Medak

News May 1, 2024

సంగారెడ్డి: ఈనెల 7 వరకు పాలీసెట్ దరఖాస్తుకు అవకాశం

image

పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 7 వరకు పెంచినట్లు సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని చెప్పారు. మే 24న ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పదవ తరగతి చదివిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 1, 2024

వర్గల్: హల్దీవాగులో మృతదేహం లభ్యం

image

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గల చెక్ డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు గౌరారం పోలీసులు తెలిపారు. సుమారు 35ఏళ్ల వయసు కలిగి ఉన్న మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వివరించారు. హల్దీవాగులో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

News May 1, 2024

SRD: రావి ఆకుపై మేడే ‘లోగో’.. కార్మికులకు శుభాకాంక్షలు

image

కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గూడూరి శివకుమార్ బుధవారం రావి ఆకుపై కార్మికుల లోగో చిత్రాలను గీసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక దినోత్సవం దాని మూలాలను కార్మిక సంఘం ఉద్యమంలో కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రావి ఆకుపై లేబర్ల వృత్తి ఆయుధాలైన కొడవలి, సుత్తి, పాన చిత్రాలను సూచిస్తూ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

News May 1, 2024

నిప్పుల కొలిమిలా మెదక్.. జాగ్రత్త ప్రజలారా..!

image

ఉమ్మడి జిల్లాలో మే నెల ప్రారంభానికి ముందునుంచే సూర్యుడు సుర్రుమంటుండు. తాజాగా జిల్లాలో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయి. మరో మూడు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని అంటున్నారు.

News May 1, 2024

మే డే శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

image

శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు. మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు. మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నానంటూ తెలిపారు.

News May 1, 2024

SRD: స్టేట్ ర్యాంకర్ సుల్తానాను అభినందించిన మంత్రి

image

SRD: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 1000 మార్కులకు 993 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాదించిన మెహ్రీన్ సుల్తానాను రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. సంగారెడ్డి‌లోని తన నివాసంలో మెహ్రీన్ సుల్తానా తండ్రి మహమ్మద్ సుజాయత్ అలీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

News May 1, 2024

MDK: అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

image

మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్సీ అభ్యర్థులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ పద్ధతిలో గుర్తులు కేటాయించారు.

News May 1, 2024

కాంగ్రెస్ రాజకీయం ముందు బిజెపి బచ్చా: జగ్గారెడ్డి వ్యాఖ్యలు

image

బిజెపి, కాంగ్రెస్ పుట్టు శత్రువులని, కాంగ్రెస్ రాజకీయ ముందు బిజెపి బచ్చా.. అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మోడీ, అమిత్ షాలకు భయం పట్టుకొని ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అంటే వారికి దడ పుట్టింది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇస్తామన్నారు.

News May 1, 2024

గుంపు మేస్త్రీ గూబ పగలాలి: హరీశ్‌రావు

image

తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన గుంపు మేస్త్రీకి పార్లమెంట్ ఎన్నికల్లో గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు షో‌లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి‌తో కలిసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం చేసి మన చెరువులు కుంటల్లోకి నీళ్ళు తెచ్చిన కేసీఆర్‌కు పట్టం కట్టాలని ఆయన కోరారు.

News May 1, 2024

అల్లదుర్గ్: మోదీ రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

image

భాజపా మెదక్, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిల్‌లకు మద్దతుగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రసంగించారు. అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారులో నిర్వహించిన సభకు అత్యధిక జనాభా రావడంతో బీజేపీ శ్రేణుల్లో, యువతలో జోష్ నింపింది. ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సభ సక్సెస్ అయిందని బీజేపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.