India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని చిన్న నిజాంపేట గ్రామంలో కోనాపురం రాజు(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, కొడుకు(6) ఉన్నారు. వివరాల్లోకి వెళితే కుటుంబ కలహాలతో వారి పొలం దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు తెలిపారు. దీనిపై భూంపల్లి పోలీసులు పంచనామ నిర్వహించి, కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో వరుస విషాదాలు భక్తులను ఆందోళన కలిగిస్తున్నాయి. దర్శనానికి వస్తున్నభక్తులు నీటమునిగి చనిపోతున్నారు. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర భక్తులు వారాల తరబడి హాలిడేస్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఆలయం వద్ద చెక్డ్యాం, వనదుర్గా ప్రాజెక్ట్, ఫతేనహర్ కాలువలో చనిపోతున్నారు. స్నాన ఘట్టాలు లేక, ఎంతలోతుందో తెలియక రాళ్లల్లో ఇరుక్కొని చనిపోతున్నారు.
మెదక్ పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో బుధవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమాలను పాటిస్తూ కౌంటింగ్ సిబ్బంది పనిచేయాలన్నారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నమోదు చేస్తూ ఎన్నికల సంఘం నియమాలను తప్పకుండా పాటించాలన్నారు.
తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన జప సత్యనారాయణ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. మల్కాపూర్కు చెందిన కవితతో ఆరేళ్ల క్రితం సత్యనారాయణ పెళ్లి కాగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా ఆడపిల్లలు పుట్టారని మదినపడి సత్యనారాయణ నిన్న పురుగు మందు తాగాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.
లోక్సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మెదక్, జహీరాబాద్లో మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది? అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం. కాగా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
JNTUH యూనివర్సిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ నాలుగో సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షల తేదీలను మారుస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. జూన్ 8వ తేదీ, 15వ తేదీన నిర్వహించనున్న పరీక్ష తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు వాటిని జులై 5వ తేదీ, 8వ తేదీన నిర్వహిస్తామని అన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఒక ప్రకటన విడుదల చేశారు.
టేక్మాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) అదృశ్యమైనట్లు ఎస్సై మురళి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి యువతి భోజనం చేసి పడుకుంది. ఉదయం లేచి చూస్తే కనిపించకపోవడంతో బంధువుల వద్ద చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు నేడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో బుధవారం జరిగిన T20 ఫైనల్ మ్యాచ్లో మెదక్ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మెదక్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే సాధించింది. 23 పరుగుల తేడాతో మెదక్ జట్టు ఫైనల్లో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది.
కుమార్తెను చూసేందుకు వచ్చిన తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కల్హేర్ ASI అంజయ్య తెలిపారు. అంస్సాన్పల్లికి చెందిన శ్రీధర్కు 2 ఏళ్ల క్రితం నాగధర్ గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వీరికి ఇటీవలే కూతురు పుట్టింది. రెండు రోజుల క్రితం శ్రీధర్ తన కూతుర్ని చూడడానికి భార్య పుట్టింటికి రాగా ఛాతి నొప్పితో ఇంట్లో కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.
కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కల్హేర్ ASI అంజయ్య తెలిపిన వివరాలు.. మునిగేపల్లి తండాకు చెందిన లక్ష్మీ(28)కి కొన్నేళ్ల కిందట రాజుతో వివాహమైంది. కొన్నాళ్లుగా కుటుంబ కలహాలతో ఆమె మనస్తాపం చెంది రెండు రోజుల కిందట పురుగుమందు తాగి అపస్మారక స్థితికి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదయింది.
Sorry, no posts matched your criteria.