India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సభ్య సమాజం తలదించుకునే ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసాయిపేట మండలంలో తల్లి పైనే కుమారుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు చేగుంట ఎస్సై తెలిపారు. భార్యా పిల్లలు మహంకాళి జాతరకు వెళ్లగా.. తల్లితో ఇంటి వద్ద ఉన్న యువకుడు మద్యం మత్తులో 29న రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా నిన్న వృద్ధురాలైన తల్లి పోలీసులను ఆశ్రయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు. వారితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్లో జరిగిన <<13746227>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన గర్భిణి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి చెందిన పనేటి రేణ(29)గా గుర్తించారు. ఎస్సై సుభాశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. బైకుపై మరో వ్యక్తి, బాలుడితో కలిసి వెళ్తుండగా వెనుకగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గర్భిణి నుజ్జునుజ్జు కాగా కడుపు నుంచి పిండం రోడ్డుపై పడి పలువురి హృదయాలను కలిచివేసింది.

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేసుకుంటున్నామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ జిల్లాలో నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీడీపీవోలు వైద్యశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారం బిస్కెట్లు కలకలం రేపాయి. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. రమణమ్మ అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం నాలుగు లక్షలు అప్పు కావాలని రాజరాజేశ్వరి అనే మహిళ వద్దకు వచ్చింది. షూరిటీగా నాలుగు బంగారం బిస్కెట్లు పెట్టి వెళ్లింది. అనుమానం వచ్చిన బాధితురాలు రాజరాజేశ్వరి తనిఖీ చేయగా అవి నకిలీవి అని తేలింది. దీంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కానేలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అప్పుడే ఊపందుకుంది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొంది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి నుండే ఆశావహులు విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. ఏకగ్రీవం కోసం ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో విషాదం చోటుచేసుకుంది. ముత్తంగి శివారులో చెట్టుకు ఉరేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి విక్రమ్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగంలో అనుకున్న స్థాయికి ఎదగలేదనే మనస్తాపంలో విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి, స్నేహితులు తెలిపారు. ఘనటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కానేలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అప్పుడే ఊపందుకుంది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొంది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి నుండే ఆశావహులు విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. ఏకగ్రీవం కోసం ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామానికి చెందిన బాలిశెట్టి సంజయ్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. బుధవారం ఆయనను లీగల్ కమిటీ వైస్ ఛైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ కమిటీ ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మక్కరాజుపేట గ్రామస్థులు సంజయ్ ను అభినందించారు.
Sorry, no posts matched your criteria.