Medak

News August 10, 2024

‍కుక్కలదాడి ఘటనలపై హరీశ్‌రావు ట్వీట్‌

image

రాష్ట్రంలో కుక్కల దాడుల ఘటనలపై MLA హరీశ్‌రావు X వేదికగా స్పందించారు. ‘కుక్క కాటు కేసులు నమోదైన వెంటనే చర్యలు తీసుకుంటే గడిచిన 8 నెలల్లో 343 కుక్కకాటు ఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రభుత్వం కుక్కల దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

News August 10, 2024

స్పీకర్ ఓంబిర్లాను కలిసిన ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్

image

ఢిల్లీలో పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాను జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షేట్కార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపక్షం తరఫున పార్లమెంట్‌లో తనకు మాట్లాడేందుకు అధిక సమయాన్ని కేటాయించాలని షెట్కార్ స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.

News August 10, 2024

BREAKING: ఏడుపాయల దేవాలయంలో చోరీ

image

మెదక్ జిల్లా ఏడుపాయల దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పాత కళ్యాణకట్ట, గర్భగుడి ముందు ఉన్న 2 హుండీలను ఎత్తుకెళ్లారు. హుండీలను ధ్వంసం చేసి వాటిలో ఉన్న నగదును తీసుకెళ్లారు. 10 రోజుల క్రితమే ఆలయ హుండీలను సిబ్బంది లెక్కించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పాపన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 10, 2024

తూప్రాన్: ప్రోడక్ట్ బిజినెస్.. రూ. 6.50 లక్షల మోసం

image

ఆన్‌లైన్ పార్ట్ టైం జాబ్ కింద ప్రొడక్ట్ బిజినెస్ అంటూ సైబర్ నేరగాళ్లు రూ.6.50 లక్షలు కాజేసినట్లు తూప్రాన్ SI శివానంద తెలిపారు. తూప్రాన్ మండలానికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ ‘మైఖేల్ కోర్స్ 2,185’ గ్రూపులో ఆన్‌లైన్ పార్ట్ టైం జాబ్ కింద ప్రొడక్ట్ బిజినెస్ అంటూ ఓ లింకు రాగా ఓపెన్ చేశాడు. పలు దఫాలుగా పెట్టుబడి పెట్టగా.. లాభాలు చూపించాడు. రూ.10లక్షల లాభం చూపించగా, విత్ డ్రా చేసేందుకు అవకాశం లభించలేదు.

News August 10, 2024

మెదక్: పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

image

పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనం ఇస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,615 జీపీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్‌ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి. ఫిబ్రవరి 1, 2024తో జీపీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో ఆ రోజు నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కార్యదర్శులపై అదనపు భారం పడుతోంది.

News August 10, 2024

సిద్దిపేట: కూతురు చనిపోయిందని తండ్రి సూసైడ్

image

కూతురి మృతి.. దంపతుల మధ్య గొడవలతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట(M) చింతమడకలో జరిగింది. SI అపూర్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జగదీశ్(23)కి కుమార్తె పుట్టిన కొద్ది నెలలకే చనిపోయింది. దీంతో ఆయన మద్యానికి బానిసయ్యాడు. కూతురి మృతిని తట్టుకోలేక మనస్తాపంతో గురువారం జగదీశ్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదైంది.

News August 10, 2024

మెదక్ జిల్లాలో మహిళల ముందడుగు

image

పట్టణ మహిళా సంఘాలకు కొన్ని సంస్థలు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వ్యాపార రంగంలో ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.49.65 కోట్లు రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోగా.. రూ.85 కోట్లు దాటి శత శాతాన్ని మించాయి. కిరాణం, కుట్టుపని, దుస్తుల విక్రయం, వ్యవసాయం, పాడి పశువుల పెంపకం తదితర జీవనోపాధికి ఇలా అనేక రంగాల్లో రాణిస్తున్నారు.

News August 9, 2024

సంగారెడ్డి: రేపటి వరకు ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు

image

ఇంటింటా ఇన్నోవేషన్ గడువును ఈనెల 10 వరకు పెంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. దరఖాస్తులను 9100678543 నంబర్‌కు పంపించాలని చెప్పారు. ఎంపికైన వాటిని ఈనెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News August 9, 2024

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలి

image

ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్మీడియట్‌ను చదువుకునే అవకాశం కల్పించినట్లు డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో అడ్మిషన్ల పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10 వరకు అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ తీసుకోవచ్చని చెప్పారు. తమ్ముడు అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి పాల్గొన్నారు.

News August 9, 2024

సంగారెడ్డి: రుణమాఫీపై కంప్లైంట్స్

image

రాష్ట్ర ప్రభుత్వం రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. 2 విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్‌సెల్‌ బాట పట్టారు. అధికారిక లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 2,479 మంది, మెదక్‌ జిల్లాలో 2,519 మంది, సంగారెడ్డి జిల్లాలో 2,838 మంది రైతులు ఫిర్యాదు చేశారు.