Medak

News August 20, 2024

సంగారెడ్డి: ‘రుణమాఫీ కానీ వారు దరఖాస్తు చేసుకోండి’

image

రైతు రుణమాఫీ కాని వారు మండల వ్యవసాయ శాఖ అధికారులు, నోడల్ అధికారులను కలిసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. బ్యాంకర్ల వల్ల జరిగిన తప్పిదాలు, కుటుంబ నిర్ధారణ జరగనివి, మిస్సింగ్ డాటా, పంట రుణమాఫీ వచ్చి తిరిగిన రైతులు వాటిపై ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అధికారులకు తగిన పత్రాలు సమర్పించి పంట రుణమాఫీ పొందాలని చెప్పారు.

News August 20, 2024

మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర

image

మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. వ్యాధి నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ నివారణ మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News August 19, 2024

తూప్రాన్: నర్సంపల్లిలో మహిళ దృశ్యం

image

తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంటకు చెందిన తుడుం మరియమ్మ అలియాస్ పెంటమ్మ(32) అదృశ్యమైనట్లు ఎస్సై శివానందం తెలిపారు. కుటుంబ విషయంలో భర్త కరుణాకర్ తో గొడవపడి 5న నర్సంపల్లి లోని సోదరుడు హనుమంతు ఇంటికి వచ్చింది. 15న బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు తెలిపారు. మరియమ్మ కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని వివరించారు.

News August 19, 2024

రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావుకు బిజెపి మహిళ నాయకురాళ్లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయత, అనురాగాలను పంచుతుందన్నారు. బేదాభిప్రాయాలను దూరం చేస్తుందన్నారు. మహిళలందరికీ రఘునందన్ రావు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

News August 19, 2024

MDK: ‘రుణమాఫీపై సందేహాలు, విజ్ఞప్తులు స్వీకరించాలి’

image

రైతు రుణమాఫీకి సంబంధించి సమస్యలు, సందేహాల నివృత్తి కోసం వచ్చే విజ్ఞప్తులను స్వీకరించాలని మండల వ్యవసాయ అధికారులను మెదక్ జిల్లా వ్యసాయాధికారి గోవింద్ ఆదేశించారు. రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీటికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిందిగా ఆదేశించారు.

News August 19, 2024

మెదక్: ఒక్క ఫొటో.. ఎన్నో మధుర జ్ఞాపకాలు !

image

ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదులుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధురస్మృతులు మనసులో మొదలవుతాయి. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుంది. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఫొటోతోనే సాధ్యం. ఆ ఫోటోగ్రఫీ ఒకరోజు ఉంది. అది నేడే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్పెషల్.

News August 19, 2024

రుణమాఫీ కోసం నిరసన చేసిన రైతులను అరెస్టు చేస్తారా.?: హరీశ్ రావు

image

రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేస్తారా.? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అరెస్టు హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారా అని నిలదీశారు. రుణమాఫీ కాలేదని కలెక్టరేట్లు, బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారన్నారు.

News August 19, 2024

BREAKING: భూమి అమ్మాలంటూ మహిళపై కత్తితో దాడి

image

తనకే భూమిని అమ్మాలని బెదిరించి పట్టాదారిపై కత్తితో దాడి చేసిన ఘటన శివంపేట మండలం చండి గ్రామంలో చోటు చేసుకుంది. SI మైపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జయమ్మ తన 12 గుంటల భూమిని అమ్మాలనుకుంది. తన సొంత మరిది సూర్యం తనకే అమ్మాలని బూతులు తిట్టి, కత్తితో దాడి చేశారని అన్నారు. దీంతో ఆమె వీపు‌పై గాయాలయ్యాయి. జయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News August 19, 2024

మెదక్: రేపటి నుంచి ‘ఆరోగ్య మిత్ర’ల సమ్మె

image

రాజీవ్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు రేపటి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 43 మంది సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 6 నుంచి మంత్రి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, సచివాలయ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ (డిపిఓ)గా క్యాడర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News August 19, 2024

మెదక్: నేడు రక్షాబంధన్ వేడుకలు

image

జీవితంలో ఎన్ని బంధాలున్నా సోదరీ, సోదరుల అనుబంధం అపురూపమైనది. చెల్లె ఆపదలో ఉంటే అన్న ముందుంటాడు. తమ్ముడికి ఇబ్బంది వస్తే అక్క కంగారు పడుతుంది. ఇరువురి మధ్య ఉన్న అపురూపమైన బంధాన్ని పండగల చేసుకునే రోజే రక్షాబంధన్ (రాఖీ పండుగ). కృతయుగం నుంచి చేసుకుంటున్న రక్షాబంధన్ పండుగను రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ అంటారు. ఈ రోజే జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి చేసుకుంటారు.