India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లా పోలీసులు భారీగా గుట్కా పట్టివేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి హైదరాబాద్కు గుట్కాను లారీలో తరలిస్తుండగా జహీరాబాద్లో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడింది. రూ.45 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు. డ్రైవర్, క్లీనర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
HYDలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 31 దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. www.braouonline.in వెబ్సైట్ ద్వారా ఓపెన్ కోర్సులకు దరఖాస్తు చేసుకొని ఉన్నత విద్య అభ్యసించవచ్చని తెలిపారు. స్థానిక స్టడీసెంటర్లో నమోదు చేసుకోవాలన్నారు.
గౌడవెల్లి (మేడ్చల్) రైలు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన తోగరి కృష్ణ (35), కూతుర్లు వర్షిత (7), వరిణి(4) మృతి చెందారు. ట్రాక్ మెన్గా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద పనులు చేసేందుకు వెళ్లాడు. సెలవు దినం కావడంతో కూతుర్లను సైతం తీసుకెళ్లి పనులు చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. స్వగ్రామం లింగారెడ్డిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య కవిత ఉంది.
రంగనాయక సాగర్కు మిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగిందని, కాలువల్లో నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని MLA హరీశ్రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట ఇరిగేషన్ SE బస్వరాజ్, EE గోపాల కృష్ణతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం రంగనాయక సాగర్లో 2.3 TMCల నీరు ఉందని, 3TMCల పూర్తి సామర్థ్యం నీటిని నింపాలన్నారు.
జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్గా నర్సాపూర్ మండలానికి చెందిన శత్రు నాయక్ నియమితులయ్యారు. ఇది వరకు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో పలు హోదాలో పనిచేశారు. మొన్నటి వరకు ముంబైలోని ఎఫ్సిఐ డీజీఎంగా పనిచేసిన ఆయన పదోన్నతిపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి బదిలీపై వెళ్లారు. పదోన్నతి పై వెళ్లడంతో ఆయన స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లాలో ర్యాగింగ్ నిరోధించడానికి పోలీస్ అధికారులతో విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తామని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘ఇది అత్యంత అమానుష చర్య. ర్యాగింగ్ నియంత్రణలో స్కూల్, కాలేజీల యాజమాన్యం భాగస్వాములు కావాలి. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు, ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలి. ర్యాగింగ్కు పాల్పడే వారి వివరాలు డయల్ 100, కంట్రోల్ రూం 8712657888కి సమాచారం అందించాలి’ అన్నారు.
లారీ, బైక్ ఢీకొని మెదక్ జిలా వాసి మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. డబిల్పూర్ చౌరస్తా వద్ద శనివారం బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న యాదగిరి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మెదక్ జిల్లా కాళ్లకల్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ రైతుల్లో చాల మంది వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని బోరు మోటారుతో కాకుండా వర్ష ఆధారంగా వేసే పంటలు వేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల రైతులు వరినాట్లు వేసి ఊపిరి పీల్చుకునే లోపే వర్షాలు పడటం లేదు. ఈసారి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు అంతంతగానే పడ్డాయి. దీంతో చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం దేవుళ్ల గుడి వద్ద పూజలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన తులం బంగారం కేవలం మాటలకే పరిమితమైందని, బంగారం మాట దేవుడెరుగు కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ. లక్ష కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత, కోతల ప్రభుత్వమని విమర్శించారు. పెన్షన్ పెంపు, రైతుబంధు, తులం బంగారం హామీలు విస్మరించారన్నారు.
వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలపై దాడులు చేస్తున్నాయి. దౌల్తాబాద్ మండలంలో శనివారం ఐదుగురు చిన్నారులను గాయపరిచాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోవిందపూర్ గ్రామంలో ఆరు బయట ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమివేయడంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. పిల్లలకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.