Medak

News May 31, 2024

మెదక్: నీటి కుంటలో మహిళా మృతదేహం

image

నార్సింగి 44వ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మహిళా మృతదేహం కలకలం రేపింది. రోడ్డు పక్కన నీటి కుంటలో సుమారు 40-45 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు మృతురాలు ఎవరు, ఎలా చనిపోయారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 31, 2024

MDK: ట్రిపుల్​ ఆర్ బాధితులకు పరిహారం టెన్షన్

image

రీజనల్​ రింగ్​రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులను సరైన పరిహారం అందుతుందాలేదా అన్న టెన్షన్​ వెంటాడుతోంది. ఇప్పటికే త్రీ డీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సేకరిస్తున్న భూములకు ఎకరానికి రూ.6 నుంచి 8లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రచారమవుతోంది. దీనికోసం 962.27 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన అధికారులు మార్కింగ్ చేశారు. పలు గ్రామాల్లో 1,168 మంది రైతుల భూములను సేకరించనున్నారు.

News May 31, 2024

అందుబాటులో విత్తనాలు.. ఆందోళన వద్దు: కలెక్టర్

image

కౌడిపల్లి మండలం నాగ్ సాన్ పల్లి గ్రామంలో డిసిఎంఎస్ ద్వారా విక్రయిస్తున్న పచ్చిరొట్ట విత్తనాల షాపును కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. రైతులకు సరిపడా జీలుగు, జానుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందవద్దని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3 లక్షల 73 వేల 500 ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినట్టు కలెక్టర్ తెలిపారు.

News May 30, 2024

గజ్వేల్: అనుమానాస్పదంగా యువకుడి మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన వడ్ల నరేశ్ చారీ ఆయన ఇంటి ముందు ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెంది పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ సీఐ సైదా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా మృతుడుది హత్యగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

బడి బాటను విజయవంతం చేయాలి: వల్లూరి క్రాంతి

image

జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పాలనాధికారి వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సంబంధిత బడిబాట సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేయాల్సిన పనులను వివరించారు. జేసీ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సీఎంఓ వెంకటేశం అన్ని విభాగాల అధికారులు, ఎంఈఓ, హెచ్ఎంలు పాల్గొన్నారు.

News May 30, 2024

నర్సాపూర్: భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్

image

భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని దోబీగల్లీలో నివాసముంటున్న ప్రశాంత్‌కు గత నెలలో రామంతపూర్ చెందిన యువతితో వివాహం జరిగింది. ఈనెల 17న పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్.. గత రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. తల్లి నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News May 30, 2024

సంగారెడ్డి: నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

image

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వతరణ దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News May 30, 2024

మెదక్: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

శివంపేట మండలం రత్నాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ అనే వ్యక్తి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత రాత్రి ఇంటి నుంచి వెళ్లిన నారాయణ గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

MDK: చట్నీలో బల్లి.. పలువురికి అస్వస్థత

image

చట్నీలో బల్లి పడగా.. అది తిన్న పలువురు అస్వస్థతకు గురైన ఘటన శివ్వంపేట మండలం నవాపేట్‌‌ గ్రామంలోని ఫ్లెమింగ్ కంపెనీలో జరిగింది. మంగళవారం కంపెనీ క్యాంటీన్ సిబ్బంది నిర్లక్ష్యంతో చట్నీలో బల్లి పడినప్పటికి గమనించని వర్కర్లు టిఫిన్ చేసి పనిలో నిమగ్నమవ్వగా.. 20మంది అస్వస్తతకు గురైయ్యారు. వారిని HYDలోని ఓ ఆస్పత్రికి తరలించారు. క్యాంటీన్ మెయింటనెన్స్ నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని వర్కర్లు ఆరోపించారు.

News May 30, 2024

సిద్దిపేట: మద్దూరు మండలంలో గుప్త నిధులు లభ్యం

image

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గుప్త నిధులు లభించాయి. నర్సాయపల్లి గ్రామంలో కూలీలు ఈరోజు ఉదయం ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్నారు. చల్ల మల్లారెడ్డి రైతు భూమిలో ఉపాధి పనుల్లో భాగంగా.. వరం చెక్కుతుండగా గుప్త నిధి బయటపడింది. అందులో కొన్ని ఉర్దూలో ఉన్న వెండి నాణాలు బయట పడ్డాయి. వాటిపై అధికారులు విచారణ చేపట్టారు.