India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లా మాసాయిపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు నాగరాజు మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. మార్చి 28న పాఠశాలలో విధులు ముగించుకొని చేగుంటలో తన నివాసానికి చేరుకున్న టీచర్ 29 నుంచి కనిపించకుండా పోయారు. 31న నాగరాజు కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నేటి వరకు సదరు టీచర్ ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.

సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేసిన ఘటన అమీన్పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయిభగవాన్ కాలనీలో ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫోన్కు పార్ట్ టైం జాబ్ అంటూ లింక్ వచ్చింది. తొలుత పెట్టుబడి పెట్టి టాస్క్లు చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పడంతో రూ.5 వేలు పెట్టుబడి పెడితే కమీషన్ వచ్చింది. దీంతో పలు దఫాలుగా రూ.11.10 లక్షలు పంపాడు. అనంతరం మోసపోవడంతో బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

తండ్రి మందలించాడని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI మహేశ్వర్రెడ్డి వివరాలు.. గుమ్మడిదల చెందిన బాలేశ్ చిన్న కుమారుడు నవీన్(24) ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. నవీన్ ఈనెల 4న డబ్బులు అడగ్గా ఏ పని లేకుండా ఎన్ని రోజులు తిరుగుతావని తండ్రి మందలించారు. దీంతో నవీన్ అదే రోజు మధ్యాహ్నం పురుగు మందు తాగి సోదరికి ఫోన్ చేశాడు. సూరారాంరోని ఆసుపత్రిలో తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

ZHB లోక్సభ స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారికి ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ, ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ముందుకెళ్తుంది. మోదీతోపాటు పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభలకు BJP ప్లాన్ చేస్తుంది. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ పోరుకు BRS సన్నద్ధమవుతోంది.

మామ, అల్లుడిని ఇంటికి పంపే వరకు నిద్రపోనని మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు KCR, హరీశ్రావును ఉద్దేశించి అన్నారు. గజ్వేల్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటపై ఫోకస్ చేశానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలో దిగుతానని, గజ్వేల్లో నర్సారెడ్డి కూతురిని MLAని చేస్తానన్నారు. KCR, హరీశ్రావును వదిలిపెట్టనన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపుకు సమిష్టిగా కృషి చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మతోధు కలిసి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, కౌన్సిలర్ రవీందర్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు ఉమర్, సమీర్ ఉన్నారు.

జహీరాబాద్ పట్టణంలో మహ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణీక్ రావు, BRSఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ వేళలో ముస్లింలతో పాటు వీరంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండ్లు, ఫలాలు, విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ ముందు అతివేగంగా వచ్చిన బోర్వెల్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రామయంపేట 44వ జాతీయ రహదారిపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సమాచారంతో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి గుజరాత్ వెళ్తున్న ఒక లారీలో 304 క్వింటాల్ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. లారీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

9 ఏళ్లుగా పోని కరెంట్.. నేడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు పోతోందని BRS మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, MLC వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్ధన్నపేటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోతోందని, చెరువులు ఎండిపోయి.. కరవు వచ్చిందన్నారు. మళ్లీ KCR పాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.