India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దారిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కొమ్మ మింటూ అనే (16) బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది. శనివారం ఊరి శివారులోని చెరువులో దూకేశాడు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల 12 వేల 858 మంది ఉన్నారు. ఇందులో 8,95,777 పురుషులు, 9,16,876 మహిళలు, 205 ఇతరులున్నారు. సెగ్మెంట్లో సిద్దిపేటలో 2,36,474, మెదక్లో 2,16,748, నర్సాపూర్లో 2,26,154, సంగారెడ్డిలో 2,47,338, పటాన్చెరులో 4,07,419, దుబ్బాకలో 19,9,236, గజ్వేల్లో 2,79,489 మంది ఓటర్లున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 764 పోలింగ్ కేంద్రాలున్నాయి.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తి మీద సాము లాగా మారనుంది. మెదక్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేదా అతని భార్య నిర్మలను పోటీలో నిలపాలని అనుకుంటున్నారు. ఇదే స్థానంపై మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్ సైతం పోటీ చేయాలని చూస్తున్నారు. సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య(55) శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు వేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ నడవకపోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.