India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మహిపాల్ రెడ్డి(39) మృతిచెందగా, భార్య నవిత తీవ్రంగా గాయపడింది. బైక్పై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లగా మంటలు చెలరేగి ద్విచక్రవాహనం కాలిపోయింది. దీంతో మహిపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్) డా. మల్లారెడ్డి రైతులకు సూచించారు. వానకాలం సాగులో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమతుల్య సాగు అవసరమని తెలిపారు. నీటి సాంకేతికతకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు తీసుకోవాలని చెప్పారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, ఎస్ఐలు సిబ్బందితో కలిసి గత నెల రోజుల క్రితం సిద్దిపేట పట్టణం, పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 22 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు వచ్చింది. వారిని బుధవారం సిద్దిపేట న్యాయమూర్తి శ్రావణి ముందు హాజరుపరచగా విచారణ చేసి 22 మందికి రూ.25,500 జరిమానా విధించారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో మెదక్ ఎంపీ ఫలితాలపై జిల్లావ్యాప్తంగా బెట్టింగులు ఓ రేంజ్లో జరుగుతున్నట్లు సమాచారం. BRS అభ్యర్థి గెలుస్తాడని ఆ పార్టీ నేతలు అంటుంటే, తమ అభ్యర్థికే భారీ మెజారిటీతో గెలుస్తాడని కాంగ్రెస్, BJP నాయకులు బెట్టింగ్కు సై అంటున్నారు. దీనికి తెర పడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
సైబర్ వలలో పడి ఓ వ్యక్తి నగదు పోగొట్టుకున్న ఘటన ములుగు పరిధిలో చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్లు బాధితుడి ఫోన్కు ఓ లింక్ పంపి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభం పొందవచ్చని నమ్మబలికాడు. అది నమ్మిన బాధితుడు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ. 1,98,000 పంపించాడు. తదుపరి ఆ లింకును ఓపెన్ చేసి చూడగా బ్లాక్ చేసి ఉంది. మొసపోయానని గ్రహించి ఆ వ్యక్తి వెంటనే సైబర్ సెల్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మస్కూరి కృష్ణ(45) గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 13న స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లాడు. గోవాలో ఉండగా ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మస్కూరి కృష్ణ ప్రస్తుతం తూప్రాన్ పట్టణంలో గ్రానైట్ షాపు నిర్వహిస్తున్నారు. కృష్ణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 30 వరకు తొలిదశ అడ్మిషన్లు కొనసాగుతాయన్నారు. ఎంపీసీ, బైపిసి, సీఈసీ, హెచ్ఈసి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో బోధన జరుగుతుందన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలు విద్యార్థుల నుండి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. వివిధ కోర్సుల కొరకు దోస్ట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
మెదక్, జహీరాబాద్ MP స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్ల్లో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. మెదక్ లోక్సభ బీఆర్ఎస్ కంచుకోట అని, సిట్టింగ్ స్థానంలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.