Medak

News April 21, 2024

శ్రీరాముడి వారసుడు రాహుల్ గాంధీ: జగ్గారెడ్డి

image

శ్రీరాముడి పాలన కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్లో మాట్లాడుతూ.. ‘శ్రీ రాముడి వారసుడు రాహుల్ గాంధీ. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్’ అని అన్నారు. సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తూ ఎదిగిన వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News April 21, 2024

సంగారెడ్డి: ‘రాజకీయ హత్య కాదు.. కంకర విషయంలో గొడవ’

image

సిర్గాపూర్ మండలం సింగర్ బొగ్డ తండాలో వాడిత్య శ్రీను నాయక్ హత్య రాజకీయ కోణంలో జరగలేదని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి వివరించారు. తండాలో పథకంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మించారు. మిగిలిన కంకరను కాంట్రాక్టర్ జాదవ్ రాజు అమ్మి వేశారు. కొనుగోలుదారు తీసుకెళ్తుండగా శ్రీను నాయక్ అడ్డుకున్నారు. దీంతో 20న తండాలో పంచాయతీ జరగగా జాదవ్ రాజు, అతని సోదరులు శ్రీనుపై దాడి చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

News April 21, 2024

రేపు నామినేషన్ వేయనున్న బీబీ పాటిల్

image

జహీరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున రేపు బీబీ పాటిల్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పాటిల్ కోరారు. ఉదయం 8 గంటలకు రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో పూజలు జరిపి ఉదయం 11 గంటలకు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత పట్టణంలోని PSR గార్డెన్‌లో కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు.

News April 21, 2024

చేగుంట: ఆన్‌లైన్ గేమ్స్‌తో అప్పులు.. రైలు కిందపడి సూసైడ్

image

చేగుంట మండలం వడియారం, మాసాయిపేట్ రైల్వే స్టేషన్‌లో మధ్య కౌడి నరేష్( 33) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు. పోలీసుల వివరాలు.. వడియారం గ్రామానికి చెందిన నరేష్ ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి అప్పులు చేశాడు. అప్పుల ఇబ్బందులు పెరగడంతో వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

News April 21, 2024

చేగుంటలో వివాహిత ఆత్మహత్య

image

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన వంగ మాధవి అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఓ ఉపాధ్యాయుడి మిస్సింగ్ కేసులో ఆమె భర్త సత్యనారాయణను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం మాధవి ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2024

జిల్లాలను రద్దు చేస్తానన్నా కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు: హరీశ్‌రావు

image

కొత్త జిల్లాలను రద్దు చేస్తానన్నా కాంగ్రెస్‌కి ఓటు వేయొద్దని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి గజ్వేల్, సిద్దిపేటలో జరిగిందని చెప్పి, ఇప్పుడు అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మెదక్‌కు ఇందిరాగాంధీ ఏం చేసిందని ప్రశ్నించారు. మెదక్, సిద్దిపేటకు రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్ అని అన్నారు.

News April 21, 2024

సిర్గాపూర్: హత్య కేసులో 9 మంది పై కేసు

image

సిర్గాపూర్ మండలం సింగర్ బోగుడ తండాలో జరిగిన <<13093035>>హత్య ఘటన<<>>లో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్సై మహిపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. సింగర్ బోగుడ తండాలో శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన శ్రీను నాయక్ పై కట్టెలు, రాళ్లతో దాడి చేయగా, పరిస్థితి విషమించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

News April 21, 2024

నిజాంపేట: కొత్త పాస్ బుక్ ఇప్పిస్తానంటూ.. భూమి రిజిస్ట్రేషన్

image

నిజాంపేట‌లో తన భూమికి కొత్త పాస్ పుస్తకం ఇప్పిస్తానంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కుమ్మరి లచ్చవ్వ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. నిజాంపేట మండల కేంద్రంలో లచ్చవ్వకు సర్వే నంబర్ 485లో 1.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వదిన కొడుకు కుమ్మరి పోశెట్టి కొత్త పాస్ పుస్తకం ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ కోరింది.

News April 21, 2024

సంగారెడ్డి: పిడుగుపాటుకు రెండు పశువులు మృతి

image

పిడుగుపాటుకు పశువులు మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. దొమ్మాటకు చెందిన సందీప్ రెడ్డి ఆవు పిడుగు పాటుకు మృతిచెందగా రూ.95 వేల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. గాజులపల్లికి చెందిన దాసరి నర్సింలు ఎద్దు పిడుగు పాటుకు మృతి చెందగా రూ.65 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు నర్సింలు వాపోయారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు.

News April 21, 2024

సీఎం పర్యటనతో మెదక్ పార్లమెంట్ పరిధిలో జోష్

image

సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఇప్పటి వరకు నామమాత్రంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రుల పర్యటనతో పరిస్థితులు పూర్తిగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తేజపరచిన ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్‌తో పాటు పట్టుదల పెరిగింది. మెదక్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీల సమస్యలు, నాయకుల గూర్చి సంభాషించడం శ్రేణుల్లో ఎక్కడాలేని జోష్ కనిపిస్తుంది.