India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూప్రాన్లో సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ ప్రభుత్వ టీచర్ డబ్బులు పోగొట్టుకున్నాడు. టీచర్ మనీష్ రెడ్డి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ద్వారా వివేకానంద వాల్ పోస్టర్ బుక్ చేశారు. అయితే ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఉపాధ్యాయుడి ఖాతాలో ఉన్న రూ.75 వేలను మూడు విడతలుగా కాజేశారు. సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇళ్లలో పని చేసే గృహా కార్మికులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. అంతర్జాతీయ గృహ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి లోని మెద్వాన్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గృహ కార్మికులు హక్కులపై అవగాహన ఎంచుకోవాలని చెప్పారు. సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బుధవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు ఎంపీ రఘునందన్ రావును కలిసి కోరారు. ఎంపీగా గెలిచిన రఘునందన్ రావును ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిసారు. శాలువా కప్పి అభినందనలు తెలిపి మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా ఎంపీ పార్లమెంట్లో వాణి వినిపించి ఉమ్మడి జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని కిసాన్ సాగర్ చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి రూరల్ ఎస్సై వినయ్ కుమార్ చేరుకొని క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. మృతుడి వయసు 22 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కాగా మృతుడు ఎవరు..?, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే చెప్పాలని ఎస్సై కోరారు.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ కోళ్లఫారంలో అల్ఫాజోలం తయారీ చేస్తున్న కేంద్రంపై జిల్లా SP రూపేష్, టీఎస్ న్యాబ్, గుమ్మడిదల పోలీసులు దాడి చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఆరు నెలలుగా మత్తు పదార్థాలైన అల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.40లక్షల విలువైన 2.60 లక్షల విలువైన అల్ఫాజోలం, రూ.60లక్షలు విలువైన ముడి పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు.

హుస్నాబాద్(M) కూచన్పల్లి వాసి నరసయ్య(55)ను <<13461790>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. SI మహేశ్ వివరాలు.. నర్సయ్య సామగ్రి ఏరుకుంటూ విక్రయించేవాడు. మద్యానికి బానిసై రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి అతని భార్య లేచి చూసేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి నర్సయ్య భార్య, తమ్ముడి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వర్షాకాలం మొదలై 17 రోజులైనా ఆశించిన స్థాయిలో చినుకు లేక రైతులకు నిరాశే ఎదురైంది. తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని, విత్తనాలు ఎరువులను సమకూర్చుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37,321 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా. ఇప్పటికి 9500 ఎకరాల్లో మాత్రమే సాగయింది. అందులో సగం కూడా మొలకెత్తలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నర్సాపూర్ నియోజకవర్గంలో రేపు జరిగే మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా బుధవారం ఉదయం 11 గంటల నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.

HYD రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించే దీనికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2 భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్నట్లు లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తర భాగం రహదారికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లాలని నిర్ణయించారు. దక్షిణ భాగం అలైన్మెంట్పై NHAI అధికారులు చర్చలు జరుపుతున్నారు.

హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామంలో జరిగిన హత్యోదంతం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన గీకురు నరసయ్య(55)ను ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు <<13460973>>గోడ్డలి<<>>తో నరికారు. భూ తగాదాల వల్ల జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలతో హత్య చేశారనే కోణంతో పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.