Medak

News March 30, 2025

MDK: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

image

ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారు పూర్తిస్థాయిలో రుసుము చెల్లించి ప్లాట్‌ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం 25% రాయితీని వర్తింపజేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 29, 2025

తుది శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తా: శేరి సుభాష్ రెడ్డి

image

ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శేరి సుభాష్ రెడ్డి శనివారం ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉద్యమ ఆరంభం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తుది శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తానని సుభాష్ రెడ్డి అన్నారు.

News March 29, 2025

మెదక్ ప్రజలకు ఎస్పీ ఉగాది, రంజాన్ విషెస్

image

మెదక్ జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులకు తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ పండగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తీపి చేదు షడ్రుచుల కలగలిపి ఆస్వాదిస్తూ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ, ముస్లింలు పవిత్ర మాసం రంజాన్ పండగలు ఏకకాలంలో వస్తున్నందున కులమతాలు వేరైనా మనమందరం భారతీయులమన్న విషయం మర్చిపోవద్దన్నారు.

News March 29, 2025

జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులుండాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ.. తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. భర్త అనుమానమే కారణమా?

image

SRD జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమెపై అనుమానంతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో పట్టింటికి వెళ్లింది. పెద్దలు చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వేధిస్తే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది.

News March 29, 2025

SRD: ముగ్గురు పిల్లలు మృతి.. ఇప్పుడే ఏం చెప్పలేం: SP

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ మాట్లాడారు. ‘క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులను ఆరా తీశాం. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పిల్లలు ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’ అని వివరాలు వెల్లడించారు.

News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. UPDATE

image

అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.

News March 29, 2025

సంగారెడ్డి: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ శిక్షణ కేంద్రంలో టైలరింగ్ ఉచిత శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలలోపు మహిళలు అర్హులని చెప్పారు. తెల్ల రేషన్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 29, 2025

చరిత్రకు వారధులు కవులు: నందిని సిధారెడ్డి

image

చరిత్రకు వారధులు కవులు అని, చరిత్ర భావి తరాలకు తెలియాలంటే కవుల కలాలు కదిలించాలని తెలంగాణ తెలుగు సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్ లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని ఉద్యమాల్లో కవితోద్యమం ఎంతో గొప్పది అన్నారు.

News March 28, 2025

సంగారెడ్డిలో మరో విషాదం..

image

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!