India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేగోడు మండలంలో వాట్సాప్ గ్రూపుల్లో లింకులు పంపిస్తూ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్లు చేస్తూ బ్యాంకు ఖాతాలోని డబ్బులు కొల్లగొడుతున్నారు. మండలానికి చెందిన మాజీ సర్పంచి కుమారుని ఫోన్ హ్యాక్ చేసి రూ. 63వేలు డ్రా చేశారు. సీఏస్సీ సర్వీస్ జాయినింగ్ గ్రూప్ పేరుతో ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. పలువురి ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు స్వాహా చేశారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 3.38 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 71.71 శాతం నమోదు కాగా ఈసారి 75.09 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS) 3,16,427 భారీ మెజార్టీతో గాలి అనిల్ కుమార్(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో నీలం మధు(INC),వెంకట్రామిరెడ్డి(BRS), రఘునందన్ రావు(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
మోసం చేయడంలో బీజేపీ నేతలకు మొదటి ర్యాంకు ఇవ్వవచ్చని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి 20, బీజేపీ నుంచి ముగ్గురు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకుడు పాల్గొన్నారు.
మెదక్ లోక్సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. దుబ్బాక-82.42%, గజ్వేల్-80.31%, మెదక్-80.19%, నర్సాపూర్-84.25%, పటాన్చెరు-63.01%, సంగారెడ్డి-71.99%, సిద్దిపేట-73.64%గా నమోదైంది. కాగా ఇక్కడ మొత్తం 75.09% నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రాంరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది ఉండగా 75.09 శాతం ఓటింగ్ నమోదైంది. జహీరాబాద్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 74.63 శాతం ఓటింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఓటరు ఎవరివైపు నిలిచారని జూన్ 4 వరకు వేచి చూడాల్సి ఉండగా ప్రస్తుతం అభ్యర్ధుల్లో టెన్షన్ నెలకొంది.
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆందోలు- జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం మంత్రిని కలిశారు. ఎన్నికల సరళిని వారిని అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీ వస్తుందని మంత్రికి కౌన్సిలర్లు వివరించారు.
కాంగ్రెస్లోకి వచ్చేందుకు BRS నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, BJP నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, త్వరలో వారు చేరనున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్కు ఆగస్టులో సంక్షోభం తప్పదని BJP ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి ఈరోజు కౌంటర్ ఇచ్చారు. HYD గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. BJPపై మండిపడ్డారు.
నెల రోజులుగా కొనసాగిన పార్లమెంట్ ఎన్నికల ప్రహసనం సోమవారం పోలింగ్ ప్రక్రియతో ముగిసింది. ఇక పోలింగ్ అయిపోయిన వెంటనే అభ్యర్థులు తమ కార్యకర్తలతో సమావేశమై కూడికలు తీసివేతలతో విజయావకాశాలకు బేరీజు వేసుకుంటున్నారు. EVMలలో నిక్షిప్తమై ఉన్న వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అంచనాలకు వస్తున్నారు. మెదక్లో 74.38%, జహీరీబాద్లో 74.54% ఓటింగ్ జరగ్గా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
జహీరాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు క్రాస్ వోటింగ్ భయం పట్టుకుంది. ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి కామారెడ్డి అసెంబ్లీ సీటు దక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించినవి అనుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జరిగిన క్రాస్ ఓటింగ్ జహీరాబాద్లో ఎవరికి కలిసొచ్చేనో చూడాలి.
సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి (సీబీఎస్ఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి మొదటి బ్యాచ్కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్ష రాసి శత శాతం(100%) ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అభినందించారు.
Sorry, no posts matched your criteria.