India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.
సికింద్రాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ పూజారులు శాలువాతో సన్మానించి ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తిన క్షణాలలో అక్కడకు చేరుకొనే విధంగా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని సిబ్బందన్నారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 57888, డయల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామన్నారు.
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో 22వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,703 మంది మల్టీపర్పస్ ఉద్యోగుల వేతనాల కోసం రూ. 24.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు రూ. 11,75,72,000, సంగారెడ్డి జిల్లాకు రూ. 8,09,97,000, మెదక్ జిల్లాకు రూ. 5,03,97,500 విడుదలయ్యాయి.
నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైందిన సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని విద్యార్థులు సెప్టెంబర్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. www.navodaya.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. బదిలీలకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ కలెక్టరేట్లో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ ప్రజా పాలన సేవా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల లోటుపాట్లు సవరించుకోవచ్చని తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆన్లైన్లో వివరాలు నమోదు ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.