India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి 2:30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాసర వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్ మూసాపేట్ చెందిన వారిగా సమాచారం.
గజ్వేల్ మండలం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక CI సైదా తెలిపిన వివరాల ప్రకారం.. ఏటిగడ్డకిష్టాపూర్ R&R కాలనీకి చెందిన రాజేశ్ బంధువైన మురళితో కలిసి ప్రజ్ఞపూర్ వైపు బైక్పై వెళ్తున్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి చెట్టును, ఓ భవనం మెట్లను ఢీకొన్నారు. మురళికి గాయాలవగా, రాజేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదైంది.
విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం లో తెలిపారు. వరదల వల్ల నష్టం జరగకుండా అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు అందుబాటులో ఉండాలని చెప్పారు. చెరువు కట్టలు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్ల ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీలో పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా భారతీయ పాలన, ప్రజా విధానం అంశంపై బంగ్లాదేశ్కు చెందిన డిప్యూటీ కమిషనర్స్, కలెక్టర్లకు అవగాహన కల్పించారు. దేశంలో సుపరిపాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా తెలిపారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఇతర దేశస్తులు రాహుల్ రాజ్ను అభినందించారు.
తూప్రాన్లో ఓ హోటల్లో భోజనం చేసిన పలువురు తీవ్ర అస్వస్థత గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు.. నూతన వెరైటీలతో పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ హోటల్లో మంగళ, బుధవారాల్లో పలువురు బిర్యానీ తిన్నారు. ఒక్కొక్కరుగా 15 మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొదట నార్మల్గా తీసుకున్న వారు హోటల్ ఫుడ్ పాయిజన్ కావడంతో ఆందోళన చెందారు.
HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్ బోనాలకు వచ్చే కేసీఆర్, టక్కర్బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.
మెదక్ ఆర్టీసీ డీపో మేనేజర్గా సురేఖ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గజ్వేల్ నుంచి ఇక్కడికి బదిలీపై రాగా ఇక్కడ డీఎంగా పనిచేసిన సుధా బీహెచ్ఈఎల్ కు బదిలీ అయ్యారు. శుక్రవారం డిపో గ్యారేజ్ ఆవరణలో కొత్తగా వచ్చిన డీఎం సురేఖ, బదిలీపై వెళుతున్న డీఎం సుధను ఆర్టీసీ డిపో అధికారులు సిబ్బంది సన్మానించారు. సుధా సేవలను కొనియాడారు. అందరి సహకారంతో డిపోను అభివృద్ధి పథంలో ఉంచుతానని సురేఖ తెలిపారు.
Sorry, no posts matched your criteria.