Medak

News August 3, 2024

సిద్దపేట: పెళ్లి భయంతో యువతి సూసైడ్

image

పెళ్లి భయంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చేర్యాల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. ఆకునూరు గ్రామానికి చెందిన మహేశ్వరి(25)కి ఇటీవల కుటింబీకులు పెళ్లి సంబంధం చూశారు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి అంటే భయంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దామోదర్ తెలిపారు.

News August 3, 2024

హరీశ్ రావును వదిలిపెట్టేది లేదు: మైనంపల్లి

image

మాజీ మంత్రి హరీశ్ రావునీ వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన మైనంపల్లిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మాట్లాడుతూ.. హరీశ్ రావు అక్రమాలు బయటపెడతామన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్ ఛార్జులు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

News August 3, 2024

నూతన చట్టాలపై అవగాహన ఉండాలి: సంగారెడ్డి ఎస్పీ

image

పోలీసులు నూతన చట్టాలపై అవగాహన ఉండాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ముందస్తు విచారణ చేయాలని సూచించారు. కొత్త చట్టాల అమలులో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు.

News August 2, 2024

సంగారెడ్డి: స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

image

జిల్లాలో ఈనెల 5 నుంచి నిర్వహించే స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వల్ల క్రాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని శాఖల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News August 2, 2024

ప్రజా పాలనలో ఉపాధ్యాయులకు పదోన్నతులు: మంత్రి పొన్నం

image

కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో హైదరాబాదులో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పొన్నం మాట్లాడుతూ.. దశాబ్దకాలం తరువాత జీవితంలో ప్రమోషన్లు వస్తాయో రావో అనే దాని నుండి ఒక మెట్టు ఎక్కి ప్రజాపాలనలో ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారని అన్నారు. ఉపాధ్యాయ వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

News August 2, 2024

ఇంటింటా ఇన్నోవేటర్ 2024′ దరఖాస్తు గడువు పొడగింపు

image

ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునే గడువును ఆగస్ట్ 10 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రకటించింది. ఆవిష్కర్తలు, అంకురాలకు, వ్యవస్థాపకులకు సమ్మిళిత ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి ప్రతిస్పందనగా గుర్తించబడిందని ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ అన్నారు.

News August 2, 2024

BREAKING: MDK: 9వ తరగతి బాలిక ఆత్మహత్య

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్‌లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 2, 2024

MDK: 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదని చనిపోయాడు!

image

తనకు 35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పేట్ బషీరాబాద్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా నార్సింగి వాసి వేణు ప్రసాద్(35) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తల్లితో కలిసి కొంపల్లి పరిధి గాంధీనగర్‌లో ఉంటున్నాడు. పెళ్లి కావడం లేదని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News August 2, 2024

MDK: రైతురుణ మాఫీ.. పరిస్థితి ఇలా!

image

రైతు రుణమాఫీలో భారీగా కోతలు పడడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో గందరగోళం నెలకొంది. జాబితాలో పేరు లేకపోవడంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. DCCB పరిధిలో 2వ విడత మాఫీకి అర్హులైన రైతులు 8,820 మంది ఉండగా, రూ.108కోట్లు మాఫీ కావాలి. 6258 మందికి రూ.50.38కోట్లు రుణమాఫీ అయ్యింది. మిగిలిన 2,562 మంది అర్హులైన రైతులకు రూ.58కోట్లు మాఫీ కాలేదు. దీంతో మాఫీకాని రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

News August 2, 2024

మెదక్: గుండెపోటుతో రైతు మృతి

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన రామ్ రెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. అయితే సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో రెండు ఎకరాల భూమి కోల్పోతున్నానని గత కొంతకాలంగా ఆందోళనకు గురవుతున్న రాంరెడ్డి రైతులు చేస్తున్న దీక్షలో సైతం పాల్గొన్నారు. గత రాత్రి ఇంట్లో భూమి విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.