Medak

News May 13, 2024

మెదక్: US నుంచి వచ్చి ఓటేసిన యువ గ్రాడ్యుయేట్లు

image

లోక్ సభ ఎన్నికల్లో ఓటేయడానికి యూఎస్ నుంచి రావడం విశేషం. మెదక్ పట్టణానికి చెందిన మెంగని యామిని ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడానికి ఆమె తిరిగి వచ్చారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన అనన్య ఎరుగు మొదటిసారిగా ఓటు వేయడం ఎంతో అనుభూతినిచ్చిందని చెప్పారు. ఇది మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రజాస్వామ్యం కల్పించిన బాధ్యతగా పేర్కొన్నారు.

News May 13, 2024

మెదక్: 1PM వరకు పోలింగ్ ఇలా..

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మ.1గంటల వరకు మెదక్ పరిధిలో 46.72, జహీరాబాద్‌లో 50.71 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా.. ⏵మెదక్-53.17, నర్సాపూర్-53.75, సంగారెడ్డి-44.25, పటాన్‌చెరు-38.61, సిద్దిపేట-44.36, దుబ్బాక-50.38, గజ్వేల్- 49.57 ⏵జహీరాబాద్-47.42, ఆందోల్-30.48, నారాయణ్‌ఖేడ్-51.57, జుక్కల్-53.62, బాన్సువాడ-53.59, ఎల్లారెడ్డి-54.20, కామారెడ్డి-47.46 శాతం నమోదైంది.

News May 13, 2024

MDK:ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు ⏵శాంతి భద్రతల ఆటంకం ⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం ⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ ⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం ⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు ⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

మెదక్‌లో 10.99.. జహీరాబాద్‌లో 12.88 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 9గంటల వరకు మెదక్ పరిధిలో 10.99, జహీరాబాద్‌లో 12.88 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..
⏵ మెదక్-12, నర్సాపూర్-12.24, సంగారెడ్డి-10.14, పటాన్‌చెరు-9.15, సిద్దిపేట-11.10, దుబ్బాక-13.06, గజ్వేల్- 11.12,
⏵జహీరాబాద్-11.84, ఆందోల్-11.48, నారాయణ్‌ఖేడ్-12.71, జుక్కల్-12.58, బాన్సువాడ-15.71, ఎల్లారెడ్డి-14.17, కామారెడ్డి-12.49 శాతం నమోదైంది.

News May 13, 2024

సజావుగా పోలింగ్.. పర్యవేక్షిస్తున్న రాహుల్ రాజ్ రాహు

image

మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగానికి ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఐడీఓసీ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

News May 13, 2024

మెదక్: 4.54 లక్షల యువ ఓటర్లు

image

మెదక్ లోక్ సభ పరిధిలో మొత్తం 18.28 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 29 ఏళ్ల వరకు 4.54 లక్షల మంది ఉన్నారు. వీరి ఓటు కీలకం కానుంది. 18-19 ఏళ్ల లోపు వారు 55,947 మంది ఉన్నారు. వీరిలో పలువురు తొలిసారి ఓటు వేయనున్నారు. ఓటర్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. 9.25 లక్షల మంది అతివలు గెలుపును ప్రభావితం చేయనున్నారు.

News May 13, 2024

GREAT.. ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు..!

image

సిద్దిపేట జిల్లా యువకుడు ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు. రాయపోలు మండలం వడ్డేపల్లికి చెందిన బచ్చు శ్రావణ్‌ కుమార్‌ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. తాజా ఎంపీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సంకల్పంతో శనివారం స్వగ్రామానికి వచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చానని, అన్ని విధాల ఆలోచించి మంచి వారికి ఓటేస్తా’ అని శ్రావణ్ అంటున్నారు.

News May 13, 2024

ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలి: కలెక్టర్ రాహుల్

image

పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలని సిబ్బందికి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం సిబ్బందితో మాట్లాడుతూ..  పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం, ఓటర్ల హాజరు సమాచారం త్వరిత గతిన ఉన్నతస్థాయి అధికారులకు అందించాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటర్ల హాజరు, పోలింగ్ శాతం అందించి పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

News May 13, 2024

సిద్దిపేట: ప్రజా సేవకులను ఎన్నుకోండి

image

భారత రాజ్యాంగం మనకు కల్పించిన అమూల్యమైన, అతి ముఖ్యమైన హక్కు “ఓటు”. కుల, మత విభేదాలు లేకుండా ధనిక పేద తేడాలేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కును కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని నిజమైన ప్రజా సేవకులను నాయకులుగా ఎన్నుకోవాలి.

News May 13, 2024

MDK: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

image

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ నేడు ఓటేసేందుకు రావాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్ల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని, యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.