India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి బక్రీద్ తార్కాణమన్నారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో నడవాలని గొప్ప సందేశాన్ని మానవాళికి ఇస్తుందన్నారు. పండగ రోజున ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జైలులో ఉన్న వ్యక్తులను కలిసేందుకు మెదక్ MP మాధవనేని రఘునందన్ రావుకు హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. మెదక్ అల్లర్ల నేపథ్యంలో సుమారు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జైల్లో ఉన్న హిందువులను కలిసేందుకు ఎంపీ ప్రత్యేక అనుమతి పొందారు. ఈరోజు రాత్రి కలిసేందుకు అనుమతి లభించినట్లు సమాచారం.

మెదక్ జిల్లాలో రేపు బంద్కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని వివరించారు. ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం పేర్కొన్నాయి. జిల్లా బంద్కు ప్రజలు సహకరించాలని సందర్భంగా కోరాయి.

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మెదక్ పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన గొడవలకు, అనంతరం జరిగిన ధ్వంసం కేసులో ఇరువర్గాలలో 45 మందిని గుర్తించినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు ఊరుకోరని హెచ్చరించారు. సామాన్య ప్రజలు ఎవరిపైన కేసులు పెట్టే ఉద్దేశం లేదన్నారు. రెచ్చగొట్టే వారిని ఉపేక్షించమన్నారు.

మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాతోంది. స్వచ్ఛందంగా వర్తక, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. నిన్న రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగగా.. దానికి నిరసనగా బీజేపీ నాయకులు మెదక్ పట్టణ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్లో భారీగా పోలీసులు మోహరించారు.

జేసీబీ తవ్వకాల్లో బంగారం దొరికిందని మోసంతో రూ. 13 లక్షల తీసుకొని నకిలీ బంగారం అప్పగించిన ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం శివారు పాలెం గ్రామానికి చెందిన ఎం.ఆదెప్ప (32)ను అరెస్టు చేసినట్లు గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపారు. జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బలిజ గూడెం స్వామి మోసం చేశారు. వారి వద్ద నుంచి ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు

HYD ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) పొడవు పెరిగింది. ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పెంచాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా తాజా ఎలైన్మెంట్తో RRR ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 10.28 కి.మీ. పెరిగింది. దీంతో రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. అయితే గతంలో 340.51 కి.మీ. నిర్ణయించగా ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానం కోసం ఈ మార్పు అవసరమైందని అధికారులు తెలిపారు. ఈ మేరకు భూ సేకరణ చేయనున్నారు.

సంగారెడ్డి ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు పట్లోళ్ల అశ్విని రేపటి నుంచి 19 వరకు చైనాలో జరిగే 10వ ఏషియన్ పసిఫిక్ ఎక్సర్ సైజ్ స్పోర్ట్స్ సైన్స్ – 2024 సదస్సుకు ఎంపికయ్యారు. చైనాలో జరిగే సదస్సుకు 46 దేశాల ప్రతినిధులు పాల్గొంటుండగా.. ఈ సదస్సుకు భారత్ నుంచి ఫిజికల్ విభాగంలో అశ్విని ఒక్కరే ఎంపికయ్యారు.
Sorry, no posts matched your criteria.