India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మెదక్ స్థానంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
అన్నిరంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు చట్టసభల్లో అతంతగానే రాణిస్తున్నారు. మెదక్ లోక్సభ ఏర్పడి 72ఏళ్లు అవుతున్నా ఇక్కడి నుంచి కేవలం ముగ్గురు మహిళలే MPలుగా ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో సంగం లక్ష్మీబాయి(కాంగ్రెస్), 1980లో ఇందిరాగాంధీ, 2009లో విజయశాంతి(BRS) గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జహీరాబాద్ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ లేరు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఒక్కరే.
మెదక్ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మొత్తం 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 343 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా తేల్చారు. గజ్వేల్ పరిధిలో అత్యధికంగా 69 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అతి తక్కువ సిద్దిపేటలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అటు ఓటర్లను ఆకట్టుకునేందుకు మొత్తం 30 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇందిరాగాంధీ గతంలో గెలిచిన మెదక్లో ఆమె మనవడు రాహుల్గాంధీ నిర్వహించిన జనజాతరకు అపూర్వ స్పందన వచ్చింది. నర్సాపూర్ వేదికగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇందిరా విజయాన్ని పునరావృతం చేసే దిశగా ప్రచారం నిర్వహించారు. BJP, BRS పాలనలో అభివృద్ధి దూరమైందని రేవంత్ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీలో సైనికుడిలా పనిచేస్తానని రాహుల్ చెప్పారు. దీంతో కాంగ్రెస్లో జోష్ పెరిగింది.
దేశానికి ప్రధాని మోదీయే శ్రీరామరక్ష అని, దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో తాను చెల్లని రూపాయిని అయితే కామారెడ్డిలో చెల్లని మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. దుబ్బాక అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. మీరు చేసే ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పురిటి గడ్డ సిద్దిపేటకు రానున్నారు. మెదక్ MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ రోడ్షో, సభ నిర్వహించేలా హరీశ్రావు ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు సిద్ధయయ్యారు. కాగా ఈ సభతో కేసీఆర్ ప్రచారం ముగియనుంది.
‘నీలం మధు మీద పోటీకి KNR జిల్లా నుంచి వెంకట్రాంరెడ్డిని తీసుకొచ్చారు, మెదక్ జిల్లాలో BRS నుంచి పోటీ చేసే మొగోడు దొరకలేదా’ అని CM రేవంత్ రెడ్డి, KCRను ప్రశ్నించారు. నేడు నర్సాపూర్లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ కోసం రైతుల భూములు గుంజుకున్నోడు వెంకట్రాంరెడ్డి అని ఆరోపించారు. దుబ్బాక ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన రఘునందన్ను ఎన్నికల్లో ఓడగొట్టి మధును గెలిపించాలని అన్నారు.
జహీరాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడి అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్లారిటీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నమ్ముకున్న కార్యకర్తలే ఎటు ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సవాల్గా మారిందని టాక్.
సైబర్ నేరగాళ్ల బారినపడి ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు పోగొట్టుకున్న ఘటన పటాన్చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్చెరుకు చెందిన ప్రభుత్వ టీచర్ ఈశ్వర్ ఫోన్కు ఆన్లైన్ ఉద్యోగం పేరిట ఓ మెసేజ్ వచ్చింది. పెట్టుబడి పెట్టి టాస్కులు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పడంతో దఫదఫాలుగా రూ.3.99,582 పంపి టాస్కులు చేశాడు. తర్వాత మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొద్ది రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లైట్ బీర్లు అందుబాటులో లేవని నంగనూరులోని వైన్ షాపుల నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి బీర్ల కొరతను అరికట్టాలని రెగ్యులర్ కస్టమర్లు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.