Medak

News May 1, 2024

సంగారెడ్డి: మోడీ, షా ఆదేశాల వరకే గాంధీ భవన్‌కు పోలీసులు

image

మోడీ, అమిత్ షా ఆదేశాల వరకే ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కి వచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారిందని విమర్శించారు. టీవీలో చూపిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని తెలిపారు.

News April 30, 2024

బాల రాముడి వెండి ప్రతిమను పీఎంకు బహుకరించిన ఎంపి

image

అల్లాదుర్గం వద్ద జరిగిన విశాల్ జనసభ కార్యక్రమం వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జహీరాబాద్ ఎంపీ, బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఘనంగా స్వాగతించి ఆయన ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా బాల శ్రీరాముడి వెండి ప్రతిమను ప్రధానమంత్రి మోడీకి బీబీ పాటిల్ బహూకరించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఎంపీకి, పీఎం సూచించినట్లు పార్టీ వర్గీయులు తెలిపారు.

News April 30, 2024

జగదేవ్‌పూర్: చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేవి తప్పుడు పనులు: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవి శ్రీరంగనీతులని, చేసేవి అన్ని తప్పుడు పనులేనని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీశ్ రావు ప్రసంగించారు. రుణమాఫీ చేయలేదని, హామీలు అమలు చేయలేదని, రాజీనామా చేస్తానంటే పారిపోయిండని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అయితే తిట్లు లేకుంటే దేవుని మీద ఓట్లు చేస్తున్నట్లు ఆరోపించారు.

News April 30, 2024

సిద్దిపేట: ‘అంజన్నకు ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు’

image

సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.

News April 30, 2024

మెదక్: ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఈవీఎంలు..

image

మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, మూడు ఈవీఎంలు అవసరం కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.

News April 30, 2024

మెదక్ లోక్‌సభకు రికార్డుస్థాయిలో అభ్యర్థుల పోటీ

image

రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మెదక్‌ లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఎన్నిక ఖర్చు కూడా అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, మెదక్‌ ఎన్నికలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.

News April 30, 2024

మెదక్: ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఈవీఎంలు..

image

మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, 44 మంది పోటీలో ఉండడంతో మూడు ఈవీఎంలో అవసరము కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.

News April 30, 2024

UPDATE: పెళ్లైన మూడు రోజులకే వరుడు మృతి.. వధువు పరిస్థితి విషమం

image

మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద రాత్రి జరిగిన <<13149362>>రోడ్డు ప్రమాదం<<>>లో పెళ్లైన మూడు రోజులకే వరుడు దుర్మరణం చెందగా వధువు పరిస్థితి విషమంగా ఉంది. చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఎర్రోళ్ల వెంకటేష్(22)కు మాసాయిపేట మండలం పోతన్పల్లికి చెందిన శ్రీలతతో ఈనెల 26న వివాహం జరిగింది. కాగా రాత్రి బైక్‌పై దంపతులు పోతన్‌పల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.

News April 30, 2024

సిద్దిపేట: సమగ్ర వివరాలకు క్యూఆర్ స్కాన్

image

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎన్నెన్నో మార్పులు సంతరించుకుంటాయి. ఇది వరకు ఓటరు స్లిప్ పై ఓటరు ఫోటోతో పాటు వివరాలు ఉండేవి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అందులో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. ఓటరు స్లిప్ పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఓటరు పూర్తి వివరాలు కనిపిస్తాయి.

News April 30, 2024

సిద్దిపేట: నాడు తండ్రి.. నేడు తల్లిని చంపిన కొడుకు

image

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తిలో కొడుకు నరసింహులు దాడిలో గాయపడిన తల్లి భారతమ్మ(55) మృతి చెందింది. మద్యానికి బానిసైన నర్సింలు ఈనెల 27న తల్లితో గొడవపడి దాడి చేశాడు. చికిత్స పొందుతూ ఆమె నిన్న చనిపోయింది. కాగా 9ఏళ్ల క్రితం తండ్రి బాలమల్లుతో గొడవపడి దాడి చేయగా మృతి చెందాడు. కూతురు సరస్వతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.