India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ మెదక్ కలెక్టరేట్లో బుధవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బట్టి జగపతి, నగేష్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన గౌడిచర్ల ప్రియాన్ష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్ష ఫలితాల్లో ప్రియాన్ష్ ఎంపీసీలో 470కి గానూ 468 మార్కులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల నుంచి అభినందనలు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియేట్ పరీక్షలు ఈనెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయగా, జిల్లావ్యాప్తంగా 6685 మంది హాజరుకానున్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాల్లో, ఇంటర్మీడియేట్ 15 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పదవ తరగతి 2388, ఇంటర్ 4297 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
మెదక్ బీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బుధవారం మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకుడు నగేష్ తో కలసి మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజాపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరపున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. బుధవారం నుంచి మిగతా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఓవైపు అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారం చేస్తూ, మరోవైపు నియోజకవర్గం, మండలాలు, పట్టణాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 65.57 శాతంతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. 15,273 మందికి గానూ 10014 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 61.08 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. 7361 మందికి 4496 మంది పాసయ్యారు.
మెదక్ జిల్లా 57.49 శాతంతో 33వ స్థానంలో నిలిచింది. 5295 మందికి 3044 మంది ఉత్తీర్ణ సాధించారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 55.29 శాతం ఉత్తీర్ణతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. 15,989 మందికి గానూ 8840 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 48.77 శాతంతో 29వ స్థానంలో నిలిచింది. 7541 మందికి 3678 మంది పాసయ్యారు. మెదక్ జిల్లా 47.18 శాతంతో 30వ స్థానంలో నిలిచింది. 5905 మందికి 2786 మంది ఉత్తీర్ణత సాధించారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మడుపు భూంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీపై అలకగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన భూంరెడ్డి గతంలో హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్గా పనిచేశారు. నేడో, రేపో చేరే అవకాశం ఉందని టాక్.
ఝరాసంగం మండలం కమాల్పల్లికి చెందిన శ్రీశైలం వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టి సాగుపై మక్కువతో చదివిన శ్రీశైలం.. ISRB నిర్వహించిన జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక పరీక్షల ఫలితాల్లో సత్తా చాటారు. అరుణాచల్ప్రదేశ్ కేడర్ వ్యవసాయ శాస్త్రవేత్త(ఏఎస్ఆర్బీ)గా ఉద్యోగం సాధించారు. శ్రీశైలం విద్యాభ్యాసం 10వ తరగతి వరకు ఝరాసంగం పాఠశాలలో జరిగింది. -CONGRATS
లోక్సభ ఎన్నికల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 25 వరకు గడువు ఉంది. 29న ఉపసంహరణ ఘట్టం ముగియగానే ప్రచార పర్వం మరింత పుంజుకుంటుంది. ఇప్పటికైతే ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే మిగిలింది. మే 13న పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందుగా అంటే మే 11న ప్రచార కార్యక్రమాలు ముగించాలి. ఈ కాస్త సమయంలో గ్రామగ్రామాన పర్యటించడం, ఎండలు మండిపోతుండడంతో అభ్యర్థులకు సవాల్గా మారింది.
Sorry, no posts matched your criteria.