Medak

News March 25, 2024

28న సిద్దిపేటలో స్పాట్ అడ్మిషన్లు

image

సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత తెలిపారు. గ్రూప్ 1, 2, 3,4, ఎస్ఎసీసి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్సై, కానిస్టేబుల్ తదితర కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసం ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 24, 2024

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

image

హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోళీ వేడుకను ప్రజలందరి జీవితాలలో సంతోషం వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. మన సంస్కృతి, సాంప్రదాయాల కనుగుణంగా జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని కలెక్టర్ అభిలషించారు.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని MDK, SRD, సిద్దిపేట జిల్లాల పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. >>>SHARE IT

News March 24, 2024

ఏడుపాయలలో కనుల పండువగా దుర్గమ్మ పల్లకి సేవ

image

ఏడుపాయల వన దుర్గమ్మ సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ కనుల పండువగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకోగా పల్లకి సేవలో పాల్గొని భక్తులు తరించిపోయారు.

News March 24, 2024

పాపన్నపేట: వన దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో తిక్కిరిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దుర్గా భవాని మాత దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో అమ్మ దర్శనానికి చాలా సమయం పట్టింది. వన దుర్గ భవాని మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News March 24, 2024

గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి VS నర్సారెడ్డి 

image

KCR ఇలాకా గజ్వేల్‌లో BRS నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నేత నర్సారెడ్డి మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటీవల నర్సారెడ్డిపై ప్రతాప్ రెడ్డి ఆరోపణలు చేయగా దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ జగదేవ్‌పూర్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈరోజు మాట్లాడారు. గజ్వేల్‌లో కాంగ్రెస్‌ను ధీటుగా నిలబెట్టిన వ్యక్తి నర్సారెడ్డి అని అన్నారు. వంటేరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతాడంటూ ఎద్దేవా చేశారు.

News March 24, 2024

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో మెదక్ జిల్లాకు రజితం

image

ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరులో నిన్న, ఈరోజు నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాప్ట్ బాల్ బాలుర చాంపియన్షిప్‌లో మెదక్ జిల్లా బాలుర జట్టు రజత పథకం సాధించినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కోడిప్యాక నారాయణ గుప్త తెలిపారు. జిల్లా జట్టులో శ్రీరామ్ చాంపియన్షిప్ ఉత్తమ క్యాచర్ అవార్డ్ లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జట్టును అజయ్ కుమార్ గౌడ్, శ్యామ్ సుందర్ శర్మ అభినందించారు.

News March 24, 2024

సంగారెడ్డి: తండ్రి మృతి.. పుట్టెడు దుఃఖంతో పరీక్ష కేంద్రానికి

image

కళ్ల ముందే కన్నతండ్రి నిర్జీవంగా మారగా.. ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో పదోతరగతి పరీక్షకు హాజరైన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లా పుల్కల్ మండలంలో చోటుచేసుకుంది. గొంగ్లూరుకు చెందిన ఆకుల గొంగయ్య(41) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. అతని మొదటి కుమార్తె భవాని పదోతరగతి చదువుతోంది. ఓవైపు తండ్రి మృతితో కన్నీటి పర్యంతం అవుతూనే.. మరోవైపు శనివారం జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంది.

News March 24, 2024

మెదక్: దారుణ హత్య చేసిన దొంగ బాబా

image

పూజలు చేస్తానని నమ్మించి ఓ మహిళను హత్య చేసిన దొంగ బాబా నర్సింగ్ రామ్ అలియాస్ శివను జిన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరన్నగూడెంకు చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేస్తానని నమ్మించి ఘట్‌‌కేసర్ పరిధిలోని మాదారం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బంగారు గొలుసు కోసం బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. శివపై పలు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.

News March 23, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఈరోజు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. సిద్దిపేట 40.4, శివంపేట 40.3, చిట్యాల 40.1, దామరంచ 40.0, పాల్వట్ల, ములుగు 39.6, సదాశివపేట 39.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళవద్దని వైద్యులు సూచిస్తున్నారు.