India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పెరుగుతున్నాయి. వాతావరణంలో మార్పులు, దోమల కారణంగా చిన్న పిల్లలు పలు రకాల వ్యాధుల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో 30 పడకలతో మాతాశిశు వైద్య కేంద్రం నిర్వహిస్తున్నారు. కాగా, జూన్ 1 నుంచి జులై 31 వరకు MCHకు 11,096 మంది పిల్లలు వచ్చారని అధికారులు తెలిపారు. వీరిలో జ్వర పీడితులు 1,910 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధిపై తక్షణం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. శనివారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ను కలిసి తెల్లా పూర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్లో నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రధాన ప్రాంతంగా తెల్లాపూర్ ఉందని, వందలాది గేటెడ్ కమ్యూనిటీలతో ఈ ప్రాంతం ఉందన్నారు.
తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శనివారం సమీక్షించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఆర్గానిక్ ప్రోడక్ట్ స్టాల్ను సందర్శించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ అనురాధ సందర్శించారు. విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలన్నారు. విపీఓ వ్యవస్థను మరింత బలపరచాలని తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను బలపరుచుకోవాలని తెలిపారు. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలన్నారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జు అయిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పుల్కల్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
వాతావరణంలోని మార్పుల కారణంగా సంగారెడ్డి జిల్లా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వర పీడితులతో దావాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషేంట్ కేసులు అధికంగా నమోదైతున్నాయి. జిల్లాలో అధికారికంగా 70 డెంగీ కేసులు నమోదు కాగా, అధికారుల దృష్టికి రాని కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో 1415 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 4 నిర్వహిస్తున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడా కారులు ఫొటో, ఆధార్ కార్డు, పదో తరగతి మెమో లేదా జన్మదిన జిరాక్స్ కాపీలతో ఉదయం 7 గంటలకు మెదక్లో ఇందిరాగాంధీ స్టేడియానికి రావాలని కోరారు.
చేప పిల్లల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలస్యమయ్యేల కనిపిస్తుంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మత్యశాఖ ఆఫీస్లో బిడ్లకు సంబంధించి టెండరు బాక్సు తెరవగా ఒక్కరూ టెండర్లో పాల్గొనకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో మొత్తం 1,160 చెరువులు, కుంటలు ఉన్నాయి. 227 మత్స సహాకార సంఘాలు ఉండగా వీటిలో 11,013 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడు 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పెళ్లి భయంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చేర్యాల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. ఆకునూరు గ్రామానికి చెందిన మహేశ్వరి(25)కి ఇటీవల కుటింబీకులు పెళ్లి సంబంధం చూశారు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి అంటే భయంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దామోదర్ తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్ రావునీ వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన మైనంపల్లిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మాట్లాడుతూ.. హరీశ్ రావు అక్రమాలు బయటపెడతామన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్ ఛార్జులు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.