India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్ను కాంగ్రెస్, మెదక్ను బీజేపీ కైవసం చేసుకున్నాయి. జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 47,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో గెలిచిన షెట్కార్ తాజాగా మరోసారి విజయకేతనం ఎగురవేశారు.BRS ఎంపీగా ఉన్న బీబీపాటిల్ BJPలో చేరి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి అనిల్కుమార్ బరిలో నిలిచి ఓటమిచెందారు. దీంతో BRS సిట్టింగ్ స్థానాన్ని కొల్పోయింది.

మెదక్ పార్లమెంటు ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినా నైతిక విజయం కాంగ్రెస్ దేనని ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా ఒక్కటై బీసీ బిడ్డను ఓడించడానికి కుట్ర చేశాయని ఆరోపించారు. రెండు పార్టీలు అంతర్గతంగా ఒప్పందంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. కాంగ్రెస్ బీసీ బిడ్డకు అవకాశం కల్పిస్తే ఓర్వలేక కుట్రలు పన్నాయని అన్నారు.

పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామ పరిధిలోని చందా నాయక్ తండాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకు గురై ఓ యువకుడితోపాటు జీవాలు చనిపోయాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన జైపాల్(25) గ్రామ శివారులో ఇవాళ మేకలు కాస్తుండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపాటుతో జైపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మూడు మేకలు మృత్యువాత పడ్డాయి.

ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మెదక్లో బీజేపీ, జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మెదక్లో బీజేపీ 16,576 ఓట్ల ఆధిక్యంలో, జహీరాబాద్లో 21వ రౌండ్లో కాంగ్రెస్ 18,239 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నాయి.

గజ్వేల్ అసెంబ్లీ సిగ్మెంట్లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మొదటి రౌండ్లో బీజేపీకి 3728 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 2749 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 2543 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 979 ఓట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయింది.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ నేడు వీడనుంది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల నేతలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్లోని రెండు కళాశాలల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 103 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 147 రౌండ్లలో ఫలితం తేలనుంది. కాగా మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి మేరకే తెలంగాణ ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నానని అన్నారు. 12వ ఆవిర్భావ దినోత్సవంలోపు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అందజేస్తామని అన్నారు.

ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో వెలువడే ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఏ నలుగురు వ్యక్తులు కలిసిన ఎన్నికల ఫలితాలపై చర్చలు జరుపుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ భిన్న అభిప్రాయం తెలపడంతో ఓటర్ల తీర్పు ఎవరికి అర్థం కావట్లేదు. ప్రధాన పార్టీలైన BRS, కాంగ్రెస్, BJP నేతలు మాత్రం అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మనోహరాబాద్ మండలం రంగాయపల్లి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తూ వడ్లకుప్పను ఢీకొని మనోహరాబాద్కు చెందిన పత్తిరి యాదగిరి మృతి చెందాడు. గత నెల 27న రాత్రి యాదగిరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డుపై అడ్డుగా ఉన్న వడ్ల కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనోహరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రిక ప్రకటనలలో ఎక్కడా కూడా జై తెలంగాణ పదం లేదని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు.
Sorry, no posts matched your criteria.