Medak

News April 13, 2024

చింతమడకకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం

image

చింత‌మ‌డ‌క‌లో ఈ నెల 17న శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. సీతారాముల క‌ళ్యాణ మ‌హోత్స‌వ వేడుక‌కు హాజ‌రుకావాల‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత క‌ల్వ‌కుంట్ల వంశీధ‌ర్ రావు మాజీ సీఎం కేసీఆర్ దంప‌తుల‌ను ఆహ్వానించారు. శనివారం ఆహ్వాన ప‌త్రాన్ని కేసీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో చింత‌మ‌డ‌క గ్రామ పెద్ద‌లు రామాగౌడ్, హంస కేతన్‌‌‌‌రెడ్డి, పోశయ్య, సత్యనారాయణ గౌడ్, శేఖర్, ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఉన్నారు.

News April 13, 2024

సంగారెడ్డిలో బీజేపీకి షాక్..

image

ఎన్నికల వేళ బీజేపీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జీ, సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. నేడు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలోకాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు.

News April 13, 2024

దౌల్తాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండు దొందు దొందే: హరీశ్ రావు

image

కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు దొందు దొందేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దౌల్తాబాద్‌లో మెదక్ పార్లమెంట్ సన్నాహాక సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ మాయ మాటలు దుబ్బాక ప్రజలకు తెలుసని చెప్పారు. మెదక్ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ విజయం ఖాయమని తెలిపారు. సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

News April 13, 2024

జహీరాబాద్: పల్లెల్లో ఎన్నికల సందడి.. పార్టీలపై చర్చ..!

image

పల్లెల్లో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. రచ్చబండ వేదికగా గ్రామాల్లోని పెద్దమనుషులు పార్టీల పనితీరు బేరీజు వేస్తూ ఓట్లు ఎవరికి వేయాలో చర్చించుకునే పనిలో పడ్డారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలావరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో మేజర్ పంచాయతీలపై పార్టీల అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని ఓట్లు రాబట్టుకునేందుకు ఇప్పటి నుంచే  మంతనాలు చేస్తున్నారు.

News April 13, 2024

కొల్చారం: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఇసుక మాఫియా దాడి !

image

కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్ గ్రామ కొంగోడు శివారులోని హల్దీ వాగులో గ్రామానికి చెందిన కొంత మంది మాఫియాగా ఏర్పడి రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ తిరుమలేశ్ అధ్వర్యంలో వారిని పట్టుకోవడానికి వెళ్లగా ఇసుక మాఫీయాలో కొంత మంది పోలీసులపై దాడి చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో దాడి చేసి రాజు, నవీన్ మరి కొందరిపై కొల్చారం PSలో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.

News April 13, 2024

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం నమోదు

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉ. 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం.. అత్యధికంగా కంగ్టిలో 68.8 మి.మీ., మనూర్ 41.8, ముక్తాపూర్ 39.3, పెద్ద శంకరంపేట 33.5, నాగల్ గిద్ద 28.8, రేగోడు 26.0, కోహిర్ 11.5, బోడగాట్, మునిపల్లి 11.0, సిర్గాపూర్ 9.8, అల్లాదుర్గం 8.0, మొగుడంపల్లి 7.8, లింగాయపల్లి 7.3, చికోడ్ 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

News April 13, 2024

కొండపాక: దుద్దెడ చెరువు ప్రాంతంలో నెమళ్లు మృతి

image

కొండపాక మండలం దుద్దెడ నల్లచెరువు ప్రాంతంలో ఏడు నెమళ్లు మృతిచెందాయి. ఓ రైతు పశువులకు నీళ్లు పెట్టడానికి వెళ్తే నెమళ్లు అక్కడ పడి ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులకు రైతు సమాచారాన్ని అందజేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చందు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 7 చనిపోగా వాటిళ్లో ఓ నెమలి బతికి ఉందని గుర్తించి వెంటనే దుద్దెడ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. విషపు గుళికల వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

News April 13, 2024

జహీరాబాద్: విధులు నిర్వర్తించే చోటే ఉద్యోగులకు ఓటు

image

ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం ద్వారా ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌(EDC)తో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్‌ కేంద్రం నుంచే ఓటు వేసే అవకాశం రావడంతో పోస్టల్‌ బ్యాలెట్‌ తిప్పలు తప్పనున్నాయి. జహీరాబాద్‌ సెగ్మెంట్‌లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ డ్యూటీ చేసిన ఈడీసీతో ఓటు వేయవచ్చు.

News April 13, 2024

నోట్ల కట్టలతో వస్తున్న బీఆర్ఎస్: రఘునందన్‌రావు

image

ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నోట్ల కట్టలతో మన ముందుకు వస్తోందని, మాజీ మంత్రి హరీశ్‌రావు నంగనాచి మాటలను ప్రజలు నమ్మొద్దని బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. రామాయంపేటలో ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించారు. నామ్‌కేవాస్తేగా అసెంబ్లీ ఎన్నికల ముందు రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇప్పటికీ సిబ్బంది నియామకం లేదని ధ్వజమెత్తారు.

News April 13, 2024

కాంగ్రెస్ మోసాలు.. మన ప్రచార హస్త్రాలు: హరీష్ రావు

image

కాంగ్రెస్ మోసాలనే ప్రచార హస్త్రాలుగా వాడుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ను ఎండగట్టారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎల్ఈడీ స్కిన్ పై పార్టీ శ్రేణులకు చూపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై నిలదీయాలన్నారు.