India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆగస్టులో షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో భాగంగా మెదక్ డివిజన్లో ఈవ్టీజర్స్పై 2 ఎఫ్ఐఆర్లు, 14 ఈ-పెట్టీ కేసులు, తూప్రాన్ డివిజన్లో 4 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్లు, 18 కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
కలెక్టరేట్లో రేపు సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.
పకృతి విలయతాండవంతో జిల్లాలో భారీ నష్టం సంభవించినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నిజాంపేట్ మండలంలో వరదలతో కోతకు గురైన వంతెనలు రోడ్లను పరిశీలించారు. 11 మండలాల్లో వర్షాల వరదలతో నష్టాలు కలగాయని, రెండు మండలాల్లో 300 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం, వరదల ప్రవాహంతో భారీ నష్టం సంభవించినట్లు వివరించారు. 130 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించినట్టు వివరించారు.
రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు పర్యటించారు. గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గ్రామంలో నీట మునిగిన పొలాలను, కొట్టుకుపోయిన బ్రిడ్జిని, చిన్న చెరువు కట్టను ఆయన పరిశీలించారు. నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కమ్మరి రమేశ్ ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం మన పాఠశాల-మన ఆత్మగౌరవం కార్యక్రమాన్ని నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సంగారెడ్డిలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మన పాఠశాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు.
రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాకు మెదక్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలిరావాలని ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యా నాయక్, మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజు అయినా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. సింగూరు నుంచి మంజీరా నదికి భారీగా నీరు విడుదల అవుతున్నందున, వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
రేగోడ్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరిపడా లభించేలా, నిల్వలు సక్రమంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జావీద్, AEOలు మహేష్, భూలక్ష్మి పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వత తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.
మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని సాయిగాంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు సింగూరు ప్రాజెక్టుకు
సుమారు లక్ష క్యూసెక్కులు వస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సింగూర్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు మంజీరాకు విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీరా నది వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపారు.
Sorry, no posts matched your criteria.