Medak

News July 18, 2024

పటాన్‌చెరు: మళ్లీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే: ఎమ్మెల్యే

image

ఒక్క ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీ పోయినట్టు కాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కార్యకర్తలే పార్టీకి కొండంత బలం అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అద్భుతమైన పాలన అందించిందన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

News July 18, 2024

సంగారెడ్డి: హాట్ టాపిక్‌గా మారిన హరీశ్ రావు TRS కండువా.!

image

పటాన్ చెరులో నిర్వహించిన సమావేశంలో సిద్దిపేట MLA మాజీ మంత్రి హరీశ్ రావు TRS కండువాతో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.

News July 17, 2024

సిద్దిపేట: దేశంలో ఇదే తొలిసారి: మంత్రి పొన్నం

image

దేశంలో రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని చేయడం ఇదే మొదటిసారి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయంలో కేబినెట్ మంత్రిగా తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. మరికొన్ని గంటల్లో రైతు జీవితంలో ఆనందం గడియలు మొదలు కానున్నాయని అన్నారు. ఒకేసారి రైతు పేరు మీద ఉన్న రుణాన్ని 3 పద్ధతుల్లో మాఫీ చేస్తున్నామని తెలిపారు.

News July 17, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద రైతులపై దాడులు: హరీశ్‌రావు

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా భూమిని లాక్కుంటున్నారని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న ధమక్కపల్లి కిష్టయ్యను పరామర్శించారు. కాంగ్రెస్ ఇష్ట రాజ్యాంగ పేద రైతుల భూముల మీద దాడులు చేస్తున్నారని అన్నారు.

News July 17, 2024

రామచంద్రాపురం: మాజీ మంత్రి హరీష్ రావును సన్మానించిన నేతలు

image

రామచంద్రాపురం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి హరీష్ రావును మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, కృష్ణ కాంత్, పఠాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శాలువతో సన్మానించి బొకే అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీధర్ చారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

News July 17, 2024

సిద్దిపేట: ఘోరం.. బాలుడిని 20 నిమిషాలు కరిచిన కుక్కలు

image

HYD జవహర్‌నగర్ పరిధిలో కుక్కల దాడిలో <<13644434>>బాలుడు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులు నెల కిందట HYD వచ్చారు. వారి కొడుకు నిహాన్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేసి 20 నిమిషాలు కరిచాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి కుక్కలను తరిమాడు. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.

News July 17, 2024

పుల్కల్: డెడ్‌స్టోరేజీ దిశగా నల్లవాగు ప్రాజెక్టు

image

సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోతుండటం రైతులను కలవరపెడుతుంది. నల్లవాగు ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరింది. సింగూరు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 13.565 TMCలుగా ఉన్నాయి.

News July 17, 2024

ఓడీఎఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ రఘునందన్

image

ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్(ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడి ఇన్ఫెక్షన్ బంగ్లాలో సీజీఎం శివశంకర ప్రసాద్, జీఎం లతోపాటు ఇతర ప్రతినిధులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్ సమస్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరిస్తానని రఘునందన్ అన్నారు.

News July 17, 2024

సంగారెడ్డి: ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని దాడి.. తండ్రి మృతి

image

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేసినట్లు కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని చౌకన్పల్లికి చెందిన మారుతిని తన కొడుకు నరసప్ప డబ్బులు అవసరమని మంగళవారం అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కోపోద్రిక్తుడై నరసప్ప ఆవేశంతో గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. మారుతికి చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News July 17, 2024

ఆర్డినెన్స్ అధికారులతో మెదక్ ఎంపీ సమీక్ష సమావేశం

image

సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర్ ప్రసాద్, జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విజయ్ దత్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, బీఎంఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.