India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సిద్దిపేట 2వ సెషన్స్ జడ్జీ తీర్పును ఇచ్చారని సీపీ అనురాధ తెలిపారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన టి.శ్రీకాంత్(20) అక్టోబర్ 19, 2021న ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్న బాలిక(15)ను కిడ్నాప్ చేసి మానభంగానికి పాల్పడ్డారు. ఈ విషయమై విచారణ జరిపిన జడ్జీ నిందితుడికి జైలుశిక్ష విధించారు.
రెండు దశాబ్దాలుగా మెదక్ ఎంపీ స్థానం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. గులాబీ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతూ ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్ఎస్ ముందుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన 2004 ఎన్నికల నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని BRS ఉవ్విళ్లూరుతోంది.
ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ రెండు వీల్స్ తెల్లారేసరికి మాయమైన ఘటన నర్సాపూర్లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాలు.. స్థానిక శివాలయం వీధికి చెందిన శ్రీ పాల్ అనే యువకుడు తన బైక్ను రాత్రి ఇంటి ముందు పార్కు చేశాడు. ఉదయం లేచి చూడగా అవెంజర్ బైక్ చక్రాలు చోరీకి గురికావడం చూసి అవాక్కయ్యాడు. ఇటీవల పట్టణంలో బైక్లు చోరీలకు గురవుతున్నాయి. తాజాగా ఈ ఘటనలో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.
జగదేవపూర్లోని రాంరెడ్డి చికెన్ సెంటర్ యజమాని అనుమానాస్పదంగా మృతిచెందాడు. చికెన్ సెంటర్లో పనిచేసే కలకతకు చెందిన యువకులు చికెన్ సెంటర్ యజమాని, తూప్రాన్ మండలం వెంకటాపూర్కు చెందిన బి.మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గజ్వేల్ రూరల్ CI మహేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా చికెన్ సెంటర్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది.
ఓ వైపు నామినేషన్ల ఘట్టం.. మరోవైపు ప్రచార పర్వం ఊపందుకోవడంతో మెదక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రముఖుల రాకతో క్యాడర్లో జోష్ పెరిగింది. ఇప్పటికే BJP, కాంగ్రెస్లు కార్నర్ మీటింగ్లు నిర్వహించగా.. BJP మీటింగ్కు గోవా CMతో పాటు కిషన్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ మీటింగ్కు CM రేవంత్ రాగా, వచ్చేనెల 7న BRS అధినేత KCR బస్సుయాత్రలో భాగంగా మెదక్ రానున్నట్లు శ్రేణులు చెబుతున్నారు.
ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని DMHO శ్రీరామ్ సూచించారు. పరీక్షలో ఫెయిల్ అయితే అభద్రతకు గురికావద్దన్నారు. పట్టుదలతో చదివి సప్లిమెంటరీలో పాస్ కావాలన్నారు. అంతే తప్ప విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైతే కౌన్సెలింగ్ కోసం టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి వైద్యుల సలహాలు పొందవచ్చన్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో మే 7, 8, 10 తేదీల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆదివారం తెలిపారు. 7న రాత్రి 7 గంటలకు మెదక్, 8న సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్, 7 గంటలకు పటాన్చెరు, 10న సాయంత్రం 6 గంటలకు సిద్దిపేటలో కేసీఆర్తో రోడ్ షో ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
కొండపాక మండలం రవీంద్రనగర్లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్, లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ వెళ్తుంది. కొండపాక గేట్ వద్దకు రాగానే కొండపాక గ్రామం లోపలి నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో బస్, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్ డ్రైవర్ లక్ష్మయ్య, ప్రయాణికులకు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బి.బి.పాటిల్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరవుతారని పార్టీ నాయకులు తెలిపారు. సంగారెడ్డిలోని గణేష్ గడ్డ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వాహనాల తనిఖీ నిర్వహించేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. వాహనదారులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బులు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, లిక్కర్ అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు వరకు వాహన తనిఖీల్లో రూ. 66,10,840 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.