Medak

News June 22, 2024

ఓయూ: జులై 6వ తేదీ నుంచి సీపీజీఈటీ పరీక్షలు

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT

News June 22, 2024

బస్సు పాస్ కోసం User ID, Password పొందాలి: RM

image

విద్యార్థుల బస్సు పాసుల కోసం యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాలని ఆర్టీసీ RM ప్రభులత తెలిపారు. ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థలు తెరుచుకున్న సందర్భంగా బస్సు పాసుల కోసం సంగారెడ్డి రీజనల్‌లోని 8 డిపోల్లో అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బస్సు పాసుల కోసం విద్యార్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని కళాశాలల యాజమాన్యం అప్రూవల్ చేయాలన్నారు. తర్వాత బస్సు పాస్ పొందవచ్చని అన్నారు.

News June 21, 2024

HYD: పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

News June 21, 2024

సంగారెడ్డి: మద్యానికి బానిసై యువకుడి మృతి

image

మద్యానికి బానిసైన ఓ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు.. అర్బింద్ కుమార్(27) భార్య, పిల్లలతో కలిసి 3ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుంచి సంగారెడ్డి సదాశివపేటకు వలస వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని తన భార్య స్వగ్రామానికి తీసుకెళ్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రాగా 4వ గేట్ సమీపంలో అర్బింద్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు.

News June 21, 2024

ఎంపీ రఘునందన్ పిటిషన్.. వారికి బెయిల్ మంజూరు

image

ఇటీవల మెదక్​ పట్టణంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణకు సంబంధించిన కేసులో ఓ వర్గానికి చెందిన 16 మందికి శుక్రవారం బెయిల్​ మంజూరైంది. ఘర్షణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​, మెదక్​ టౌన్​ ప్రెసిడెంట్ నాయిని ప్రసాద్ తదితర 16 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. వారి తరఫున అడ్వకేట్‌గా​ ఎంపీ రఘునందన్​ రావు, అడ్వకేట్​ సంతోష్​ రెడ్డి ​గురువారం బెయిల్ పిటిషన్ వేశారు.

News June 21, 2024

రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప.. ఉద్యోగాల చర్చ లేదు: జగ్గారెడ్డి

image

బీజేపీ, మంత్రులకు రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే ఉద్యోగుల చర్చ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేరికల అంశం తన పరిధిలో లేదని తెలిపారు.

News June 21, 2024

ఏసీబీకి చిక్కిన న్యాల్‌కల్ RI దుర్గయ్య

image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ దుర్గయ్య రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా అధికారుల్లో అవినీతి తగ్గడం లేదని జిల్లాలో చర్చించుకుంటున్నారు.

News June 21, 2024

రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత జయశంకర్‌: హరీశ్ రావు

image

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి, మ్మెల్యే హరీశ్‌ రావు నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన సిద్ధాంత కర్త అని చెప్పారు. ఆయన స్ఫూర్తిని చెదరకుండా తమ గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నామని తెలిపారు. జయహో జయశంకర్ సార్, యావత్‌ తెలంగాణ పిడికిలెత్తి జోహారులర్పిస్తున్నదంటూ సామాజిక మాధ్యమం X వేదికగా నివాళులు అర్పించారు.

News June 21, 2024

ములుగులో కారు ఢీకొని విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన ములుగులో గరువారం జరిగింది. SI విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. ములుగు గ్రామానికి చెందిన తన్నీరు జస్వంత్ కాలేజ్‌కు వెళ్తున్న క్రమంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్లున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జస్వంత్‌కు తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మక్కపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 21, 2024

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: RJD

image

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోతి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని బాల రక్షాబంధన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.