Medak

News May 29, 2024

కల్హేరు: కుమార్తెను చూసేందుకు వచ్చి తండ్రి మృతి

image

కుమార్తెను చూసేందుకు వచ్చిన తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కల్హేర్ ASI అంజయ్య తెలిపారు. అంస్సాన్‌‌పల్లికి చెందిన శ్రీధర్‌కు 2 ఏళ్ల క్రితం నాగధర్ గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వీరికి ఇటీవలే కూతురు పుట్టింది. రెండు రోజుల క్రితం శ్రీధర్ తన కూతుర్ని చూడడానికి భార్య పుట్టింటికి రాగా ఛాతి నొప్పితో ఇంట్లో కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.

News May 29, 2024

కల్హేర్: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కల్హేర్ ASI అంజయ్య తెలిపిన వివరాలు.. మునిగేపల్లి తండాకు చెందిన లక్ష్మీ(28)కి కొన్నేళ్ల కిందట రాజుతో వివాహమైంది. కొన్నాళ్లుగా కుటుంబ కలహాలతో ఆమె మనస్తాపం చెంది రెండు రోజుల కిందట పురుగుమందు తాగి అపస్మారక స్థితికి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదయింది.

News May 29, 2024

MDK: ఇన్‌స్టాలో లవ్.. యువకుడి సూసైడ్

image

లవ్ ఫెయిల్ అయి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ZHBలో జరిగింది. ఆనెగుంటకు చెందిన వెంకట్(30) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో NZB జిల్లా బాల్కొండకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. కొద్దిరోజులకు ఆమె కూడా పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది పట్టణ శివారులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

News May 29, 2024

సిద్దిపేట: అమ్మనాన్నల స్ఫూర్తితో.. విమానం నమూనా తయారీ

image

సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మి భాస్కర్ దంపతుల కుమారు లక్ష్మీనరసింహ HYDలో ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. యువకుడి తల్లి వృధా వస్తువులతో పలు అలంకరణ వస్తువులు తీర్చిదిద్దేది. తండ్రి టీవీ మెకానిక్, వ్యాపారి. అమ్మానాన్నల స్ఫూర్తి పొందిన ఆయన బ్యాటరీలతో గాల్లో విమానం నమూనాని ఎగరేసేందుకు శ్రమిస్తున్నారు. విమానం, లారీ, స్మార్ట్ టీవీ నమూనాలను తయారు చేశారు.

News May 29, 2024

సిద్దిపేట: గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. TGPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో భాగంగా మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని మంగళవారం సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్, అబ్జర్వర్స్, రూట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి చర్చించారు.

News May 28, 2024

కొల్చారం: తల్లిదండ్రుల మందలింపు.. యువకుడి ఆత్మహత్య

image

కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయికృష్ణ (22) సంవత్సరాల యువకుడు జూస్టాల్ మూసివేసి జులాయిగా తిరుగుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన సాయికృష్ణ ఈనెల 24న పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతిచెందినట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 28, 2024

తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్, మరో నలుగురి అరెస్టు

image

మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ, మరో నలుగురిని అరెస్టు చేసినట్లు మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. కూచారంలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడంతో గతంలో నలుగురిని అరెస్టు చేశారు. ఈరోజు విచారణ జరిపి అందుకు బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు

News May 28, 2024

సెమీఫైనల్‌లో మెదక్ జట్టు విజయం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మెదక్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జిల్లా జట్టు 17.4 ఓవర్లలో 84 పరుగులకు అలౌట్ అయింది. 53 పరుగుల తేడాతో ఖమ్మంపై మెదక్ జట్టు విజయం సాధించింది.

News May 28, 2024

మెదక్: అవతరణ వేడుకలకు జెండా ఎగురవేయనున్న కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్బంగా ఈసారి కలెక్టర్ రాహుల్ రాజ్ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఇదివరకు మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేసేది. కానీ ఈసారి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అధికారులు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

News May 28, 2024

పటాన్‌చెరు: యువతి ఆత్మహత్య

image

మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్‌చెరులోని అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లాకు చెందిన శ్రావణి (26), అంజయ్య దంపతులు పిల్లలతో కలిసి ఏడాదిన్నరగా అమీన్‌పూర్ పరిధి జానకంపేటలో పాడి గేదెలు పెంచుకుంటూ పాల వ్యాపారంతో జీవిస్తున్నారు. సోమవారం భర్త గేదెలను మేపడానికి బయటకు వెళ్లారు. ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో ఉన్న శ్రావణి ఇంట్లో ఉరేసుకుంది.