Medak

News April 25, 2024

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో హత్యల కలవరం..

image

మెదక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురి హత్యలు జిల్లాల్లో కలకలం రేపుతున్నాయి. కోహిర్ వద్ద ఆటో అద్దె డబ్బులు విషయంలో గొడవ జరిగి జగద్గిరిగుట్టకు చెందిన షేక్ అన్వర్ అలీ(30)ని మిత్రులు దాడి చేసి హతమార్చారు. నర్సాపూర్ ఎర్రగుంట తండాకు చెందిన సక్కుబాయి(48) ప్రవర్తన నచ్చక కొడుకు హంజా హత్య చేశాడు. శెట్‌పల్లి కలాన్‌లో భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు దశరథ అత్త కౌసమ్మ(50)ను హత్య చేశాడు.

News April 25, 2024

కొండాపూర్ గురుకులంలో 100% ఉత్తీర్ణత

image

ఇంటర్ ఫలితాల్లో కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ కళాశాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సుదర్శనం తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 82 మందికి 82, ద్వితీయ సంవత్సరంలో 59కి 59 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

News April 25, 2024

MDK: వెంకట్రామిరెడ్డి ఆస్తులు, అప్పులు ఇవే.. !

image

BRS పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తన పేరిట రూ. 62,84,43,006 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో 3 కిలోల పైగా బంగారం, రెండు కిలోల పైగా వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇందుర్తిలో రూ. 7.88 లక్షల విలువైన 1.30 ఎకరాల భూమి, ప్లాట్లు ఉన్నాయి. ప్రణీత రెడ్డి పేరిట రూ. 4.48 కోట్ల విలువైన రాజ్‌పుష్ప ఫామ్స్, 3.33 కిలోల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.

News April 25, 2024

మాసాయిపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

మెదక్ జిల్లా మాసాయిపేటలోని చెట్ల తిమ్మాయపల్లి చౌరస్తా వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ రాజ బొల్లారానికి చెందిన బిక్ని(36) మృతి చెందింది. మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై చెట్ల తిమ్మాయపల్లి చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న బిక్నిని హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

News April 25, 2024

పుస్తకావిష్కరణ చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

image

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తన ఉద్యోగానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్య విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో డా. దువ్వూరి సుబ్బారావు జస్ట్‌ ఏ మెర్సెనరీ.? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌ పేరుతో ప్రచురించిన ఆంగ్ల పుస్తకావిష్కరణ నిర్వహించారు.

News April 25, 2024

సిద్దిపేట: డిప్లొమాలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

టెక్స్ టైల్స్ డిప్లమా కోర్సుల్లో శిక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు సతీష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించగా అందులో ఒక్క స్థానం ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి వారికి రిజర్వ్ చేశారన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్ లోని జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News April 25, 2024

మెదక్: ‘మచ్చ లేకుండా కలెక్టర్‌గా పనిచేశా.. గెలిస్తే అభివృద్ధి చేస్తా’

image

మచ్చ లేకుండా ఉత్తమ కలెక్టర్‌గా పనిచేశానని BRS MP అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 2 సెట్ల నామినేషన్ వేశానని, రేపు మాజీ మంత్రి హరీష్ రావు, BRS అభిమానుల మధ్య రేపు మరో 2 సెట్లు దాఖలు చేస్తానని తెలిపారు. మంచి కలెక్టర్‌గా పని చేసిన నేను మరింత సేవ చేయడానికి ఎంపీగా పోటీ చేస్తున్నానని తనను ప్రజలు ఆశీర్వదించాలన్నారు.

News April 25, 2024

కంగ్టి: ఇంటర్ ఫలితాల్లో మండల టాపర్లు వీరే

image

ఇంటర్ ఫలితాల్లో కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నలుగురు బాలికలు టాపర్‌గా నిలిచారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో సెకండియర్‌కు చెందిన జ్యోతి (BPC)-919/1000, దీపిక (BPC)-876/1000 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా ఫస్టీయర్‌లో ప్రియదర్శిని (BPC) 366/440, సువర్ణ (BPC) 301/440 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరిని ప్రిన్సిపల్ అభినందించారు.

News April 25, 2024

నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

image

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పక్రియలో భాగంగా బుధవారం 12 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు పి.వెంకట్రామ్ రెడ్డి, ఎ.లక్ష్మణ్, ఊరెళ్ళి ఎల్లయ్య, కమ్మరి లక్ష్మీనారాయణ, చిక్కులపల్లి నవీన్, ఉట్ల రమేష్ , నీలం మధు, జి.ప్రదీప్ కుమార్, ఎటి ఆంజనేయులు, ధర్మారం నరహరి, అనిల్ మొగిలి, దాసరి భాను చందర్‌‌లు నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.

News April 25, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక కౌన్సిలర్ నామినేషన్

image

మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఏఐఎఫ్‌బీ పార్టీ తరుపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గెలిచిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ మెదక్ ఎంపీగా నామినేషన్ వేయడం పట్ల పార్టీలో చర్చనీయాంశమైంది.