు.