India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లవ్ ఫెయిల్ అయి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ZHBలో జరిగింది. ఆనెగుంటకు చెందిన వెంకట్(30) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్స్టాగ్రామ్లో NZB జిల్లా బాల్కొండకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. కొద్దిరోజులకు ఆమె కూడా పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది పట్టణ శివారులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మి భాస్కర్ దంపతుల కుమారు లక్ష్మీనరసింహ HYDలో ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. యువకుడి తల్లి వృధా వస్తువులతో పలు అలంకరణ వస్తువులు తీర్చిదిద్దేది. తండ్రి టీవీ మెకానిక్, వ్యాపారి. అమ్మానాన్నల స్ఫూర్తి పొందిన ఆయన బ్యాటరీలతో గాల్లో విమానం నమూనాని ఎగరేసేందుకు శ్రమిస్తున్నారు. విమానం, లారీ, స్మార్ట్ టీవీ నమూనాలను తయారు చేశారు.
గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. TGPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో భాగంగా మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని మంగళవారం సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్, అబ్జర్వర్స్, రూట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్తో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి చర్చించారు.
కొల్చారం మండలం నాయిని జలాల్పూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయికృష్ణ (22) సంవత్సరాల యువకుడు జూస్టాల్ మూసివేసి జులాయిగా తిరుగుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన సాయికృష్ణ ఈనెల 24న పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతిచెందినట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ, మరో నలుగురిని అరెస్టు చేసినట్లు మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. కూచారంలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడంతో గతంలో నలుగురిని అరెస్టు చేశారు. ఈరోజు విచారణ జరిపి అందుకు బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో మెదక్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఖమ్మం జిల్లా జట్టు 17.4 ఓవర్లలో 84 పరుగులకు అలౌట్ అయింది. 53 పరుగుల తేడాతో ఖమ్మంపై మెదక్ జట్టు విజయం సాధించింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్బంగా ఈసారి కలెక్టర్ రాహుల్ రాజ్ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఇదివరకు మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేసేది. కానీ ఈసారి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అధికారులు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్చెరులోని అమీన్పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లాకు చెందిన శ్రావణి (26), అంజయ్య దంపతులు పిల్లలతో కలిసి ఏడాదిన్నరగా అమీన్పూర్ పరిధి జానకంపేటలో పాడి గేదెలు పెంచుకుంటూ పాల వ్యాపారంతో జీవిస్తున్నారు. సోమవారం భర్త గేదెలను మేపడానికి బయటకు వెళ్లారు. ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో ఉన్న శ్రావణి ఇంట్లో ఉరేసుకుంది.
మెదక్ జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. వల్లూరు నుంచి మక్కరాజుపేట వెళ్తున్న ఓ ఆటో.. చేగుంట మండలం రెడ్డిపల్లి 44వ జాతీయ రహదారిపై లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారంతా మక్కరాజుపేట గ్రామస్థులుగా సమాచారం.
గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరిగేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని సమకూర్చడంపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు, 5,778 వార్డులు, సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు 4,476 వార్డులు, మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 4,086 వార్డులు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.