Medak

News June 15, 2024

వనదుర్గ ప్రాజెక్టు‌లో మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు శుక్రవారం నీట మునిగి మృతి చెందాడు. నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడని పాపన్నపేట SI నరేశ్ తెలిపారు. HYDకి చెందిన ఎస్లీ వినోద్(48) స్థానికంగా వంట మనిషిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు వనదుర్గా ప్రాజెక్టులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేశామన్నారు.

News June 15, 2024

సంగారెడ్డి: మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

image

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు అర్హులని చెప్పారు. 18 నుంచి 45 సంవత్సరాల వరకు చిన్న మహిళలు సంగారెడ్డిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 15, 2024

సంగారెడ్డి: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం

image

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి ఫిరంగి శుక్రవారం తెలిపారు. ఈనెల 30లోగా https://studycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్‌ను ఫాలో కావాలని సూచించారు.

News June 14, 2024

మెదక్: వీడిన జంట హత్యల మిస్టరీ

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మే23న వెలుగు చూసిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. 25రోజుల క్రితం బంగారం కోసం తల్లిదండ్రులను వారి కొడుకే హత్య చేసినట్లు గుర్తించారు. జల్సాలకు అలవాటు పడ్డ లక్ష్మణ్ డబ్బు కోసం తల్లిదండ్రులను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News June 14, 2024

సంగారెడ్డి: రేపు ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు

image

బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపాధ్యాయులకు ఈనెల 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకుని మెడికల్ బోర్డు ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని డిఇఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News June 14, 2024

సార్వత్రిక ఫలితాల్లో సంగారెడ్డి ఫస్ట్.. సిద్దిపేట లాస్ట్

image

ఓపెన్(సార్వత్రిక) పది, ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. పదో తరగతితో 79.6% ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా ఫస్ట్ స్థానంలో నిల్వగా.. 77.95 %తో మెదక్ ద్వితీయ, 42.65% సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్‌లో సంగారెడ్డిలో 67.03 %, మెదక్ 60.16%, సిద్దిపేటలో 37.18% ఉత్తీర్ణత నమోదైనట్లు సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

News June 14, 2024

ధరణి సమస్యలు పరిష్కరించాలి: సీసీఎల్ఏ

image

పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాలపై సమీక్షించి వాటిని పరిష్కరించడంపై ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్ మనూచౌదరి పాల్గొన్నారు.

News June 14, 2024

సిద్దిపేట: మహిళపై దాడి చేసి పుస్తెలతాడు చోరీ.. ఇద్దరి అరెస్ట్

image

ములుగు మండలం తునికి బొల్లారం వాసి శ్యామల శంకరమ్మ దాడి చేసి 4.50 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మేడ్చల్ జిల్లా నాగలూరుకి చెందిన లింగని రజినీకాంత్(23), ఈరగల్ల యాదగిరి(36)గా గుర్తించినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. శంకరమ్మ ఈనెల 11న ఉదయం వాకింగ్ చేస్తుండగా దాడి చేసి పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. తూప్రాన్‌లో అమ్ముతుండగా ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు.

News June 14, 2024

గుమ్మడిదల: రోడ్డు ప్రమాదంలో బైక్ మెకానిక్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్‌ను ఢీకొని బైక్ మెకానిక్ మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండలంలో నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన గణేష్(31) బైక్ మెకానిక్. నిన్న రాత్రి తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం తిరిగి కారులో ఇంటికి వస్తుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

News June 14, 2024

సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు

image

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.