India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి విద్యుత్నగర్లో విషాద ఘటన వెలుగుచూసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ (25) తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మృతదేహాన్ని కారు సుమారు <<13680734>>4KM లాక్కెళ్లిన<<>> విషయం తెలిసిందే. వనపర్తి జిల్లాకు చెందిన వెంకటేశ్(22) HYDలో ఉంటూ LLB చేస్తున్నాడు. ఆదివారం రాత్రి జహీరాబాద్కు బైక్ పై వెళ్లి వస్తుండగా లింగంపల్లి శివారులో NH-65పై వెనుక నుంచి కారు ఢీకొట్టింది. అది గమనించని కారు డ్రైవర్ సుమారు 4KM లాక్కెళ్లాడు. కంకోల్ టోల్ ప్లాజా వద్ద గుర్తించగా వెంకటేశ్ అప్పటికే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెట్టుబడి పెడితే లాభాలు, కమీషన్ ఇస్తామంటూ ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి సైబర్ నేరస్థులు రూ.13.83 లక్షలు కాజేసిన ఘటన పటాన్చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీనగర్ కాలనీకి చెందిన ఉద్యోగి వాట్సాప్కు జూన్ 5న ఈ మేరకు ఓ సందేశం వచ్చింది. నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.13.83 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత మోసపోయిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంగాడి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతోందని ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 564 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోందని, 391 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో తాలేల్మకు 41 క్యూసెక్కులు, హైదరాబాద్ వాటర్ సప్లైకి 80, మిషన్ భగీరథ 70, ఆవిరిగా 200 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందన్నారు.
మనస్తాపంలో బాలిక(11) సూసైడ్ చేసుకున్న ఘటన మనూరు మండలం అతిమ్యాలలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. సోమవారం కొడుకు బర్త్ డే కావడంతో కేక్, నిత్యావసరాలు తేవడానికి కొడుకును తీసుకొని దంపతులు ఖేడ్ వెళ్లారు. తాను వస్తానని కుమార్తె మారాం చేయడంతో వద్దని తల్లి మందలించింది. సాయంత్రం వారు ఇంటికొచ్చేసరికే దూలానికి బాలిక ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్ కేసీ, ఇండస్ఇండ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలై, బైక్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.
HYD చుట్టూ RRR నిర్మాణాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే భారత్ మాల-1లో ఉత్తర భాగం, భారత్ మాల-2ప్రాజెక్టులో దక్షిణ భాగం అభివృద్ధి చేయాలని భావించినా దక్షిణ భాగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ప్రస్తుతం కేంద్రం తాజాగా విజన్-2047లో చేర్చినట్లుగా సమాచారం. దక్షిణభాగం ఆమనగల్, షాద్నగర్,చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉండనుంది.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సస్పెన్షన్లో ఉన్న కంది సీసీఎస్ ఇన్స్పెక్టర్ వెంకట కిషోర్ ఏసీబీకి చిక్కారు. రూ.5లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ రియల్ఎస్టేట్ కాంట్రాక్టర్ను రూ.1.50 కోట్లు అడిగిన ఇన్స్పెక్టర్.. రూ.5లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. అయితే గతంలోనూ వెంకటకిషోర్కు రియల్ఎస్టేట్ రూ.10లక్షలు ఇచ్చారు. మళ్లీ డబ్బులు అడగడంతో వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు.
పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, PM కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని MLA హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. HYDలో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, PM కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకం ఆగిపోయిందని, లక్ష మందికి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.