Medak

News September 14, 2024

నర్సాపూర్: చెరువులో ట్రాక్టర్ కడగడానికి వెళ్లి యువకుడు మృతి

image

వినాయక నిమజ్జనం కోసం ట్రాక్టర్ కడగడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమజ్జనం వేడుకల సందర్భంగా మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన గంట శ్రీను తన స్నేహితులతో కలిసి చెరువు వద్దకు ట్రాక్టర్ కడగడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

News September 14, 2024

గజ్వేల్: ఆవాలతో అద్భుత గణపతి చిత్రం

image

వినాయక నవరాత్రుల్లో భాగంగా అవాలను ఉపయోగించి గణపతి చిత్రాన్ని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి. భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, సేవారత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అత్యద్భుతంగా చిత్రించి శనివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భగవంతుణ్ణి ఏ విదంగా పూజించిన పొందే ప్రతిఫలం అద్బుతమన్నారు.

News September 14, 2024

MDK: విషాదం.. రక్త కణాలు తగ్గి చిన్నారి మృతి

image

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. రక్త కణాలు తగ్గిపోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొన్ని రోజుల నుంచి సహస్ర(7) తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చనిపోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

News September 14, 2024

MDK: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య

image

భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. – VKB జిల్లాకు చెందిన భార్యాభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డికి వచ్చి స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది

News September 14, 2024

MDK: సీఎం బ్రేక్‌ఫాస్ట్ ఉన్నట్టా.. లేనట్టా?

image

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం స్కూల్‌లో అల్పాహారం అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. గత అక్టోబర్‌లో ప్రారంభమైన పథకం ఏప్రిల్ వరకు కొనసాగింది. మెదక్ జిల్లాలో 904 పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉండగా, గతేడాది కేవలం 35 పాఠశాలల్లోనే పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు కావస్తున్నా అల్పాహారం మాత్రం అందించడం లేదు.

News September 14, 2024

సిద్దిపేట: చిన్నారి గుండెలకు భరోసా

image

సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు ‘సత్యసాయి హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌’ సంజీవిని దవాఖానతో చిన్నారుల గుండెకు భరోసా అందించేందుకు ముందుకు వచ్చింది. 5ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో దవాఖాన నిర్మించారు. నేడు ఈ దవాఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు.

News September 13, 2024

విద్యార్థులకు మంచి బోధన అందించాలి: మంత్రి రాజనర్సింహ

image

ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారని, వారిని తమ పిల్లలుగా భావించి బోధన చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోల్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో అన్నారు. త్వరలో హెల్త్ కార్డుల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘోత్తంరెడ్డి, గుండు లక్ష్మణ్, మాణయ్య, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News September 13, 2024

ప్రణాళిక బద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలి: ఇంటర్ విద్యాధికారి

image

ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి చెప్పారు. శుక్రవారం రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సబ్జెక్టుపై విద్యార్థి పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ప్రశాంత వాతావరణంలో కళాశాల ఉండడం ఎంతో అభినందనీయమని చెప్పారు.

News September 13, 2024

MDK: హత్యాయత్నం కేసులో నిందితునికి 7ఏళ్లు జైలు

image

హాత్యాయత్నం కేసులో నేరస్థుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష రూ.5వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. సదాశివపేట మండలం కోనాపూర్‌కు చెందిన యాదయ్య పక్కన స్థలంలో వీరయ్య పగిలిన కల్లు సీసాలు వేసేవాడు. ఇదేంటని అడిగినందుకు యాదయ్యపై వీరయ్య కత్తితో హత్యాయత్నం చేశారు. నేరం రుజువు కావడంతో వీరయ్యకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

News September 13, 2024

మెదక్: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఈనెల 28 నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. లోక్ అదాలత్‌ లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.