Medak

News June 9, 2024

మెదక్‌లో బీఆర్‌ఎస్‌కు ఏమైంది..?

image

మెదక్‌లో 2004 నుంచి 2019 వరకు వరస విజయాలతో దూసుకెళ్లిన BRS ఈఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRS 5,96,048 ఓట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో 3,96,790 ఓట్లతో సరిపెట్టుకుంది. 2019లో BJPకి 2,01,567 ఓట్లు రాగా, 2024లో 4,71,217 ఓట్లు సాధించి BRS కంచుకోటపై కాషాయ జెండా ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో BRS మూడో స్థానానికి పరిమితం కావడం పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.

News June 9, 2024

MDK: 10 కేంద్రాలు.. 3,912 మంది అభ్యర్థులు

image

నేడు జరగనున్న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులను 8:30 గం. నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 10 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

News June 8, 2024

కర్ణాటక రాష్ట్రంలో జిల్లా వాసి మృతి

image

కర్ణాటక రాష్ట్రంలోని పెద్ద వడగవ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంగ్టి మండల వాసి మృతి చెందాడు. మండల పరిధిలోని తడ్కల్ గ్రామానికి చెందిన కటికే తోసిఫ్ (20) శనివారం బీదర్ నుంచి బైక్ పై తడ్కల్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. దీంతో తోసిఫ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సన్పూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News June 8, 2024

UPDATE: చెరువులో గల్లంతయిన వ్యక్తి లభ్యం

image

తూప్రాన్ పట్టణంలోని కొత్తచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైన సంగారెడ్డి చెందిన నర్సింలు (50) మృతదేహం అభ్యమైంది. నిన్న ఉదయం తూప్రాన్‌కు చెందిన టేకు పోచయ్య, జెడిగాడి దేవేందర్‌లతో కలిసి నరసింహులు కొత్తచెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళాడు. అందులో పడిన గాలం తీసేందుకు చెరువులోకి దిగి గల్లంతయ్యాడు. ఈరోజు నర్సింలు మృతదేహం లభించింది.

News June 8, 2024

అందోల్: గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి

image

అందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ నర్సింహులు శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. 18ఏళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో తనదైన శైలిలో గ్రామంలోని ప్రజలకు ఎన్నో సేవలను అందించారు. ఈయన మృతి పట్ల మండల డీలర్ల సంఘం తీవ్ర సంతాపం తెలిపింది. ఎల్లప్పుడూ ప్రజానీకంలో ఉంటూ ప్రజల మన్ననలు పొందారని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రోల్ల జోగినాథ్ అన్నారు.

News June 8, 2024

రామోజీ రావు జీవితం అందరికీ ఆదర్శం: హరీశ్ రావు

image

రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన వ్యక్తి రామోజీ అన్నారు.

News June 8, 2024

పటాన్‌చెరు: మహిళ మృతి.. ప్రమాదవశాత్తా.. ఆత్మహత్యా..?

image

అమీన్‌‌పూర్ లేక్‌లో పడి <<13398783>>మహిళ మృతి<<>>చెందింది. స్థానిక సాయిరాం హిల్స్‌లో ఉంటున్న జయశ్రీ(25), రవిజేత దంపతులు.. జనవరిలో డైవర్స్‌కు అప్లై చేశారు. అప్పటి నుంచి ఏపీలోని పిఠాపురంలోని పుట్టింట్లో జయ.. గత నెల 26 రవి తండ్రి మృతిచెందడంతో తిరిగి వచ్చింది. శుక్రవారం భర్త, కూతురి(4)తో కలిసి వెళ్లగా చెరువులో పడిపోయి చనిపోయింది. అయితే జయ ప్రమాదవశాత్తు పడిందా లేక దూకి ఆత్మహతకు పాల్పడిందా..? అని తెలియాల్సి ఉంది.

News June 8, 2024

సిద్దిపేట: సన్నాల సాగు అంతంతే..!

image

ఉమ్మడి జిల్లాలో వరి సాగుపై రైతులు అయోమయంలో పడిపోయారు. గతంలో 80% దొడ్డు వడ్లు, 20% సన్న రకాలు సాగుచేసే వారుగా ప్రస్తుతం బోనస్ ప్రకటనతో అయోమయంలో పడ్డారు. సిద్దిపేట జిల్లాలో గత వానకాలంలో 3,32, 006 ఎకరాలు, యాసంగిలో 3,48,009 ఎకరాల్లో సాగైంది. మెదక్‌ జిల్లాలో గత వానకాలంలో 3,00,967, యాసంగిలో 1,85,295 ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో గత వానకాలంలో 1,04,000 ఎకరాలు, యాసంగిలో 1,03,000 ఎకరాల్లో వరి సాగు చేశారు.

News June 8, 2024

మెదక్: సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం ( ఈ నెల 10) నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నేరుగా వచ్చి తమ తమసమస్యలను వినిపించవచ్చున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.

News June 7, 2024

మెదక్: పిడుగుపడి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి అస్వస్థత

image

పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా రాజ్ పల్లిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మార్గం సిద్దిరాములు(55) కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులు చేయడానికి వెళ్లారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షంతోపాటు పిడుగు పడింది. సిద్దిరాములు మృతిచెందగా భార్య రాధమ్మ, మరో మహిళా మౌనిక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.