Medak

News May 20, 2024

సంగారెడ్డి: సీసీఎస్ సీఐ వెంకట సాయి కిషోర్ సస్పెన్షన్

image

సంగారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఐ) CI వెంకటసాయి కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట సాయిపై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను నెల క్రితం SP కార్యాలయానికి అటాచ్‌ చేయగా CCS విభాగంలో సీఐగా పోస్టింగ్‌ ఇచ్చారు. తాజాగా సస్పెన్షన్‌ కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

News May 20, 2024

మెదక్: ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని దాదాపు అన్నిగ్రామాల్లో వర్షం కురవడంతో వ్యవసాయ పొలాల్లో రైతులు దుక్కులు దున్నే పనుల్లో బిజీగా కనిపించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున 33.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. ట్రాక్టర్లు,తాడేద్దులతో దుక్కిలు దున్నుతున్నారు.

News May 20, 2024

MDK: గ్రామాల్లో పడకేసిన పాలన.. ఆగిన పారిశుద్ధ్య పనులు

image

పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతలో అలరారిన గ్రామాలు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లె పాలన పడకేసింది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్‌ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు కలిపి మొత్తం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1615 జీపీలు ఉన్నాయి. డ్రైనేజీలు, డంపింగ్‌ యార్డులు కంపు కొడుతుండగా మొక్కలు ఎండుతున్నాయి.

News May 20, 2024

మెదక్: స్కూల్ యూనిఫామ్.. ఈసారి ఆలస్యమే.!

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా అందజేసే రెండు జతల దుస్తుల పంపిణీ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. పాఠశాలలు తెరిచే నాటికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ముందుకు సాగడం లేదు. మెదక్ జిల్లాలో 899 ప్రభుత్వ పాఠశాలల్లో 78,286 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండు జతలుగా156,572 దుస్తులు అందజేయాల్సి ఉండగా, ఇప్పటికీ షర్టు, ప్యాంటు కు సంబంధించి 50 శాతం ముడి సరుకు సరఫరా అయ్యింది.

News May 20, 2024

సంగారెడ్డి: విద్యుద్ఘాతంతో మహిళ మృతి

image

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో విద్యుద్ఘాతంతో ఏర్పడే మ్యాతరి మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. మ్యాతరి మంగమ్మ ఇంట్లో ఉండగా విద్యుత్ షాక్ తగిలింది. దాంతో మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 20, 2024

REWIND: ఓడిపోయిన రఘునందన్ రావు!

image

అసెంబ్లీ ఎన్నికలు BJP అభ్యర్థి రఘునందన్‌రావుకు కలిసి రావడం లేదనే చర్చ స్థానికంగా నడుస్తోంది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా 2020 ఉప ఎన్నికల్లో మాత్రం గెలిచారు. 2023లో 44,366 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. కాగా మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు ఈసారి తప్పకుండా గెలుస్తారని BJP శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండగా ఆయన గెలుస్తారో లేదో వేచి చూడాలి.

News May 20, 2024

జూన్ 7 నుంచి యధావిధిగా ప్రజావాణి: రాహుల్ రాజ్

image

మెదక్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పరిపాలన పరమైన కారణాలు, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు వివరించారు. విషయాన్ని ప్రజలు గమనించి రేపటి ప్రజావాణి కార్యక్రమానికి రావద్దని సూచించారు. జూన్ 7 నుంచి ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు

News May 20, 2024

సంగారెడ్డి: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో TGని వాడాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి TG అనే అక్షరాన్ని మాత్రమే వాడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. మే 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలోని బోర్డులు, వెబ్ సైట్‌లలో టీజీ అక్షరాలుగా మార్చాలని సూచించారు.

News May 19, 2024

UPDATE.. తూప్రాన్: పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు అన్న మృతి

image

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన <<13277126>>రోడ్డు ప్రమాదం<<>>లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన కర్రె నర్సింలు(40) మృతి చెందాడు. నరసింహులు తమ్ముడి వివాహం రేపు జరగాల్సి ఉండగా ఏర్పాట్లలో ఉన్నారు. నర్సింలు, బంధువు పోచయ్య ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తున్నారు. తమిళనాడుకు చెందిన సతీష్ కుమార్, మోహన్ సైతం బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొట్టగా, తీవ్రంగా గాయపడ్డారు.

News May 19, 2024

సంగారెడ్డి: రెండు చోట్ల ఓటేశారు !

image

నాగల్‌గిద్ద, కంగ్టి, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లోని సుమారు 40 గ్రామాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడ కర్ణాటక సరిహద్దు గ్రామస్థులు సైతం ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈనెల 7న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటేసి వీరు, తిరిగి తెలంగాణ MP ఎన్నికల్లోనూ ఓటేశారు. ఇలా ఆయా గ్రామాల్లో 75 శాతం పోలింగ్‌ నమోదైంది. నాగల్‌గిద్ద(M) ఏస్గి గ్రామంలో 150 మంది, గౌడ్‌గామ్‌జనవాడకు చెందిన 100 మంది 2చోట్ల ఓచేసినట్లు టాక్.