Medak

News May 4, 2024

తూప్రాన్: తల్లి, ముగ్గురు పిల్లలు MISSING

image

తూప్రాన్ పట్టణంలో నివాసముండే కిష్టాపూర్‌కు చెందిన వడ్ల పవన్ భార్య అర్చన (27), ముగ్గురు పిల్లలు కార్తీక్(10), ఈశ్వర్(4), అక్షయ(6) అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. 13ఏళ్ల క్రితం యాదాద్రి జిల్లాకు చెందిన అర్చనను పవన్ ప్రేమ వివాహం చేసుకోగా.. తూప్రాన్‌లో ఉంటున్నారు. కిష్టాపూర్‌లో తల్లిదండ్రుల వద్ద గల మరో ఇంట్లో ఉండేందుకు నిర్ణయించడంతో గొడవ చేసింది. నిన్న ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయింది.

News May 3, 2024

సిద్దిపేట: పెళ్లిరోజు విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి

image

జగదేవ్పూర్ మండలం తీగుల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుకూరి వెంకటేశం(45) పెళ్లిరోజు మృతి చెందాడు. తీగుల్‌కు చెందిన వెంకటేశం పెళ్లిరోజు కావడంతో భార్య, పిల్లలతో ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అతను పనిచేసే ప్రజ్ఞాపూర్ రెస్టారెంట్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

News May 3, 2024

సిద్దిపేట: సైబర్ వలకు చిక్కిన మహిళ

image

సిద్దిపేటకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాడి చేతిలో మోసపోయింది. సీపీ తెలిపిన వివరాలు.. ఓ వ్యక్తి ఫోన్ చేసి ఓ ప్రముఖ కంపెనీలో బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయని చెప్పగానే నమ్మిన మహిళ నిందితుడు చెప్పిన విధంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విడతలుగా రూ.16,75,750 పంపించింది. అనంతరం ఆ నంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే 1930కి ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు.

News May 3, 2024

సిద్దిపేట: రైస్ మిల్ యజమాని ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లచ్చపేట వార్డుకు చెందిన వ్యాపారవేత్త కాచం నాగార్జున(57) గ్రామంలోని మహేశ్వర రైస్ మిల్లులో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఆ రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇదే క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 3, 2024

BRS లేకుండా చేయాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర: హరీశ్ రావు

image

కాంగ్రెస్, బీజెపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలో చెరో 8 ఎంపీ స్థానాలను పంచుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. BJP పదేళ్ల పాలన, కాంగ్రెస్ 5 నెలల పాలనపై మాట్లాడకుండా మతం, రిజర్వేషన్ల పేరిట సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

News May 3, 2024

మెదక్: రోడ్డుపై వడ్ల కుప్పను ఢీకొని ఒకరు మృతి

image

మనోహరాబాద్ మండలం పాలాట వద్ద రాత్రి వడ్ల కుప్పని ఢీకొని సుంచు సత్యనారాయణ(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. పోతారం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాత్రి ద్విచక్రవాహనంపై పాలాట మీదుగా లింగారెడ్డిపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలాట వద్ద రోడ్డుపై పోసిన వడ్ల కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.

News May 3, 2024

సిద్దిపేటలో అరుదైన శస్త్ర చికిత్స

image

సిద్దిపేటలోని ఓ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేశారు. జీర్ణాశయంలో ఏర్పడిన కంతి క్యాన్సర్‌ను వైద్యులు తొలగించారు. వైద్యులు తెలిపిన వివరాలు.. తొగుట మండలంలోని పల్లెపహాడ్‌కు చెందిన రహమాన్ అనే వ్యక్తికి కడుపులోని జీర్ణాశయంలో కంతి క్యాన్సర్ ఏర్పడింది. దీంతో ఆమెకు అరుదైన శాస్త్ర చికిత్స చేసి ఆ కంతిని తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

News May 3, 2024

మెదక్: బాలికపై అత్యాచారం..!

image

రామాయంపేట మండల పరిధిలో బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 29న బాలికపై ఇద్దరు కలిసి అత్యాచారం చేయగా బాధితురాలు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 3, 2024

కాంగ్రెస్, BJPలకు కర్రు కాల్చి వాత పెట్టాలి: హరీష్ రావు

image

కాంగ్రెస్, BJPలకు కర్రు కాల్చి వాత పెట్టాలి అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌తో కలిసి అక్కన్నపేట మండల కేంద్రం రోడ్ షో‌లో పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ప్రజల తలరాతను మారుస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

News May 3, 2024

సిద్దిపేట‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

సిద్దిపేటలోని హోసింగ్ బోర్డు కమాన్ వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు స్థానికంగా ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్‌గా పనిచేస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది.