India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశానికి ప్రధాని మోదీయే శ్రీరామరక్ష అని, దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో తాను చెల్లని రూపాయిని అయితే కామారెడ్డిలో చెల్లని మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. దుబ్బాక అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. మీరు చేసే ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పురిటి గడ్డ సిద్దిపేటకు రానున్నారు. మెదక్ MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ రోడ్షో, సభ నిర్వహించేలా హరీశ్రావు ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు సిద్ధయయ్యారు. కాగా ఈ సభతో కేసీఆర్ ప్రచారం ముగియనుంది.
‘నీలం మధు మీద పోటీకి KNR జిల్లా నుంచి వెంకట్రాంరెడ్డిని తీసుకొచ్చారు, మెదక్ జిల్లాలో BRS నుంచి పోటీ చేసే మొగోడు దొరకలేదా’ అని CM రేవంత్ రెడ్డి, KCRను ప్రశ్నించారు. నేడు నర్సాపూర్లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ కోసం రైతుల భూములు గుంజుకున్నోడు వెంకట్రాంరెడ్డి అని ఆరోపించారు. దుబ్బాక ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన రఘునందన్ను ఎన్నికల్లో ఓడగొట్టి మధును గెలిపించాలని అన్నారు.
జహీరాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడి అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్లారిటీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నమ్ముకున్న కార్యకర్తలే ఎటు ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సవాల్గా మారిందని టాక్.
సైబర్ నేరగాళ్ల బారినపడి ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు పోగొట్టుకున్న ఘటన పటాన్చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్చెరుకు చెందిన ప్రభుత్వ టీచర్ ఈశ్వర్ ఫోన్కు ఆన్లైన్ ఉద్యోగం పేరిట ఓ మెసేజ్ వచ్చింది. పెట్టుబడి పెట్టి టాస్కులు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పడంతో దఫదఫాలుగా రూ.3.99,582 పంపి టాస్కులు చేశాడు. తర్వాత మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొద్ది రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లైట్ బీర్లు అందుబాటులో లేవని నంగనూరులోని వైన్ షాపుల నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి బీర్ల కొరతను అరికట్టాలని రెగ్యులర్ కస్టమర్లు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ శివారులో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో పసికందు మృతదేహాన్ని దుండగులు వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం హైమద్ నగర్లో దారుణం జరిగింది. మద్యానికి బానిసగా మారిన పటాన్ ఫరూక్(35) మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహంతో తన తండ్రి వల్లిఖాన్పై కత్తితో దాడి చేశాడు. దీంతో వల్లిఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలీంచి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు అతిగా పోవద్దని, వచ్చేది మా ప్రభుత్వమేనని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాత్రి పటాన్చెరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో BRS అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రసంగించారు. పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించాలని, రాజకీయాల్లో వేలు పెట్టొద్దన్నారు. తెలంగాణ కోసం నా ప్రాణమైన బలి పెడతాను కానీ అన్యాయం జరగనీయం అన్నారు. బడే బాయ్ చోటే బాయ్ కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని <<13209937>>రైలు ఢీకొట్టిన<<>> ఘటనలో మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మాలోత్ ప్రకాశ్గా గుర్తించారు. తన సొంత పనులపై బైక్పై మెదక్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ప్రకాశ్ బంధువుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.