India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జీడీ రామకృష్ణ(38) గుండెపోటుతో మంగళవారం మరణించారు.ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలపగా హుటాహుటిన HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. కాగా నెల రోజుల క్రితం అతడి తండ్రి చనిపోయాడు. వరుసగా తండ్రి కొడుకుల మరణంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుపై సంగారెడ్డి పట్టణ పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు.
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగరాజు 3 రోజులుగా కనిపించడం లేదు. చేగుంటలో నివాసం ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. 3 రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అతడి కుమారుడు వంశీధర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లోనే ఫోన్లు, బైక్ వదిలి వెళ్లాడు. కేసు నమోదైంది.
ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్లోనే ఎండలు మోత మోగిస్తున్నాయి. ఉ.8 అయిందంటే చాలు బయటకు వెళ్లలేని పరిస్థితి. కానీ ఇది ఎన్నికల సీజన్ కావడంతో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ శ్రేణులకు ఎండలో తిరిగి ప్రచారం చేయడం తప్పడం లేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడితో ప్రచారంలో పాల్గొన్న వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మెదక్ జిల్లా హవేలిఘనపూర్కు చెందిన గుండ్లకుంట బాబు(45)కు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి లక్ష్మీశారద తీర్పునిచ్చినట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. మండలానికి చెందిన అమ్మాయిని వేధిస్తూ.. ‘నా దగ్గరికి రాకపోతే మీ తల్లిని చంపేస్తా’ అని బెదిరించాడని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించినట్లు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర దీక్ష చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మోదీ దగ్గర దీక్ష చేయాలన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సాయి సమావేశంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని, అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని, పేద కుటుంబాలకు ఒక రూపాయి ఖర్చుతో పేరు నమోదు చేసేలా ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఖాన్ మహల్కు చెందిన సాబిల్, రెహాన్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ స్థానిక రాంనగర్ చౌరస్తా సమీపంలో ఇసుక లారీని వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.