India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ డైట్లో అతిథి అధ్యాపకులుగా 16 పోస్టులు ఉన్నాయని, వాటికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ డీఈవో రాధాకిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లోని వివిధ విభాగాల్లో 16 పోస్టులు ఉన్నాయని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా డైట్లో అందజేయాలని పేర్కొన్నారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 16-21 తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTC ప్రాంతీయ మేనేజర్ ప్రభులత పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా డిపో మేజేజర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్టాండ్లలో ఎప్పటికప్పుడు రద్దీ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 16న 32, 17న 35, 18న 55, 19న 70, 20న 45, 21న 28 కలిపి మొత్తం 265 బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి ఈనెల 17వ తేదీ వరకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ రాజేశ్వర రావు బుధవారం తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు http://iti.telangana.gov.in లో అప్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు.

యువకుడి సూసైడ్ కేసులో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని గుమ్మడిదల మం.దోమడుగుకు చెందిన శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా యువతి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగి ఆస్పత్రి పాలయ్యాడు.ఈనెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకే వెళ్తున్నా అంటూ’ ఉరేసుకున్నాడు.

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఫిర్యాదులు ఎవరికి చేయాలో తెలియక వచ్చిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు నిరాశతో విని తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ధరణి సహాయ కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఏర్పాటు చేయించారు. సమస్యలపై రైతులు ఇక్కడ సంప్రదించవచ్చని తెలిపారు.

మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తలారి పోచమ్మ(70), ఎల్లవ్వ (50) అనే ఇద్దరు తల్లీకూతురు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోచమ్మ కుమారుడు హైదరాబాదులో ఉంటుండగా తల్లీకూతురు గ్రామంలో ఉంటున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

చిన్నశంకరంపేటకు చెందిన వికాస్ కుమార్(23) డిగ్రీ పూర్తి చేసుకొని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నాడు. వారం రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబసభ్యులు మెదక్, చేగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్ళారు. వైద్యుల సూచనల మేరకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వికాస్ కుమార్ మృతి చెందాడు.

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. దీంతో వ్యాధులను అరికట్టేందుకు వైద్యాశాఖ జ్వర సర్వేను ముమ్మరం చేసింది. జ్వరం వచ్చినట్లు గుర్తిస్తే వారి ఇంటికే వెళ్లి మందులిస్తున్నారు. మెదక్ జిల్లాలో 73రోజుల్లో 34,351 మందికి టెస్టులు చేస్తే 1,345 మంది జ్వరంలో బాధపడుతున్నట్లు తేలింది. మందులు వాడినా జ్వరం తగ్గకుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

పెద్ద శంకరంపేట ఇందిరా కాలనీకి చెందిన మహమ్మద్ ఇలియాస్ (30) నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. లారీ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగించే ఇలియాస్ స్నేహితులతో కలిసి నిన్న ఇసుక మడుగు వద్ద మద్యం సేవించాడు. ఇసుక మడుగులో ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఈరోజు ఇసుక మడుగులో గాలింపు చేపట్టి శవాన్ని బయటకు తీశారు.

రామాయంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే మహిళ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. డాక్టర్ హేమ రాజ్ సింగ్ ఈరోజు ఆ మహిళకు ఆపరేషన్ నిర్వహించి కడుపులో ఉన్న నాలుగున్నర కిలోల గడ్డ తొలగించారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ డాక్టర్ హేమరాజ్కు కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.