Medak

News March 21, 2024

పాపన్నపేట: ఆయకట్టు ఎత్తు పెంపు ఉత్తిదేనా..!

image

ఘణపురం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. పాలకుల నిరాదరణతో పూర్వ వైభవం కోల్పోయింది. నిజాం కాలంలో కళకళలాడిన ప్రాజెక్టు నేడు పూడికతో నిండిపోయింది. ప్రాజెక్టు నిండినా వారం రోజులు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం 2016లో రూ. 43.64 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నాలుగేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

News March 21, 2024

పాపన్నపేట: ఆయకట్టు ఎత్తు పెంపు ఉత్తిదేనా..!

image

ఘణపురం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. పాలకుల నిరాదరణతో పూర్వ వైభవం కోల్పోయింది. నిజాం కాలంలో కళకళలాడిన ప్రాజెక్టు నేడు పూడికతో నిండిపోయింది. ప్రాజెక్టు నిండినా వారం రోజులు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం 2016లో రూ. 43.64 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నాలుగేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

News March 21, 2024

పటాన్‌చెరులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

సిద్దిపేట: చాకలి ఐలమ్మకు ‘రజాకార్’ యూనిట్ నివాళి

image

రజాకార్ సినిమా యూనిట్ బుధవారం రాత్రి సిద్దిపేటలో సందడి చేసింది. జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజాకర్ సినిమాలో చాకలి ఐలమ్మగా కనిపించిన హీరోయిన్ ఇంద్రజ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ వీరనారి అని కీర్తించారు. కార్యక్రమంలో నటీనటులు మకరంద దేశ్పాండే, రాజు, అర్జున్, తేజ్, వేదిక పాల్గొన్నారు.

News March 21, 2024

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై 14 మంది దుర్మరణం

image

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో 14 మంది దుర్మరణం చెందారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా పనులు చేస్తున్నా, పనులు నెమ్మదిగా సాగడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

News March 21, 2024

సిద్దిపేట: మద్యం మత్తు జీవితాలు చిత్తు

image

మద్యం మత్తు వాహన చోదకుల జీవితాలను చిత్తు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ డివిజన్ వ్యాప్తంగా గత ఏడాది 9,645 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా పలువురికి జైలు శిక్షలతో పాటు రూ.93.73 లక్షల జరిమానా విధించారు. 34 మంది జైలు శిక్ష విధించారు.

News March 21, 2024

హుస్నాబాద్‌: యువకుడి సూసైడ్

image

హుస్నాబాద్‌కి చెందిన రుద్రయ్య(20) కరీంనగర్ జిల్లా‌లో పనికి వెళ్లాడు. ఈక్రమంలో ఓ యువతిని గత నెల 2న పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రుద్రయ్య ఇంటికి వెళ్లి మేజర్ అయ్యే వరకు దూరంగా ఉండాలంటూ యువతిని తీసుకువెళ్లారు. అనంతరం ఫొటోలను డిలీట్ చేయాలంటూ బెదిరించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 21, 2024

సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలించిన తర్వాత వెంటనే ఆర్డీవో, కలెక్టరేట్ పంపించాలని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.

News March 20, 2024

ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని మంత్రికి వినతి

image

విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య భీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వినతి చేశారు. సంగారెడ్డిలో మంత్రిని కలిసి అత్యధిక విశ్రాంత ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు హెల్త్ ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం కల్పించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News March 20, 2024

టేక్మాల్: చెరువులో దూకి వృద్ధ మహిళ ఆత్మహత్య

image

టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నీరుడి కిష్టమ్మ(70) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన కిష్టమ్మ కుడి చెంపపై కంతి ఏర్పడి దుర్వాసన వస్తుంది. దాని కారణంగా ఆమె వద్దకు ఎవరు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈరోజు మధ్యాహ్నం టేక్మాల్ పంతులు చెరువులో దూకి కిష్టమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

error: Content is protected !!