India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసులు నూతన చట్టాలపై అవగాహన ఉండాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్లైన్లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ముందస్తు విచారణ చేయాలని సూచించారు. కొత్త చట్టాల అమలులో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు.
జిల్లాలో ఈనెల 5 నుంచి నిర్వహించే స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వల్ల క్రాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని శాఖల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో హైదరాబాదులో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పొన్నం మాట్లాడుతూ.. దశాబ్దకాలం తరువాత జీవితంలో ప్రమోషన్లు వస్తాయో రావో అనే దాని నుండి ఒక మెట్టు ఎక్కి ప్రజాపాలనలో ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారని అన్నారు. ఉపాధ్యాయ వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునే గడువును ఆగస్ట్ 10 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రకటించింది. ఆవిష్కర్తలు, అంకురాలకు, వ్యవస్థాపకులకు సమ్మిళిత ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి ప్రతిస్పందనగా గుర్తించబడిందని ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ అన్నారు.
HYD కాప్రా మండలం జవహర్నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తనకు 35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పేట్ బషీరాబాద్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా నార్సింగి వాసి వేణు ప్రసాద్(35) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. తల్లితో కలిసి కొంపల్లి పరిధి గాంధీనగర్లో ఉంటున్నాడు. పెళ్లి కావడం లేదని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రైతు రుణమాఫీలో భారీగా కోతలు పడడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో గందరగోళం నెలకొంది. జాబితాలో పేరు లేకపోవడంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. DCCB పరిధిలో 2వ విడత మాఫీకి అర్హులైన రైతులు 8,820 మంది ఉండగా, రూ.108కోట్లు మాఫీ కావాలి. 6258 మందికి రూ.50.38కోట్లు రుణమాఫీ అయ్యింది. మిగిలిన 2,562 మంది అర్హులైన రైతులకు రూ.58కోట్లు మాఫీ కాలేదు. దీంతో మాఫీకాని రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన రామ్ రెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. అయితే సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో రెండు ఎకరాల భూమి కోల్పోతున్నానని గత కొంతకాలంగా ఆందోళనకు గురవుతున్న రాంరెడ్డి రైతులు చేస్తున్న దీక్షలో సైతం పాల్గొన్నారు. గత రాత్రి ఇంట్లో భూమి విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
గుర్తు తెలియని యాప్లో ట్రేడింగ్ చేసి ఓవ్యక్తి రూ.లక్షలు పోగొట్టుకున్న ఘటన తూప్రాన్లో జరిగింది. SI శివానందం ప్రకారం.. పట్టణంలో వ్యాపారం చేసే ఓవ్యక్తి ఇన్స్టాలో వచ్చిన లింక్తో ఓ వాట్సాప్ గ్రూపులో యాడై IIFL అనే యాప్ డౌన్లోడ్ చేశాడు. పలు దఫాలుగా అందులో రూ.15లక్షల వరకు ట్రేడింగ్ చేయగా.. రూ.95లక్షలు ప్రాఫిట్ వచ్చింది. అయితే డబ్బు విత్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వారం రోజుల ముసురు వానతో వాతావరణ మార్పులు జరిగి జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని వివిధ గ్రామాలలో రోగులు ఎక్కువ అవుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. నిత్యం 300లకు పైగా ఓపీ నమోదవుతోంది.
Sorry, no posts matched your criteria.