Medak

News May 8, 2024

సంగారెడ్డి: ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం

image

ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన BDL పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్‌కు చెందిన వివాహిత, భర్త, మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి పటాన్ చెరు మండలం పాటి గ్రామంలో ఉంటున్నారు. ఈనెల 2న ఆసుపత్రికి అని ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

News May 8, 2024

దుబ్బాకలో చెల్లని నోటు.. మెదక్‌ పార్లమెంట్‌లో చెల్లుతదా: కేసీఆర్‌

image

వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మెదక్‌లో KCR రోడ్‌షో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది. మెదక్‌ జిల్లా, ప్రభుత్వ వైద్యకళాశాల, రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటును గుర్తుచేసిన KCR.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వకపోగా BRS మంజూరు చేసిన వాటిని రద్దు చేస్తోందని విమర్శించారు. ‘BJP అభ్యర్థి రఘునందన్ మాట్లాడేవన్ని అబద్ధాలే. దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో చెల్లుతదా’ అని ప్రశ్నించారు.

News May 8, 2024

ఆందోల్: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల సమాచారం.. గ్రామానికి చెందిన బోయిని పాపయ్య(50) గ్రామ శివారులో పశువులను మేపుతున్నారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో పాపయయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

News May 8, 2024

మెదక్ : రైతులు జాగ్రత్తలు వహించాలి: అదనపు కలెక్టర్

image

రానున్న 3 రోజుల అకాల వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులు తడవకుండా భద్రపరచాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో కప్పి ఉంచాలన్నారు. అనంతరం పీపీసీ కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లకు, రైతులకు ధాన్యం తడవకుండా చేపట్టాల్సిన చర్యలపై పలుసూచనలు చేశారు.

News May 7, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాలో 1,557 కేసులు

image

పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అప్పటినుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,557 కేసులు నమోదు చేసి, 683 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. రూ. 8.89 కోట్ల విలువైన అక్రమ మద్యం, కల్లు, నాటుసారా, గంజాయి తదితర పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈమధ్య పటాన్ చెరులో రూ. 9.23 కోట్ల విలువచేసే ఎంఎంసీ మత్తు పదార్థం సీజ్ చేశామన్నారు

News May 7, 2024

కుకునూర్‌పల్లిలో పిడుగుపాటుకు యువకుడు మృతి

image

పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన కుకునూర్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుకునూర్‌పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. కుకునూర్‌పల్లికి చెందిన కుమ్మరి మల్లేశం(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనుల నిమిత్తం వ్యవసాయం బావి దగ్గరకి వెళ్లాడు. అప్పుడే ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగుపడింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు.

News May 7, 2024

శివంపేట: వడదెబ్బతో ఉపాధికూలీ మృతి

image

శివంపేట మండలం కొంతాన్‌ పల్లి గ్రామానికి చెందిన కలకుంట లక్ష్మీ (45) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం ఉపాధిహామీ పథకం కింద నిర్వహిస్తున్న పనుల వద్దకు పనులు చేసేందుకు వెళ్లింది. కూలీలతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయింది. గ్రామంలోని వైద్యుడికి చూపించగా మృతిచెందినట్లు తెలిపారు.

News May 7, 2024

మెదక్: ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ సాహెల్ (24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. సాహెల్ మూడు సంవత్సరాల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించకపోగా.. వేరే సంబంధం చూసి పెళ్లికి నిశ్చయించారు. దాంతో మనస్తాపానికి గురైన సాహెల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 7, 2024

సీఎం రేవంత్ రెడ్డి నర్సాపూర్ పర్యటన రద్దు

image

నర్సాపూర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు నిర్వహించాల్సిన పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం 5 గం.కు జనజాతర సభ నిర్వహించేందుకు సీఎం రావాల్సి ఉండగా.. రద్దు చేశారు. ఈనెల 9న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభను రద్దు చేశారు. నేడు సీఎం సభ, 9న రాహుల్ గాంధీ సభ‌లను రెండు రోజుల నిర్వహించడం ఇబ్బందిగా ఉండడంతో.. రద్దు చేసినట్లు సమాచారం.

News May 7, 2024

నేడు మెదక్‌కు మాజీ సీఎం కేసీఆర్ రాక

image

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం రాత్రి మెదక్ పట్టణానికి చేరుకోనుంది. కామారెడ్డి జిల్లా నుంచి రాత్రి 8 గంటలకు బస్సుయాత్ర మెదక్ పట్టణంలోకి ప్రవేశిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో బస్సుయాత్ర కొనసాగనుంది.