India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 16 మందిని బలిగొన్న ఘోర రైలు ప్రమాద దుర్ఘటనకు పదేళ్లు నిండాయి. 2014లో సరిగ్గా ఇదే రోజు తూప్రాన్కు చెందిన కాకతీయ టెక్నో స్కూల్ బస్సు కిష్టాపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ చిన్నారులతో వెళ్తుండగా మాసాయిపేట లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు ఢీకొట్టడంతో 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. నేటికీ ఆ ఘటన తలుచుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఈనెల 25న ఉదయం 10:30 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి పేర్కొన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హత ఉన్న వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు సత్వరమే ఇంటింటి జ్వర సర్వేను చేపట్టాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. మలేరియా, డెంగ్యూను నిరోధించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 47,978 మంది రైతులకు రూ.238.81 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 47,616 మంది రైతుల ఖాతాల్లో రూ. 237.5 కోట్లు జమ చేశామని, వివిధ కారణాలతో 362 మందికి రూ. 1.3 కోట్లు జమ కావాల్సి ఉందన్నారు. ఈ రైతులకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.
చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. జోగిపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో న్యాయ అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా సహాయం అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోహెడ, బెజ్జంకి మండలాల్లో ని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన అనంతరం చివరగా కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదవ తరగతి ఫలితాల్లో అందరూ శ్రద్ధగా చదివి ఫలితాల్లో 10 జీపీ తెచ్చుకోవాలని సూచించారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 47,616 మంది రైతుల ఖాతాల్లో 237.5 కోట్ల రూపాయలు జమ చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో 47 వేల 978 మంది రైతులకు వివిధ బ్యాంకుల ద్వారా 238.81 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. వివిధ సాంకేతిక కారణాలవల్ల 362 మంది రైతులకు సంబంధించి 1.3 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంన్నారు. ఈ రైతులకు సంబంధించిన సరైన ఖాతా వివరాలను వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు సేకరిస్తారని అన్నారు.
గుండె సంబంధిత ఇబ్బందులతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. శశిధర్ రెడ్డి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి శశిధర్ రెడ్డి యోగ క్షేమాలు ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను లెటర్లో రాసి తనువు చాలించాడు.
మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు 68.60 కోట్ల సార్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఫలితంగా రూ.2,350 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) అధికారులు, సిబ్బందితో బస్భవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది కృషి, క్రమశిక్షణ, అంకితభావం వల్లే పథకం విజయవంతమైందన్నారు.
Sorry, no posts matched your criteria.