India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ పార్లమెంట్ స్థానం బీజేపీదే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ BJP నుంచి రఘునందన్రావు, BRS నుంచి వెంకట్రామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీలో ఉన్నారు. కాగా తొలుత బీజేపీ, కాంగ్రెస్కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీదే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన రెండు ఎంపీ స్థానాలలో గెలుపు ఎవరిది అనే అంశంపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉండడంతో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడవ విడత సార్వత్రిక ఎన్నికల అంకం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి.

మార్చి 2024లో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అనుత్తీర్ణులైన విద్యార్ధుల కోసం జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరిక్షలు నిర్వహిస్తున్నట్లు డిఇఓ రాధాకిషన్ తెలిపారు. మెదక్ జిల్లాలో 783 మంది విద్యార్థులుండగా, మెదక్ పట్టణ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఉ. 9.30 గం. నుంచి మ.12.30 గం వరకు నిర్వహించనున్నారు.

మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 18వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న కాలువ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో కాళేశ్వరం కాలువ పనులు ప్రారంభమై నర్సాపూర్ మండలం నాగులపల్లి వరకు కొనసాగున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పనులు నిలిచిపోవడంతో నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు. కాలువ పూర్తైతే తమ పొలాలకు నీళ్లు వస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.

శివంపేట మండలానికి చెందిన యువకుడు సౌత్ ఆఫ్రికాలో మృతి చెందారు. మండల పరిధిలోని కొంతాన్పల్లికి చెందిన నర్సాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్ చిన్న కుమారుడు కీర్తి తేజ(24) సౌత్ ఆఫ్రికాలోని రువాండాలో గుండెపోటుతో నిన్న మృతి చెందాడు. కీర్తి తేజ మరణ వార్త తెలుసుకున్న కుటుంబికులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు నేడు బోయినపల్లిలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

మెదక్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుల్ ఏర్పాటు చేశామని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 4న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందన్నారు. ఇదంతా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్పై పడింది. గత MP ఎన్నికల్లో మెతకుసీమ ఓటర్లు మెదక్లో కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS), జహీరాబాద్లో బీబీ పాటిల్(BRS)ను గెలిపించుకొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

రేపు HYD పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సోనియా గాంధీ, ఉద్యమకారులు, అమరుల కుటుంబీకులను భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమంలో KCR కీలకం కావడంతో CM రేవంత్ ఆయనకూ ఆహ్వానం పంపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మన్ హర్కర వేణుగోపాల్ ఇన్విటేషన్ అందించారు. మరి CM పిలుపుతో KCR వస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్గా మారింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్దిపేట జిల్లా ముస్తాబవుతోంది. జూన్ 2 అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యేక లైటింగ్తో ధగధలాడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం(కలెక్టరేట్) విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా మారింది. జాతీయ జెండా రంగులతో శుక్రవారం రాత్రి న్యూ లుక్తో చూపరనులను ఆకట్టుకుంంటుంది.

జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 16 కేంద్రాల్లో 9,672 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. 6 ఎస్కార్ట్ రూట్లుగా విభజించి ఆర్మూడ్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.